జటప్రోలు సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, లు యొక్క → ల యొక్క, అభివృద్ది → అభివృద using AWB |
||
పంక్తి 1:
[[దస్త్రం:Kollapur palace.JPG|thumbnail|కొల్లాపూరులోని సంస్థానపు రాజభవనము]]
'''జటప్రోలు సంస్థానము''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లో [[కృష్ణానది]] తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానము. ఈ సంస్థానాధీశులు [[కొల్లాపూర్|కొల్లాపూరు]]ను రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని '''కొల్లాపూరు సంస్థానమని'''కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట [[జటప్రోలు]] రాజధానిగా పాలించి తర్వాత కొల్లాపూర్, [[పెంట్లవెల్లి]] రాజధానులుగా పాలించారు. ఈ సంస్థానం [[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న సువిశాలమైన [[నల్లమల్ల]] అటవీ ప్రాంతమునందు విస్తరించి ఉండేది. వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైందనే విషయం ఖచ్చింతంగా వెలుగులోకి రాలేదు. అయితే చారిత్రక పరిశోధకుల ప్రకారం క్రీ.శ.6-7 వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరికి సురభి సంస్థానాధీశులందురు. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు ఉన్నాయి. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. కృష్ణా నది ఒడ్డునే కల సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. [[నిజాము]] యొక్క పరిపాలనలో జటప్రోలు సంస్థానము చెప్పుకోదగిన పాత్ర
[[File:Sri Venugopala Swamy Temple, Jataprolu.jpg|thumb|శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, జటప్రోలు]]
==స్థాపన==
పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల యొక్క మూలపురుషుడే కాక, [[గంజాం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజ వంశము, గోదావరి జిల్లాలోని [[పిఠాపురం]], [[కృష్ణా జిల్లా]] లోని [[మల్లేశ్వరం]] మరియు [[నెల్లూరు]] జిల్లాలోని [[వెంకటగిరి]] మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని భావిస్తారు. 15వ శతాబ్దం చివరిలో ఈ వంశానికి చెందిన మాదానాయుడు కృష్ణ, తుంగభద్ర సంగమ సమీపంలోని జటప్రోలు ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో విజయనగర రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి సనదు (ప్రభుత్వ ఉత్తర్వు) ను పొందాడు. [[శ్రీకృష్ణదేవరాయలు|కృష్ణదేవరాయల]] పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఈయనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన [[గోల్కొండ|గోల్కొండ సామ్రాజ్యం]]పై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయున్ని కూడా పిలిపించాడు. ఆ సంవత్సరం [[రాయచూరు అంతర్వేది]]లో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానము కూడా పాల్గొన్నది.
[[ఔరంగజేబు]] దక్షిణాపథంపై దండెత్తి [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్షాహీ]]లను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తన నియమించిన దండనాయకుని ఆధీనంలో వీటిని తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం యొక్క స్వాధికారత మరియు ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు యొక్క ప్రాబల్యాన్ని దక్షిణాన జటప్రోలు నుండి ఉత్తరాన పానగల్, యల్జల్ల వరకు విస్తరించి పటిష్ఠపరచాడు. 1694లో సంస్థానాధీశుడైన నరసింగరావు మొఘలులపై తిరుగుబాటు చేసి మొఘులుల మల్లయోధున్ని బంధించి, గంజికోట ([[గండికోట]]) మరియు [[శ్రీకాకుళం]]పై ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. మొఘలులు ఈయన్ను తృప్తిపరచడానికి వీటిపై అధికారమిచ్చారు. జటప్రోలుకు తొంభై మైళ్ళు దక్షిణాన ఉన్న గండికోటను అడగటంలోని ఆర్ధం ఉంది కానీ, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అడగటానికి హేతువు తెలియుటలేదు.<ref>[http://books.google.com/books?id=aWZFmoE3SaIC&pg=PA32&lpg=PA32&dq=jataprolu#v=onepage&q=jataprolu&f=false Kingship and Colonialism in India's Deccan: 1850-1948]</ref>
19వ శతాబ్దం చివరలో జటప్రోలు సంస్థాధీశునికి సంతానము కలుగక వారసుడు లేని పరిస్థితి వచ్చింది. అప్పటికే పొరుగు సంస్థానాలైన వనపర్తి, గద్వాలలో జరుగుతున్న వారసత్వపు పోరులను గమనించిన జటప్రోలు రాజు, ముందు జాగ్రత్త చర్యగా వెంకటగిరి రాజకుమారున్ని దత్తత పుచ్చుకున్నాడు. ఈయన జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి ''రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్'' అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు [[1929]]లో మరణించాడు.
[[బొమ్మ:Wooden Ratha Jataprolu.JPG|right|thumb|జటప్రోలు సంస్థానానికి చెందిన [[రథం]] <br /> (''[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మ్యూజియమ్]] లో భద్రపరచినది'') ]]
జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన 'సురభి' రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. [[కొల్లాపూర్]] ప్రాంతంలో చారిత్రక భవనాలు, దేవాలయాలతో పాటు అనేకం సురభి రాజ వంశీయులు నిర్మించినవే. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, [[సింగపట్నం]]లోని నృసింహ సాగరాన్ని మాధవరాయుడు, [[పెంట్లవెల్లి]] గ్రామంలోని కోటను, చెరువును, శివ కేశవాలయాన్ని చిన్నమాధవ రావు, కొల్లాపూర్ కోటను ప్రథమ వేంకటలక్ష్మా రావు, [[జటప్రోలు]] మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు, [[బెక్కం]], [[చిన్నమారూర్|చిన్నమారూరు]] కోటల్ని నరసింగ రావులు నిర్మించారు. వీటితో పాటు శింగవట్నంలోని శ్రీవారి సముద్రం, జటప్రోలు హజ్రత్ ఇనాయత్ షా ఖాద్రి దర్గా, అద్దాల మేడ, కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్ గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు.
సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా
సురభి రాజ వంశ వారసుడైన బాలాదిత్య లక్ష్మారావు (ఇతను సంస్థానం చివరి రాజు జగన్నాథరావు కుమారుడు) [[హైదరాబాదు]]లో నివాసం ఏర్పరుచుకున్నారు. కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా
==మూలాలు==
|