పెంచల కోన: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు తొలగించబడింది; [[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాల...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కధ → కథ (3), విబేధా → విభేదా, వున్నాయి. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
[[File:RSS at Penchalakona.JPG|thumb|పెంచలకోనలో [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సమావేశం మరియు శిక్షణ]]
 
చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి '''పెంచల కోన''' గా మారింది.దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.
== చరిత్ర ==
శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది. దీంతో ఆమే ధైర్య సాహసాలు, అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కధనంకథనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కధనంకథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు.
== ఆలయ విశేషాలు ==
తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం వుంది. నెల్లూరు జిలా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకధనంచరిత్రకథనం. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవి లోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెబుతుంటారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ వుంది.
 
==పెనుశిల నరసింహస్వామి దేవాలయం==
ఇక్కడ నరసింహస్వామి ఆలయం కలదుఉంది. ఇది నెల్లూరునకు 70 కిమీ దూరంలో కలదుఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విబేధాలువిభేదాలు లేక స్వామి వారిని దర్శించి పాపముల నుండి విముక్తులగుచున్నారు.
 
ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య [[పెనుశిల నరసింహస్వామి దేవాలయం]] చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో [[బ్రహ్మోత్సవాలు]] చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని ప్రతీతి. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు.
 
== ప్రయాణ మార్గాలు ==
పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు వున్నాయిఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమిటర్లు దూరం వుంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గం లోమార్గంలో బస్సు వసతి కలదుఉంది.
 
రైల్వే జంక్షన్‌ అయిన గూడూరు నుండి 70 కిలోమిటర్ల దూరం ఇక్కడి నుండి రోడ్దు మార్గాన రాపూరుకు చెరుకోని కోనకు వెళ్లవచ్చు. కడపజిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చెరుకోని ఇక్కడకి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమిటర్ల దూరం వుంది.
 
==[[కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి|"విజయేశ్వరీదేవి" ఆశ్రమము]]==
 
==[[కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి|"విజయేశ్వరీదేవి" ఆశ్రమము]]==
 
పెంచలకోనలో ఈ ఆశ్రమము ఉంది. ఆమె ఇక్కడ 30 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/పెంచల_కోన" నుండి వెలికితీశారు