డొక్కల కరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భీభత్స → బీభత్స, → using AWB
పంక్తి 1:
[[1832]]-[[1833]]లో [[గుంటూరు]] జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా [[కరువు]]ను '''డొక్కల కరువు''', '''నందన కరువు''' లేదా '''గుంటూరు కరువు''' అని పిలుస్తారు. [[1831]]లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి<ref name=mng.net> [[మంగళగిరి]] చరిత్ర వ్యాసంలో [http://www.mangalagiri.net/history.html#droughts డొక్కల కరువు ప్రస్తావన]. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007. </ref>. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు భీభత్సంబీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.
 
కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు <ref name=anti-caste> కులానికి వ్యతిరేకంగా రాసిన ఒక జీవిత చరిత్ర సంగ్రహంలో డొక్కల కరువు ప్రస్తావన [http://www.anti-caste.org/sujathas-book-first-chapter.html పదొవ పేరా] లో చూడండి. - సేకరించిన తేదీ: జూన్ 28, 2007. </ref>. అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు.
== దాతలు ==
పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:
* [[సి.పి.బ్రౌన్]] : 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు.
* [[ఏనుగుల వీరాస్వామయ్య]] : ప్రవృత్తి రీత్యా యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు, వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
* [[కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై]] : చెన్నపట్టణంలో సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన శ్రీనివాసపిళ్ళై దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు.<ref name="కాశీయాత్ర చరిత్ర" />
పంక్తి 14:
<references />
*[http://www.kadapa.info/telugu/డొక్కల_కరువు/ డొక్కల కరువును గూర్చి రాయలసీమలో జానపదులు పాడుకునే పాట]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
"https://te.wikipedia.org/wiki/డొక్కల_కరువు" నుండి వెలికితీశారు