భమిడిపాటి కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆదర్శ ఉపాధ్యాయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు , కూడ → కూడా , విద్యార్ధు → విద్యార్థు ( using AWB
పంక్తి 39:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఆకివీడు]]లో [[ఏప్రిల్ 28]], [[1897]] సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చేవిద్యార్థులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం [[మహారాజా కళాశాల]]లో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. [[త్యాగరాజు]] రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ 'త్యాగరాజు ఆత్మ విచారం' రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు రాజమండ్రి కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన 'చంద్రగుప్త'లో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు.
 
==రచనలు==
భమిడిపాటి కామేశ్వర రావు గారు ఎక్కువగా నాటికలు ముఖ్యంగా హాస్య ప్రధానమైనవి రచించారు. ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం. ఆయన అనేక విషయాల మీద వ్రాసిన వ్యాసాలు 20వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోని సామజిక పరిస్థితులను తెలియచేస్తాయి.ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.ఈయన వ్రాసిన వ్యాసాలన్నీ కూడకూడా హాస్య ప్రధానమైనపట్టికీ, వాటిలో విషయ పటిమ దృఢంగా ఉండి, విషయాలను మూలాలనుండి చర్చిస్తాయి.
 
===నాటకాలు-నాటికలు===
పంక్తి 49:
**బాగు బాగు - మొదటి ప్రదర్శన సెప్టెంబరు 1వ తారీకు 1923, రాజమండ్రిలో
**ఎప్పుడూ ఇంతే - మొదటి ప్రదర్శన సెప్టంబరు 5వ తారీకు 1926, రాజమండ్రిలో
**క చ ట త ప లుపలు - మొదటి ప్రదర్శన ఆగష్టు 31వ తారీకు 1927, రాజమండ్రిలో
*'''అప్పుడు''' - ఇందులో మూడు నాటికలు ఉన్నాయి
**తప్పనిసరి - మొదటి ప్రదర్శన ఆగస్టు 27వ తారీకు 1930
పంక్తి 76:
**నామీదేనర్రోయ్‌ (కథ)
**ధుమాలమ్మ ఓఘాయిత్యం
 
*అవును
**మేష్టరీకూడా ఒక ఉద్యోగమేనా?
Line 84 ⟶ 83:
**పల్లెటూరు స్కూలు తణిఖీ తంతు (కథ)
===వ్యాసములు===
*'''లోకోభిన్నరుచి:''' ఈ సంపుటి లోసంపుటిలో 7 వ్యాసములు ఉన్నాయి
**బస్తీ రోడ్డు
**అయోమార్గం-అభినందనం
Line 115 ⟶ 114:
**భోజనోపదేశం
**సంగతులు
**విద్యార్ధులవిద్యార్థుల ఏకాంతపు రిమార్కులు
**పాలక సంఘాల్లో ఎన్నికల మజా
**సంగతులు
Line 157 ⟶ 156:
*'''వన్స్ మోర్''' వ్యాసంలో-
**మామూలు ధోరణి మారి, వ్యాపారం ముదిరినప్పుడు, చాలా మంది తెలుగువాళ్ళు లోగడ మాట్లాడుతూన్న తెలుగు మానేసి ఎక్కువ గంభీరంగా ఉండడానికి, యధాశక్తి ఇంగ్లీషులో కోపిస్తారు.
*'''నాటకం - టాకీ''' వ్యాసంలో- (అంతకుముందు సినిమాలకు శబ్దం ఉండేదికాదు. శబ్ద చలన చిత్రాలు ఒచ్చిన కొత్తల్లో సినిమాలను "టాకీ" అనేవారు) టాకీలలోని కథ వగైరా గురించి-
**".....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడవి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం."
**"...బొమ్మకి కన్ను చాలు (టాకీలో మాటలకి గణ్యత తక్కువ గనక) అందుకని, టాకీ పామరుల్ని కూడా అకర్షిస్తుంది. కాదు పామరుల్నే ఆకర్షిస్తుంది...."
Line 174 ⟶ 173:
**"...పంపకాలు కుదరక పారపోసుగోడం మనకి కొత్తగాదు!..."
*'''అద్దెకొంపలు''' వ్యాసం నుండి
**"....అద్దె యజమానురాలుగారు ఒక్కత్తే ఒక యెత్తూ! ఒక్కొక్క యజమానురాలి చర్య అద్భుతం! అసలు ఆవిడ గృహిణి, అందులో అద్దెకొంపల రాణీ. అందులో కాస్త స్వాతిశయంకూడా ఉంటే ఆవిడ అద్దెకొచ్చిన వాళ్ళని ఎలాచూస్తుందని తమ ఊహ? తప్పు చేసిన కోడల్ని అత్తగారు ఇంతగా రొకాయించదు! నీతితప్పిన పెళ్ళాన్ని తాళి గట్టినముగుడు ఇంతగా దండించడు! నేరంచేసిన పాపిని దండనాధికారి ఇంతగా దుయ్యబట్టడు! చవట పరిపాలన చేసే మండలేశ్వరుణ్ణి సామాజ్య మంత్రి ఇంతగా ఆజ్ఞ పెట్టడు! అద్దెల వాళ్ళ ఆచారం గర్వం, తన ఆచారం మడి. తన వస్తువు ఇంకోరి ఇంట్లో కనపడితే, వారిది దొంగతనం; ఇంకోరి వస్తువు తనింటోఉంటే "ఎక్కడికి పోతుందే! పొరపాటో" అవడం! అద్దెలవాటాల తూముల్లోంచి ప్రవహించేది అపవిత్రమైన కంపుముండానీరు, తన వాటా తూముల్లోంచి వెళ్ళేది పావనమైన అభిషేకజలం (ఇదంతా కలిపి ఒకటే తోము అయినా సరే ఆవిడ వాదన అంతే). దొడ్లో తక్కినవాళ్ళ వాటాల్లో కాసేవన్నీ కేవలం తనవే. నలుగురూ వచ్చే నూతిదగ్గర తమరి తాలూకు పిల్ల గుడ్డలు మాత్రమే జాడించవచ్చు! అద్దెలవాళ్ళుగనక ఆపనే అక్కడచేస్తే, "ఎవళ్ళకొచ్చింది ఈ వినాశకాలం! అన్నం తింటారా, గడ్డి తింటారా!" అంటో తను ఆపని చేస్తూనే, ధరీ అంచూ లేకుండా లెక్చరు పూర్వకంగా తిట్టడం........"(ఇలా ఇంకా రెండు పుటలు ఉన్నది, అప్పటి అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఎదుర్కోవలసిన బాధల చిట్టా)
 
== మరణం ==
Line 182 ⟶ 181:
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
*భమిడిపాటి వారి రచనల నుండి
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:1897 జననాలు]]
[[వర్గం:1958 మరణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
 
==భమిడిపాటి రచనా మాలిక==
Line 194 ⟶ 187:
బొమ్మ:ippudu_bhamidipati.jpg|'''ఇప్పుడు మూడు నాటికల సంపుటి '''
బొమ్మ:mana telugu_bhamidipati.jpg|'''1948లో ప్రచురితమైన "మన తెలుగు" వ్యాస సంపుటి'''
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:1897 జననాలు]]
[[వర్గం:1958 మరణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]