భలే భలే మగాడివోయ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==చిత్రకథ==
లక్కీ(నాని) మొక్కలపై పరిశోధన చేసే అధ్యయన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే లక్కీకి మతిమరపు అనే పెద్ద లోపం ఉంటుంది. దాంతో ముందు చేసే పనిని వదిలేసి రెండోపనిలోకి వెళ్లిపోతుంటాడు. దాని వల్ల తనకి చాలా సమస్యలు వస్తుంటాయి, పెళ్ళి కూడా కాదు. పిల్లనివ్వడానికి వచ్చిన పాండు రంగారావు(మురళీశర్మ) లక్కీకి ఉన్న లోపాన్ని తెలుసుకుని తనకి పిల్లనివ్వనని అంటాడు. ఇలాంటి సందర్భంలో ఓ రోజు నందన(లావణ్య త్రిపాఠి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తనకి కావాల్సిన వారికి సహాయం చేసి తనకి దగ్గరవుతాడు. అయితే లక్కీ తన మతిమరుపు వల్ల వచ్చే సమస్యలను తనకి అనుకూలంగా మలుచుకుంటూ నందన దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేస్తాడు. నందన వదిన(మధుమతి)ని ఓ సందర్భంలో కాపాడడంతో నందన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అప్పుడే నందన, పాండు రంగారావు కుమార్తె అని తెలుస్తుంది. అప్పటి నుండి అసలు కథ ప్రారంభమవుతుంది. తన ప్రేమను కాపాడుకోవడానికి పాండు రంగారావు దగ్గర నాటకం మొదలు పెడతాడు. అందులో భాగంగా తన స్నేహితుడు(వెన్నెల కిషోర్)ను లక్కీ పరిచయం చేస్తాడు. కానీ నందన ఇష్టపడే పాండు రంగారావు స్నేహితుడి కొడుకు అజయ్(అజయ్)కి ఎలాగైనా నందనకి లక్కీతో ఉన్న రిలేషన్ ని చెడగొట్టి తనవైపు తిప్పుకోవాలనుకుంటుంటాడు. మరి అప్పుడు లక్కీ ఏం చేస్తాడు? అజయ్ కి ఎలా బుద్ధి చెబుతాడు? పాండు రంగారావు మనసు మారుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
==తారాగణం==