అనగనగా ఒక చదువురాని ఓ బడుద్దాయి, పేరు సుబ్బారాయుడు (రేలంగి). అతని ఇంటిపక్కనే వుంటుంది కథానాయిక (అంజలీదేవి). ఆమెకు నాట్యం అంటే వల్లమాలిన అభిమానం. ఆమె నృత్యరీతుల కనువుగా సంగీతాన్ని చెప్పే మాస్టార్ని (అద్దాలఅడ్డాల నారాయణరావు) పెట్టుకుంటుంది. పక్కింట్లో నివసించే సుబ్బారాయుడు చేష్టలు ఆమెకు నచ్చవు. ఆమెపై మనసు పారేసుకొన్న సుబ్బారాయుడు తన మిత్రబృందం సభ్యుల సలహామేరకు తనకు సంగీతం వచ్చినట్లు ఫోజు పెడతాడు. ఆమె తన గురువును సుబ్బారాయుడి మీదకు ఉసిగొల్పుతుంది. సుబ్బారాయుడు తన గురువు సలహమేరకు మరో మిత్రుడు (ఏ.యం.రాజా) పాట పాడుతుంటే దానికి తగ్గట్టు పెదాలు కదుపుతూ సుబ్బారాయుడు అద్భుతంగా అభినయిస్తాడు. దాంతో కథానాయిక కూడా సుబ్బారాయున్ని ప్రేమించేదాకా వస్తుంది. అయితే అసలు గాయకుదు రాజా అని, సుబ్బారాయుడు కాదని తెలుసుకున్న నాయిక తన మనసు మార్చుకుంటుంది. సుబ్బారాయున్ని రక్షించుకోవడానికై మిత్రులు పన్నిన వ్యూహంలో భాగంగా సుబ్బారాయుడు చచ్చినట్లు నటిస్తాడు. కథానాయిక మనసు మార్చుకొని సుబ్బారాయుడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.