1937లో [[గుంటూరు]]లోని [[ఆంద్రా క్రిస్టియన్ కాలేజి]]లోకాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తి కమ్యూనిస్టు భావాలకు ప్రభావితమయ్యారు. తొలుత ఆర్.ఎం.ఎస్. (Railway Mail Service) లో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ రహస్య పత్రిక 'స్వతంత్ర భారత్' [[విజయవాడ]] నుండి [[శ్రీకాకుళం]] వరకు అన్ని రైల్వేస్టేషన్లలో కమ్యూనిస్టు అభిమానులకు సురక్షితంగా అందచేస్తుండేవారు. ఈ విషయాన్ని పసికట్టిన [[బ్రిటిష్]] ప్రభుత్వం శిక్షగా [[మద్రాసు]] ఆర్.ఎం.ఎస్. ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేసి ఏ పని యివ్వకుండా జీతం ఇస్తూ ఖాళీగా కూచోబెట్టారు. దీనితో విసుగెత్తి 1940లో ఉద్యోగానికి స్వస్తిచెప్పి బలరామమూర్తి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు<ref name=etukuri/>.