పెళ్లీడు పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , సంధర్భా → సందర్భా, అభివృద్ది → అభివృద using AWB
పంక్తి 16:
}}
 
'''{{PAGENAME}}''' సినిమా [[అన్నపూర్ణ పిక్చర్స్]] బేనరులో తీయబడిన సినిమాలలో అతి తక్కువ బడ్జెట్టుతో తీయబడిన సినిమా. [[దుక్కిపాటి మదుసూదనరావు]] ఈ చిత్రం ద్వారా అనేక మందిని తెరపరిచయం చేసాడు. ఈ చిత్రం అధిక భాగం [[అమరావతి]] దేవాలయము ప్రాంతములోనూ, [[వైకంఠపురం]] గ్రామ పరిసర ప్రాంతాలలోనూ చిత్రీకరించబడినదిచిత్రీకరించబడింది.
 
==కథాగమనం==
పి.వి.రావు ([[సోమయాజులు]]) చెల్లెలు చనిపోతూ తన ఇద్దరు కూతుళ్ళూ అయిన దుర్గ ([[సంగీత]]), శాంతి ([[విజయశాంతి]])లను వాళ్ళ ఆస్తిని అతనికప్పగించి పోతుంది. పి.వి.రావు వారి [[ఆస్తి]]ని స్వాదీనం చేసుకొని దుర్గకు ఒక పేదవాడైన చలపతి ([[శరత్ బాబు]]) తో పెళ్ళి చేస్తాడు. దుర్గ అతని దుర్మార్గం తెలుసుకొని చెల్లెను తెసుకొని వచ్చేసి [[పచ్చడి|పచ్చళ్ళు]], [[అప్పడం|అప్పడాలు]] తయారు చేస్తూ జీవిస్తుంటుంది. తన కాలేజీలోనే చేరిన పి.వి.రావు కొడుకు తనకు [[బావ]] అయిన సురేష్‌ను గుర్తించి అతడిని ఆట పట్టిస్తూంటుంది శాంతి, తన స్నేహితురాలైన [[అన్నపూర్ణ]] ([[సుమలత]])తో కలసి. అతడు కూడా ఆమె ఎవరో తెలుసుకొన్న తరువాత ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలెడతారు. వీళ్ళిద్దరి [[ప్రేమ]] విషయం తెలిసిన పి.వి.రావు తన కొడుక్కు ఆస్తి కోసం [[వల]] వేస్తున్నారని [[దుర్గ]], [[శాంతి]] లను తిట్టి వెళతాడు. అభిమానం దెబ్బతిన్న దుర్గ, [[మేనమామ]] అయిన పి.వి. రావు నడిపే [[హొటల్]] ఎదురుగా తనొక హొటల్ పెట్టి అభివృద్దిఅభివృద్ధి చేసి [[ఆస్తిపాస్తులు|ఆస్తిపాస్తుల]]ను సంపాదించి మేనమామ హొటల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. మనో వ్యాధితో మంచంపడతాడు పి.వి.రావు. శాంతికి అన్నపూర్ణ ప్రేమించిన సాయినాధ్ తో వివాహం నిశ్చయిస్తుంది దుర్గ. అది శాంతికి ఇష్టం లేక మేనమామ దగ్గరకు వెళ్ళి తన [[పెళ్ళి]] వేరే అతనితో జరగటం తనకిష్టం లేదని, బావను తప్ప వేరెవరినీ చేసుకోననీ చెబుతుంది. మార్పు చెందిన పీ.వీ.రావు శాంతికి అభయమిచ్చి తను చెప్పినట్టూగా చేయమని చెప్తాడు. అక్క నిర్ణయించిన పెళ్ళికి సిద్దమవుతుంది శాంతి. పి.వీ.రావు చలపతి, అన్నపూర్ణ, అన్నపూర్ణ తల్లి రమప్రభలతో కలసి పెళ్ళిలో చిన్న నాటకమాడి, పెళ్ళి కూతుళ్ళను మార్చి, అదే ఇంట్లో మేడమీద గదిలో శాంతి, సురేషుల పెళ్ళి జరుపుతాడు. అసలైన పెళ్ళి పందిరిలో అన్నపూర్ణ, సాయిచందుల వివాహం జరుగుతుంది. ఆఖరున పి.వీ.రావు నచ్చచెప్పడంతో దుర్గ కూడా రాజీ పడడంతో కథ సుఖాంతం అవుతుంది.
 
==తారాగణం==
పంక్తి 63:
 
==చిత్ర విషేషాలు==
అన్నపూర్ణ వారి లోవారిలో బడ్జెట్ చిత్రమైన పెళ్ళీడు పిల్లల్లో ఎన్నో విషేషాలు కలవుఉన్నాయి.
* ఈ చిత్రం దర్శకుడు [[బాపు]] యొక్క తొలి చిత్రం.
* సంగీత దర్శకుడు [[ఎమ్.ఎస్. విశ్వనాథన్]] యొక్క తొలి చిత్రమూ ఇదే.
* హీరోగా [[సురేష్]] తెర పరిచయమూ ఇదే చిత్రముతో జరిగింది.
* ప్రముఖ నటి [[షబనా ఆజ్మీ]] తమ్ముడైన [[బాబా ఆజ్మీ]] ఈ చిత్రానికి పొటోగ్రపీ అందించారు.
* అప్పటి వరకూ గౌరవనీయ పాత్రలను పోషించిన జె.వి.సోమయాజులు తొలిసారిగా ప్రతినాయకునిగా{విలన్} ఈ చిత్రంలో నటించారు. ఈ పాత్రను ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోరనే భయంతో ఆయన దుష్ట కార్యాలు చేసే సంధర్భాలలోసందర్భాలలో ఆయన ఆత్మ రూపం ఎదురుగా వచ్చి నువ్వు చేస్తున్న పనులు తప్పు అని వాదించే విదంగా ఒక పాత్రను రూపొందించారు.
* ఈ చిత్రాన్ని దుక్కిపాటి స్వర్గీయ [[సావిత్రి]] కి అంకితమిచ్చారు.
* చిత్ర నిర్మాత దుక్కిపాటి [[దేవదాసు]] సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో శ్రేయోభిలాషిగా వెళుతుండేవారు. ఆసినిమాకు సంగీత దర్శకుడైన [[సి.ఆర్. సుబ్బరామన్]] హఠాత్తుగా సినిమా మధ్యలో స్వర్గస్తులవడంతో మిగిలిన సంగీత బాధ్యతలు అప్పటికి ఆయన వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్న [[ఎమ్.ఎస్.విశ్వనాధన్]] నిర్వహించారు. అంతేకాక ఆణిముత్యాలవంటి '''జగమేమాయ''' వంటి పాటలను కూడా అందించారు. ఆసమయంలో దుక్కిపాటి ఆయనకు తన సినిమాలో పూర్తి సంగీత కర్తగా అవకాసం ఇస్తానని అన్నారు. అప్పటి మాట పెళ్ళీడు పిల్లలతో నెరవేర్చుకొన్నారు.
* ఈ చిత్రంలో [[విజయశాంతి]] నటన చూసిన దుక్కిపాటి ఆమెను అభినందిస్తూ నువ్వు సరిగా నటించగలిగితే [[సావిత్రి]] తరువాత ఆమె అంతటి నటివి కాగలవని అంటూ సినిమా పూర్తి అయిన తరువాత అప్పట్లో ఖరుదుగల '''సోనీ టూ ఇన్ ఒన్''' బహుమతిగా ఇచ్చారు.
"https://te.wikipedia.org/wiki/పెళ్లీడు_పిల్లలు" నుండి వెలికితీశారు