నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), సాంప్రదాయా → సంప్రదాయా using AWB
పంక్తి 36:
}}
 
'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' ([[మార్చి 31]], [[1933]] - [[జూన్ 7]], [[2011]] ) [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్దనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఆజన్మ [[బ్రహ్మచారి]] . ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన ''లాస్య'' నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే ''పేరిణి శివతాండవం'' ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికిసంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం'' గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, [[పిఠాపురం]] లోని ''కుంతీమాధవ మందిరం'' లో ప్రదర్శింపబడుతోంది. [[జూన్ 7]], [[2011]] వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి లోఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈయన మరణించాడు.
 
==గురువులు, నాట్య ప్రస్థానం==
ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో [[మార్చి 31]], [[1933]] న జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి నాట్యంకోసం జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో [[మీనాక్షి సుందరం పిళ్ళై]], [[వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి]], ''శ్రీమతి నాయుడుపేట రాజమ్మ'', మరియు ''పెండెల సత్యభామ''లు ఉన్నారు. ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం'' [['కుమార సంభవము]] [[మేఘ సందేశం]]'. [[ఉజ్జయిని]] లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'', ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.
 
[[ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ]]కి ఒకప్పుడు ఛైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నాడు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన ''సాత్వికాభినయము'' చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండుడు.
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు