కొత్త రాజబాపయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 44:
1937-38 మధ్యకాలములో [[రేపల్లె]] ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు. 15 సంవత్సరాలు గణితోపాధ్యాయునిగా, 15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు. లెక్కల ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించాడు. పర్యవేక్షణ లేని పరీక్షలు జరిపి, వ్యతిరేకత ఎదురైనా పరీక్షలు చక్కగా నిర్వహించి విద్యాశాఖాధికారుల మెప్పు పొందాడు. కూచిపూడి కోగంటి వారి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నపుడు రాజబాపయ్య క్రమశిక్షణకు, లెక్కలు చెప్పే విధానానికి ముగ్ధులై విద్యార్థులు ఎన్నో మైళ్ళ దూరం నుండి నడచి వచ్చి చదువుకునేవారు.
ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రయోగాలు చేసిన రాజబాపయ్య విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యా సలహా సంఘానికి సభ్యునిగా పనిచేశాడు. రాజబాపయ్య చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా 1964-65 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని [[రాష్ట్రపతి]] [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా తీసుకున్నాడు.
వృత్తే ప్రాణంగా బ్రతికిన రాజబాపయ్య 1964 జూన్ 24న గుండెపోటుతో మరణించాడు.
|