[[ప్రకాశం జిల్లా]] [[ఆదిపూడి]] గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య, సరస్వతమ్మలకు [[1935]], [[సెప్టెంబర్ 10]] 10 న జన్మించారు. రాఘవయ్య సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవాడు. ఆయన తల్లిదండ్రులు దానధర్మాలు చేసి దాతలుగా పేరుపొందారు. మేనమామ శనగల రామదాసు కుమార్తె, సంగీత విద్వాంసురాలు సుశీలను [[1950]] మే 18న వివాహం చేసుకున్నాడు. పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి తద్వారా ఉన్నతోద్యోగాలను పొందాడు. ఆయన ఆగస్టు 15, [[2006]] లో మరణించాడు.
== విద్యాభ్యాసం, వృత్తి ==
జి.వి.సుబ్రహ్మణ్యం [[పర్చూరు]] గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించారు. [[నిజాం కళాశాల]]లో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీలో ఉండగానే [[బిరుదు వెంకటశేషయ్య]] వద్ద అలంకారశాస్త్ర విషయాలను అభ్యసించారు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లోనే ఎంఫిల్ చదివిన జి.వి.సుబ్రహ్మణ్యం విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచాడు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచినవారికి ఉద్యోగం కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. [[1975]] నుంచి [[1995]] వరకు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్ గా, ఆచార్యునిగా, 1995 నుంచి [[1998]] వరకు అతిథి ఆచార్యునిగా, 1998 నుంచి 2000[[000]] వరకు యు.జి.సి.ఎమిరటస్ స్కాలర్ గా పనిచేశారు.<ref>జి.వి.సుబ్రహ్మణ్యం జీవిత సంగ్రహం:గంగిశెట్టి లక్ష్మీనారాయణ:జి.వి.సుబ్రహ్మణ్యం అధికారిక వెబ్సైట్</ref> 1979లో '''ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము''' అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు.