పెద్దమనుషుల ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), విద్యార్ధు → విద్యార్థు, , → , using AWB
పంక్తి 1:
[[1956]] లో [[తెలుగు]] మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణా]] - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే [[తెలంగాణా]] నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి [[1956]] [[జూలై 19]] న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే '''పెద్దమనుషుల ఒప్పందం''' అన్నారు. [[న్యూ ఢిల్లీ]] లో [[పెద్దమనుషుల ఒప్పందం]] సంతకాలు చేసిన రోజు [[1956]] [[ఫిబ్రవరి 20]] అని కె.వి.రంగారడ్డి స్వీయచరిత్ర లోస్వీయచరిత్రలో రాసారు. సంతకాలు చేసిన వారు తెలంగాణా తరపున, [[బూర్గుల రామకృష్ణారావు]], [[కె.వి.రంగారెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]], [[జె.వి. నరసింగరావు]], ఆంధ్ర తరపున [[నీలం సంజీవరెడ్డి]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[అల్లూరి సత్యనారయణ రాజు]], [[గౌతు లచ్చన్న]]. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:
 
* కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
* తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకువిద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
* సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
* ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను [[ఉర్దూ]] వినియోగం కొనసాగాలి.