కొల్లేరు సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రధమ → ప్రథమ, ఉన్నది. → ఉంది. (2), , → , using AWB
చి →‎అయిదో కాంటూరు వరకు ఆక్రమణల తొలగింపు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పలితం → ఫలితం using AWB
పంక్తి 108:
 
==అయిదో కాంటూరు వరకు ఆక్రమణల తొలగింపు==
కొల్లేరు 60శాతం ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు ఇచ్చినది, ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని, కట్టలు పోసి, చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40 శాతం సరస్సు మాత్రమే మిగిలి ఉంది. చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది.ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ సంస్థల పోరాటాల పలితంగాఫలితంగా [[2005]]లో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టింది.
కొల్లేరు సరస్సును అయిదో కాంటూరు వరకు విస్తరించాలంటే రైతుల దగ్గర నుంచి 15,335 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, దీనికి రూ.679.38 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ నిధులను విడుదల చేస్తేనే విస్తరణ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూములను తీసుకుని నష్ట పరిహారంగా ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఇందులో ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులనే విడుదల చేశారని, మిగిలిన నిధులనూ పూర్తిగా విడుదల చేస్తేనే కొల్లేరు విస్తరణ పనులు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు. కొల్లేరును అయిదో కాంటూర్ వరకు కాకుండా [[మూడో కాంటూర్]] వరకు విస్తరిస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం దానిని తిరస్కరించింది. మూడో కాంటూర్ లోపల 475 ఎకరాల రైతుల సొంత భూములను సేకరించడానికి రూ.21.38కోట్లు ఖర్చవుతుంది. అయిదో కాంటూర్ లోపలైతే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 13,899 ఎకరాలకు రూ.628.48 కోట్లు, కృష్ణా జిల్లా పరిధిలో 961 ఎకరాలకు రూ.30 కోట్లు వ్యయం అవుతుంది.కొల్లేరును అయిదో కాంటూరు వ్యన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా సంరక్షించాలని న్యాయస్థానాల ఆదేశాలు, ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటనల నేపథ్యంలో కొల్లేరును అయిదో కాంటూరు వరకు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తెదేపా సహా దాదాపు అన్ని పక్షాల నాయకులు, పోటీచేసిన అభ్యర్థులు అంతా కొల్లేరును మూడో కాంటూరు వరకే పరిమితం చేసి, వ్యవసాయానికి, జలసాయానికి, కొల్లేటి ప్రజల ఉపాధికి ఢోకా లేకుండా చేస్తామని హామీలు గుప్పించేశారు. కొల్లేరును మూడో కాంటూరు వరకే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉంచాలని కేంద్రానికి కోరుతూ అసెంబ్లీలో తీర్మానించారు. న్యాయస్థానాల ఆదేశాలకు వ్యతిరేకంగా నాయకులు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, అసెంబ్లీ తీర్మానం కేంద్రంలో చెల్లుబాటు కాలేదు. ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అయిదో కాంటూరు వరకూ కొల్లేరును రక్షించాల్సిందేనని ఎన్నికల అనంతరం స్పష్టం చేసింది. కొల్లేట అయిదో కాంటూరు వరకు ఉన్న చేపల చెరువులను ధ్వంసం చేసి, వాటిపై ఆధారపడి ఉన్న ప్రజల పునరావాస ప్యాకేజి అమలు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2005 నుంచి ఇంతవరకు సుమారు రూ.80 కోట్లు వ్యయం చేసింది. అయినా ఆశించిన ఫలితం ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ధ్వంసం చేసిన చెరువులనే పునరుద్ధరించడం ప్రారంభించారు. వీటిని మళ్లీ ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది జూన్‌లో జిల్లాకు నీటిపారుదల శాఖ ద్వారా రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేసింది. పార్టీలన్నీ ఎన్నికల్లో మూడో కాంటూరు వరకే కొల్లేరును పరిమితం చేస్తామని హామీలిచ్చి, ఇప్పుడు అయిదో కాంటూరు వరకూ అంటున్నారని [[గుడివాకలంక]] తదితర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు చెరువులను ధ్వంసం చేయించడానికి కొలతలు వేస్తుంటేనే జిరాయితీ రైతులు అభ్యంతరాలు తెలుపుతూ అడ్డుకుంటున్నారు.అయిదో కాంటూరు లోపల చెరువులను పునర్ధురిస్తున్నారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణాధికారులు ఇంతవరకు 200కి పైగా ప్రజలపై కేసులు నమోదు చేశారు.
==కేంద్రం చేతిలోకి కొల్లేరు==
"https://te.wikipedia.org/wiki/కొల్లేరు_సరస్సు" నుండి వెలికితీశారు