సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సత్యాగ్రహం''' అంటే [[సత్యం]] కోసం జరిపే పోరాటం. [[అహింస]] మూలధర్మంగా, [[సహాయ నిరాకరణ]] మరియు [[ఉపవాసదీక్ష]] ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. [[మహాత్మా గాంధీ]] [[సెప్టెంబరు 11]], [[1906]] న [[దక్షిణ ఆఫ్రికా]] లో దీనిని ప్రారంభించాడు. అంతేకాక స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. [[అమెరికా]] సంయుక్త రాష్ట్రాలలో పౌర హక్కుల ఉద్యమ కాలంలో ఈ ఉద్యమం మార్టిన్ లూథర్ కింగ్ ను కూడా ఈ ఉద్యమం బాగా ప్రభావితం చేసింది. [[గౌతమ బుద్ధుడు]] ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, [[యేసు క్రీస్తు]] అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం.
 
సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.
 
"సత్యాగ్రహం" అనే మాటలో "కోపం" అని అర్థం వచ్చే మాట వున్నా.... నిజానికి ఇందులో ఎలాంటి కోప తాపాలకు, దౌర్జన్యాలకు తావులేదు. అత్యంత శాంతి యుతంగా సాగుతుంది ఈ నిరసన. తమ నిరసనను తెలియజెయడానికి, తమ కోర్కెలను నెరవేర్చు కోడానికి, తమ డిమాండ్లను సాధించుకోడానికి ఇలా ఎన్నో వాటికి ఈ సత్యాగ్రహాన్ని వాడు కుంటున్నారు. వ్వక్తులు, సంస్థలు, ప్రజలు, విధ్యార్తులు, ఉపాద్యాయులు, ఉద్యోగస్తులు, కార్మికులు ...... ఒకరని ఏమే లేదు. ప్రస్తుత కాలంలో ఇది సర్వ సాధారణ కార్య క్రమం అయి పోయింది. ఇందులో భాగమైన నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష. సత్యాగ్రహం, నిరాహార దీక్ష అనగానే అందరికి గుర్తు వచ్చేది మన మహాత్మా గాంధి. నిజానికి నిరాహార దీక్షను మొట్ట మొదట రాజకీయాస్త్రంగా ఉపయోగించింది మహాత్మా గాందీనే. సత్యాగ్రహం అనే ఆయుదంతో ఆతి పెద్ద ఘన కార్యాలు సాదించిన వారు చాల మందే వున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారిలొ ముఖ్యంగా చెప్పుకోదగ్గ వారు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు [[పొట్టి శ్రీ రాములు]] ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సుమారు 50 రోజులుకు పైగా దీక్ష చేసి ఆ దీక్షలోనె అతను మరణించాడు. దాని ఫలితమే [[ఆంధ్ర రాష్ట్రం]] అవతరించింది. తమ నిరసనను తెలిపే అహింసా మార్గమే సత్యాగ్రహం. ఈ పద్దతి ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో వున్నది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన ఐఖ్యరాజ్య సమితి.... [[మహాత్మ గాంధి]] పుట్టిన రోజు అయిన [[అక్టోబర్]] రెండును "సత్యాగ్రహ దినోత్సవంగా" ప్రకటించాలనుకుంటున్నది.
==ఇవి కూడా చూడండి==
*[[అహింస]]
"https://te.wikipedia.org/wiki/సత్యాగ్రహం" నుండి వెలికితీశారు