పేరిణి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), లను గురించి → ల గురించి , కూడ → కూడా (3), ప్రతి using AWB
పంక్తి 1:
'''పేరిణి నృత్యం''' లేదా '''పేరిణి శివతాండవం''' [[ఆంధ్రప్రదేశ్]] లో ఒక ప్రాచీన [[నృత్యం]]. ఇది కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన నాట్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు [[శివుడు|పరమ శివుడి]] ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు.<ref>http://www.indiainfoweb.com/andhra-pradesh/dances/perini.html</ref>
[[ఓరుగల్లు]]ను దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న [[రామప్ప దేవాలయం]] లో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు.
 
కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య [[నటరాజ రామకృష్ణ]] కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
పంక్తి 17:
ఆ మృదంగ భంగిమల్ని పరిశీలించి అభ్యసించగలిగాను. ఆ మృదంగ ధ్వనుల్ని మార్దంగికునికి నేర్పి వాయింప జేశాను. నేను పేరిణి తాండవాన్ని పునర్మించటానికి ఆ మాతృకలే నాకెంతో సహాయ పడ్డాయి. ప్రతి శబ్దానికి ఉత్పత్తి, పరా కాష్ట. అంతర్దానం అనే మూడు దశ లున్నాయి. ఆ నాదోత్పత్తి, విజృంభణ నిశ్చ'''పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం.'''
 
పద్దతలనుపద్దతల గురించి వివరంగా తెలిసి యున్న నర్తకుడు ఏ రూపాన్నైనా సృష్టించగలడని నాదృఢ విశ్వాసమంటారు రామ కృష్ణగారు.
==శైవమత విజృంభణ==
 
[[కాకతీయ సామ్రాజ్యం]]లో శైవం, వీరశైవం విశృంఖలంగా విజృంభించింది. ఆరోజుల్లో పశుపతి సాంప్రదాయం, వీరశైవం ముమ్మరంగా ప్రచారంలో వుంది. పశుపతులూ, మహేశులూ, వీర శైవులూ, మైలారదేవులూ, వీరందరూ శైవ మతాన్ని స్వీకఫ్రించిన వారే. ప్రతి రోజూ వీరు ఆరుసార్లు శివుని నృత్యరీతుల్లో ప్రార్థనలు చేసేవారు. అందువల్లనే శైవ నృత్యాలు అత్యంత ప్రచారంలోకి వచ్చాయి. శివాలయాల్లో పురుషులే నృత్యం చేసేవారు. దేవుని దర్బారని పిలువబడే కళ్యాణమండపాలలో స్త్రీలు [[కేశిక నృత్యాల]]ను చేసేవారు. దేవాలయాల్లో చేసేది సంప్రదాయ సిద్ధమైన నృత్యాలు. ఇవి అనేక తాళగతులకు చెందేవిగా వుంటాయి. తాండవంలో అభినయానికి అంతగా తావు లేదు. శివస్తోత్రానికి సంబంధించిన [[శ్లోకాలు]] మాత్రమే చదువబ డతాయి. ఇవి నృత్యరీతులకు అనుగుణ్యంగా వుండి నూట ఇరవై అయిదు విన్యాసాలతో విరాజిల్లుతుంటాయట. కేశికి ప్రదర్శనంలో నృత్త నృత్య అభినవాలు వుంటాయి. ఇది నృత్యంతో ప్రారంభమై అభినయంతో ముగించబడుతుంది.
 
కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోట లోనూ, [[హనుమకొండ]] [[వెయ్యి స్థంభాల గుడి]] ముఖ మండపంలోనూ, [[పాలం పేట]] [[రామప్ప దేవాలయం]]లోనూ చూడ వచ్చును.
 
==వీర శైవం, వీర వైష్ణవం==
వీర వైష్ణవం, [[తమిళనాడు]]లో ప్రారంభమై ఆంధ్ర దేశంలో ప్రవేసిస్తేప్రవేశిస్తే వీర శైవం, కర్ణాతకలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేసించిందిప్రవేశించింది. రెండు మతాల మధ్యా బద్ధవైరుధ్యం చెలరేగింది. ఉభయ మతాల మధ్య సామరస్య సాధనకు ఆంధ్ర దేశంలో పలనాటి బ్రంహనాయుడూ, తిక్కన సోమయాజీ కలసి హరిహర ఉద్యమాన్ని లేవదీసినట్లూ, ఆ వుద్యమంలో వీర శైవుల్నీ, వష్ణవుల్నీ కూడకూడా చేర్చుకుని [[మాచర్ల]]లో [[చెన్నకేశవ స్వామి]] ఆలయాన్ని స్థాపించి ఆ ప్రాంగణం లోనే [[వీరభద్ర స్వామి]]ని కూడకూడా ప్రతిష్టించాడుప్రతిష్ఠించాడు.
==శివ కేశవుల ఎదుట పేరిణి==
మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు పేరిణి నృత్యాన్ని భక్తి భావంతో ప్రదర్శించేవారు. అంతే కాదు శైవ క్షేత్రాలైన [[కోటప్ప కొండ]], [[శ్రీశైలం]] మొదలైన పుణ్య క్షేత్రాలలో [[శివరాత్రి]] మహోత్సవాలలో పేరిణి నృత్యానికి సంబందించినసంబంధించిన కొన్ని జతులు ప్రదర్శింప బడేవి.
 
ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న [[కారంపూడి]] గ్రామంలో [[పల్నాటి యుద్ధం]]లో ప్రాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరమూ జనవరిలో జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయా లున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా చూచిన పేరిణి నృత్యం లోని కొన్న జతులు ప్రదర్శీప బడ్డాయి. ఆ నృత్యాలు మహా ఉత్తేజంగా వుండేవి. ప్రేక్షకులను ఉద్రేక పర్చేవి. పూర్వ వీరులు ఔన్నత్యాన్ని చాటేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కనిపించినా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి, [[సాంబ్రాణి]] దూపంలో మునిగి పోయి, [[సన్నాయి]] వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది చేసే ఆ పేరిణి జతుల నృత్యం ప్రేక్షకులకు కూడా వెర్రి ఎక్కించేది. వీరశైవ పేరిణి నృత్య ప్రభావం అంతటిది. అయితే అది ఆనాడు శాస్త్రీయతను కోల్పీయి, గణాచారుల నృత్యంగా మిగిలి పోయింది.
పంక్తి 34:
 
ఓ పరమశివా? నాలో శివ శక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నాశరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు. నిజానికి ఇది ఎంతటి ఔన్నత్యంతో కూడుకున్న నృత్యమో మనం అర్థం చేసుకోవచ్చు.
చరిత్ర గతిలో బతికి జీర్ణమై పోయి పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట నృత్యాన్ని, [[నటరాజ రామ కృష్ణ]]గారు పరిశోధించి, పరిష్కరించి, దాని కొక సజీవ రూప కల్పన చేసి, పూర్వ వైభవాన్ని మన కళ్ళ ముందుంచారు. పేరిణి చరితార్థ మైనట్లే, నటరాజ రామకృష్ణగారు కూడకూడా చరితార్థులు.
==మూలాలు==
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/పేరిణి_నృత్యం" నుండి వెలికితీశారు