దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ళను గురించి → ళ గురించి (2), పని చేసాడు → పనిచేసాడు, → ( using AWB
పంక్తి 36:
}}
 
'''దోమా వేంకటస్వామిగుప్త''' దోమా కోటాంబ, దోమా గోవిందప్ప శ్రేష్ఠి దంపతులకు కర్నూలు పట్టణంలో జన్మించాడు. సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు. స్కూలు ఫైనల్ ఇంగ్లీషు మీడియంలో చదివాడు. అష్టావధానాలు, శతావధానాలు చాలా చేశాడు. ఆశుకవిత్వం చెప్పాడు. అనేక చోట్ల ఇతడు సన్మానాలు పొందాడు. ఇతడు హరికథారచయిత, కవి, నాటక కర్త, విమర్శకుడు, శతకకర్త మరియు నవలారచయిత. '''చంద్రిక''' అనే పత్రికకు సంపాదకుడు.
 
==కవితా వ్యాసంగం==
పదకొండు సంవత్సరాల వయసులోనే కవితావ్యాసంగం ప్రారంభించాడు.
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి అనకాపల్లి వాస్తవ్యులు రేపాక సత్యనారాయణ రచించిన గ్రంథం ఆధారంగా ఈయన “కన్యకాపురణ పరిశీలన” అనే సిద్ధాంత గ్రంథం రాసి “ఎం.ఫిల్” పట్టాని పొందాడు. ఇతని ఉద్యోగపర్వం 1916 వ సంవత్సరంలో ప్రారంభమైంది. కంచి పచ్చయప్ప ఉన్నత పాఠశాలలో, మద్రాసు క్రైస్తవ కళాశాలలో, పెరంబూరులోని కళాశాల, విజయవాడలో యస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాల మొదలగు చోట్ల తెలుగు పండితుడిగా, ఆంధ్రోపన్యాసకునిగా పని చేసాడుపనిచేసాడు. 1933 లో విద్వాన్ పట్టాని పొందినాడు. గుప్త 2-2-1938లో [[మహాత్మా గాంధీ]]ని కలసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన కళనుకళ గురించి వినిపించగా అది విన్న మహాత్ముడు, ఆశ్చర్యపడి అవధాన విద్యను అభ్యసించేందుకు శారదోపాసన అవసరమౌతుందని అభిప్రాయ పడ్డాడు.
సాహితీ ప్రముఖులుగా ప్రశస్తిగన్న [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చిలుకూరి నారాయణరావు]], [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] మొదలైనవారు ఇతని అవధానసభల్లో అగ్రాసనాధిపులు గానో పరీక్షకులు గానో ఉండి సభలను రంజిపజేసినారు.
[[తిరుపతి వేంకటకవులు]] గుప్త యొక్క విద్యగురువులు. గుప్త చేసే ప్రతి అవధానంలో ప్రారంభంలో ఈ కవుల గురించి ఏదో ఒక పద్యము చెప్పి గురుస్తుతి చేసేవాడు.
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,000 పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.
==అవధాన ప్రస్థానం==
ఇతడు తన 16 యేటనే అవధానాలు చేయడం ప్రారంభించాడు. ఇతడు సుమారు 300 అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు చేసిన అవధానాలలో గుంటూరు ఆవధానాలు, చీరాల అవధానం, జాండ్రపేట అవధానం, మద్రాసు అవధానం, రాజమండ్రి అవధానం ముద్రించబడ్డాయి. ఇతర అవధానాలలోని పద్యాలను సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=165-170|edition=ప్రథమ|accessdate=23 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
ఇతడు పూరించిన కొన్ని అవధాన పద్యాలు:
పంక్తి 63:
 
==రచనలు==
# '''శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణము''': ఈ గ్రంథాన్ని 1929లో వ్రాయడం మొదలుపెట్టి 18 సంవత్సరాలు ఎంతో శ్రమకోర్చి సంస్కృతం నుండి తెలుగులోనికి అనువాదం చేశాడు. 1947లో ప్రచురింపబడింది. దీనిలో గణేశ ఖండము, ప్రకృతి ఖండము, శ్రీకృష్ణ జన్మఖండము మొదలైన ప్రకరణలతో 14వేల పద్యాలు ఉన్నాయి.
# '''శ్రీ పరకాల విలాసము''' : వెయ్యి పద్యాలతో కూడిన గ్రంథము. తిరుమంగై అళ్వారు చరిత్ర.
# '''ప్రేమాభిరామము''' : 600 పద్యాలు కలిగిన శృంగార ప్రబంధం.
# '''శ్రీ కన్యకాపురాణము''': 18 సంవత్సరాలకు పైగా శ్రమించి అనేక గ్రంథాలను పరిశోధించి వ్రాసిన పద్యకావ్యము. 15వందల పద్యాలున్నాయి.
# '''అవధాన కవితామంజరి''' : అవధానాలలో చెప్పిన పద్యాలు.
# '''శ్రీ గోమాతృ గౌరవము''': గోమాతనుగోమాత గురించి వ్రాసిన 400 పద్యాలతో కూడిన కావ్యము.
# '''శ్రీ చంద్రకళా సుదర్శనము''' : దేవీభాగవతములోని ఒక కథ ఆధారంగా వ్రాసిన నాటకము
# '''దూతాంగదము''' : నాటకము. సంస్కృత నాటకానికి అనువాదము.
పంక్తి 82:
# '''శ్రీ వీరరాఘవ శతకము'''
# '''శ్రీ కామేశ్వరి శతకము'''
# ''' శ్రీ గంగాలహరి''' (అనువాదం)
# '''ముకుందమాల''' (అనువాదం)
# '''రోహిదాను'''