బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎రాజకీయ జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , పార్టి → పార్టీ , → using AWB
పంక్తి 42:
 
== రాజకీయ జీవితం ==
[[1912]]లో వివాహం జరిగింది. ఆమె [[1920]]లో మరణించడంతో, [[1924]]లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. [[1923]]లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు. [[ఆంధ్రోద్యమం]], [[గ్రంథాలయోద్యమం]], [[భూదానోద్యమం]] మొదలైన వాటిలో పాల్గొన్నాడు. [[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]] మొదలైన వారితో కలిసి పనిచేసాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
 
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టిపార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన [[రెండవ ఆంధ్రమహాసభ]]కు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]] లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
 
[[1952]]లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలోనూ సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.<ref>ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 56</ref> [[1956]]లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] అయినపుడు, కొత్త రాష్ట్రానికి [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, [[కేరళ]] రాష్ట్రానికి [[గవర్నరు]]గా వెళ్ళాడు. [[1960]] వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత [[1962]] వరకు [[ఉత్తర ప్రదేశ్]] గవర్నరుగా పనిచేసాడు.