త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (11) using AWB
పంక్తి 4:
 
==బాల్యము మరియు తొలి నాళ్లు==
రామస్వామి చౌదరి [[రైతు]] కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన [[పల్నాటి యుద్ధము]] ఆధారముగా ''కారెంపూడి కదనం'', [[మహాభారతం|మహాభారత]] యుద్ధము ఆధారముగా ''కురుక్షేత్ర సంగ్రామము'' అను రెండు నాటికలు రచించాడు. [[1911]] లో ఇంటర్మీడియట్ చదవడానికి [[బందరు]] లోని [[నోబుల్ కాలేజీ]]లో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
 
భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, అతను కొన్ని సంవత్సరాలు తెనాలి పట్టణంలో న్యాయశాస్త్రం వృత్తిని చేపట్టారు. అయితే కొలది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవుర్తులను మార్చుకునారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలను మరియు మత అరచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు.
 
==రాజకీయ జీవితం, సంఘ సంస్కరణ==
[[1898]] లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. [[1910]]లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, [[త్రిపురనేని గోపీచందు]]. [[1914]] లో న్యాయ శాస్త్రం చదివేందుకు [[డబ్లిన్]] వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే [[అనీ బీసెంట్]] ప్రారంభించిన [[హోం రూల్ ఉద్యమం]]కు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ [[కృష్ణా పత్రిక]] లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక [[దేశభక్తి గీతాలు]] రచించాడు.
 
[[1917]] లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు [[మచిలీపట్నం]]లో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. [[1922]] లో [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]] లో స్థిరపడ్డాడు. [[1925]] లో [[తెనాలి]] పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. [[1938]] వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు.
 
[[1920]] లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని పెళ్ళి చేసుకున్నాడు. [[1932]] లో ఆమె చనిపోగా, అన్నపూర్ణమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ''సూతాశ్రమం'' అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
 
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్ళిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. [[1943]] [[జనవరి 16]] న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
పంక్తి 70:
*''రాణా ప్రతాప్'' నాటకం అచ్చులో ఉండగానే ప్రభుత్వనిషేధానికి గురైంది.
*1913లో బొంబాయి వెళ్ళి న్యాయశాస్త్రం అధ్యయనం చేశారు. 1914లో డబ్లిన్ లో బారిష్టర్ డిగ్రీ పొందారు .అక్కడే 'శంబూక వధ'. నాటకం రాశారు.
*1930లో ఆయన రాసిన ''వివాహవిధి'' లో మంత్రాలు, వేద పండితులు ప్రమేయం లేకుండానే అచ్చమైన తెలుగు భాషలో వధూవరులిద్దరూ ప్రమాణాలు చేయడంతో వివాహం పూర్తవుతుంది.
*ఆయన రచనల్లో ''అంపకం'', స్వర్గం, నరకం'' తదితర గ్రంథాలు లభ్యం కావడం లేదు
*కురుక్షేత్రం'' నాటకంలో పాండవులకు రాజ్యాధికారం లేదంటాడు.