మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''మద్దెల నగరాజకుమారి''' అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ '''కుమారి'''గా పేరుతెచ్చుకున్నారు. [[తెలుగు]] చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో 'మునిపల్లె సుబ్బయ్య'గా ప్రఖ్యాతి పొందిన వి.వి.సుబ్బారావు రావణుడు, ఇంద్రజిత్ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిమణుల్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి కుమారి. నగరాజకుమారి, రాజకుమారి, కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆమె.
 
==ప్రస్థానం==
పంక్తి 30:
 
==తొలి సినిమా==
ఇదిలా ఉంటె పువ్వుల అంజయ్య రూపంలో సినిమాలలో నటించే అవకాశం నగరాజకుమారిని వెదుక్కుంటూ వచ్చింది. ఆయన కన్నాంబ నాటక సమాజంలో వయోలినిస్టుగా పని చేస్తుండేవారు. పూర్ణా యాత్రా స్పెషల్ నిర్వహించే జి.కె.మంగరాజు [[క్వాలిటి పిక్చర్స్]] పతాకంపై ఆ రోజులలోనే [[దశావతారాలు (1937 సినిమా)|దశావతారాలు]] (1937) చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాడు. నటీనటుల ఎంపిక కోసం బెజవాడ (ఈ నాటి విజయవాడ) వచ్చారు. అంజయ్య నగరాజకుమారికి దూరపుబంధువు కావడంతో ఆమె తల్లిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం బెజవాడకు[[బెజవాడ]]కు పంపించారు. నగరాజకుమారిని చూసీచూడగానే ఎంపిక చేయడమే కాకుండా మూడు పాత్రలను ఆమెకి ఇచ్చారు. ఆచిత్రంలో సీత, లక్ష్మీ, యశోధర పాత్రలను రాజకుమారి పోషించారు. కలకత్తాలో[[కలకత్తా]]లో ఈ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం విజయవంతమవడంతో మరిన్ని అవకాశాలు ఆమెని వరించాయి.
 
==[[అమ్మ (1939 సినిమా)|అమ్మ]]తో హీరోయిన్==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు