జిల్లా కలెక్టరు కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), గా → గా , బడినది. → బడింది., కార్య క్రమ → కార్య using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జనాబా → జనాభా using AWB
పంక్తి 1:
[[భారత దేశం]]లోని భూభాగాన్ని అంతా [[రెవెన్యూ జిల్లా]]లుగా విభజించారు. ప్రతీ [[జిల్లా]]ను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసుల పరీక్షలలో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమిస్తారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా [[కలెక్టరు]], జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాబావుంటారుజనాభావుంటారు. భారతదేశంలో రమారమిగా 500 జిల్లాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో జిల్లాకు ఒక కలెక్టరు (ఐ.ఎ.ఎస్. ఉత్తీర్ణులై 8 సంవత్సరాల అనుభవం సంపాదించిన వారిని జిల్లా కలెక్టర్లుగా నియమిస్తారు), మరొక జాయింటు కలెక్టరు (జె.సి క్లుప్తంగా) ఉంటాడు. జె.సి. కూడా ఐ.ఎ.ఎస్ ఉత్తీర్ణుడై, పరిపాలనా రంగంలో అనుభవం సంపాదించడానికి, జిల్లా కలెక్టరు అజమాయిషీలో, జిల్లాలోని ఒక [[రెవెన్యూ డివిజన్]]కి అధిపతిగా ఉండి, ఆ [[రెవెన్యూ డివిజను]]ను పాలిస్తాడు. ఆ పాలన లో, వచ్చేసమస్యలను, జె.సి. పరిష్కరించలేక పోతే, కలెక్టరు సలహాతో వాటిని పరిష్కరిస్తాడు. ఆ విధంగా భవిష్యత్తు కలెక్టర్లు రూపు దిద్దుకుంటారు. భారతదేశంలో ఉన్న జిల్లాలను మరలా రెవెన్యూ డివిజన్లుగా (రెండు లేదా మూడు [[రెవెన్యూ డివిజన్| రెవెన్యూ డివిజన్లు]]) విడదీసారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజనుకి ఒక్కొక్క ఐ.ఏ.ఎస్ (శిక్షణ కోసం) ఉంటాడు. ఆ విధంగా 500 జిల్లాలకు 500 మంది ఐ.ఏ.ఎస్ అధికార్లు, 1000 నుంచి 1200 రెవెన్యూడివిజన్లకి 1000 నుంచి 1200 మంది శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్. అధికార్లు మొత్తం 1500 నుంచి 1700 ఐ.ఏ.ఎస్ అధికార్లు భారత దేశంలోని జిల్లాల పరిపాలనలో ఉంటారు. ఒక రెవిన్యూ డివిజన్ అధికారి అజమాయిషీలో కొన్ని [[తహసీల్దారు]] కార్యాలయాలు వుంటాయి.
 
ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం [[విశాఖపట్నం]] జిల్లా కార్యాలయంలోని సమాచార హక్కు ఫలకాల ఆధారంగా ఇవ్వబడింది. ఇతర జిల్లాలవివరాలకు కొంత తేడా వుండవచ్చని గమనించండి.