గుణసుందరి కథ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరిక్ష → పరీక్ష, హైదరాబాద్ → హైదరాబాదు, ) → ) (3), ( → ( (3) using AWB
చి →‎చిత్ర కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., ప్రార్ధన → ప్రార్థన, ప్రార్ధిస్తూ using AWB
పంక్తి 28:
imdb_id = }}
==చిత్ర కథ==
ఈ కథ [[పార్వతీ|పార్వతి]] [[పరమేశ్వరులు|శివుడు]] విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తూప్రార్థిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక [[ఎలుగుబంటి|ఎలుగు]] కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కథ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆ కథను వివరిస్తూ ఉంటాడు.
ధారానగరాన్ని పరిపాలించే [[రాజు]] ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు కలరు. గుణసుందరి ([[శ్రీరంజని]]) కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు [[సభ]]కు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు [[తండ్రి]]ని తాము అందరికంటె ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమించాలని చెపుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ [[భర్త]] ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి ([[కస్తూరి శివరావు]]) ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్ళతో వివాహం జరుపుతాడు.
[[బొమ్మ:Gunasundari-katha-1.jpg|250px|thumb | left | గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
[[బొమ్మ:Gunasundari-katha-2.jpg|250px|thumb | right|గుణ సుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
తదనంతరం ఒకానొక సంధర్భంలోసందర్భంలో ఆ ముదుసలి వినికిడి వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం, అతడు తన మేనళ్ళుళ్ళతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ళ ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. అ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ల పైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణసుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. భర్తతో కలసి సామాన్యజీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్ళిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకొంటానని చెపుతూ చేయి పట్టుకొంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెపుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కథను రాసి ఆమెను వెంటాడిన యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరీక్షీంచక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరశేనుడని తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానైకి గురియైన వైనమ్ చెప్పి, దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకొంటాడు. గుణ సుందరి ఇంటినుండి వెళ్ళిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్ళు అతడికి సేవచేయక సూటి పోటి మాటలని తమ భర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ళ గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. అంజనం ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెపుతారు పండితులు. అది తెచ్చిన వారికి తనరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు.
[[బొమ్మ:Gunasundari-katha-3.jpg|250px|thumb | left | గుణసుందరి కథ సినిమా నుండి ఒక సన్నివేశము]]
తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన గుణ సుందరి తన భర్తను ఆ మణిని తీసుకొచ్చి తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించమని వేడుకొంటుంది. వీరశేనుడు ముసలి రూపునే మణి కోసం బయలుదేరుతాడు. ఇటు రాజు పెద్ద అళ్ళుళ్ళు కూడా బయలుదేరుతారు. వీరశేనుడు మణి సాధనలో తన తెలివితేటలతో దారిలో ఎదురైన ఆపదలను గట్టెక్కి, అక్కడ ఉన్న యక్షిణులను గెలిచి తన తోడళ్ళుళ్ళతో పాటు అక్కడకు చేరుకొని అక్కడ యక్షిణి ద్వారా మంత్రం నేర్చి మహేంద్రమణిని సాధిస్తాడు. అందరూ తిరిగి వస్తుండగా ఒక రాత్రి నిద్రిస్తున్న వీరశేనుడి తలపై మోది అతడిని బావిలో తోసి మణి తీసుకొని పారొపోతారు అతడి తోడళ్ళుళ్ళు ఇద్దరూఇద్దరు. ఇక్కడ పల్లెనుండి గుణసుందరి రాజును వెళ్ళి చూసేందుకు వెళ్ళగా ఆమె అక్కలు ఆమెను అవమానించి ఆమె భర్త గురించి అవమానంగా మాట్లాడటంతో ఆవేశంలో నిజం చెప్పేస్తుంది. అక్కడ బావిలో వీరశేనుడు బల్లూకంగా మారిపోతాడు. [[మణీ|మణి]]ని తీసుకొని వచ్చిన రాజు అళ్ళుళ్ళు దాని మంత్రం గాయాలను మాన్పలేకపోతారు. బల్లూకంగా మారిన వీరశేనుడు జనాలు తరుముతుంటే పల్లెకు వస్తాడు. గుణ జనాలనుండి కాపాడి తన ఇంటికి తీసుకుపోయి క్షమించమని ఆవేశంలో చెప్పేసానని ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తుందిప్రార్థిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రార్ధనకుప్రార్థనకు మెచ్చి కోయరూపాలలో ఆమెను, బల్లూకాన్ని వెంటబెట్టుకొని రాజు దగ్గరకు వచ్చి వీరశేనునికి పూర్వరూపం ఇచ్చి అతడి గురించి అందరికీ వివరిమ్చి గుణసుందరి పాతివ్రత్యకారణంగానే తాము మెచ్చి భువికి వచ్చామని చెప్పి నిజరూపాలతో అందరికీ ధర్శనమిచ్చి అదృశ్యమవుతారు.
==వివరాలు==
*'''చిత్రం పేరు''' - గుణసుందరి కథ
"https://te.wikipedia.org/wiki/గుణసుందరి_కథ" నుండి వెలికితీశారు