మరో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (2) using AWB |
|||
పంక్తి 23:
budget = |
imdb_id = 0154849}}
అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన '''మరో చరిత్ర''' సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో [[కమల్ హాసన్]], [[సరిత]]లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదినకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధులౌతారు. ఈ సినిమా చివరకు విషాదాంతమౌతుంది.
==సంక్షిప్త కథ==
విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గఱ ఉండడానికి బాలు (కమల్ హాసన్) తమిళనాడునుండి విశాఖపట్నం వస్తాడు. వారి పక్కింటి అమ్మాయి స్వప్న (సరిత) తో ప్రేమలో పడతాడు.
వచ్చీరాని తెలుగుతో బాలు, సరితల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. అన్ని కథలలాగానే వారి ప్రేమ వ్యవహారం బయట పడుతుంది. ఇద్దరి తల్లిదండ్రులు (ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి) వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకొనేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. ఒక సంవత్సరం పఅటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఉత్తరాలు కూడా వ్రాకుండా ఉండమనీ, తరువాత కూడా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడితే అప్పుడు ఆలోచిస్తామని పెద్దవాళ్ళు కండిషన్ పెడతారు.
బాలు విశాఖపట్నంనుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి (మాధవి) తో పరిచయమౌతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి అతనిని ప్రోత్స్ించి, నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకొనే అవకాశం వచ్చినా గాని స్వప్న దృఢంగా అతనికి కనపడకుండా ఉంటుంది. యేడాది పూర్తి అయినాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న అపాయంలో చిక్కుకుంది. ఎప్పటినుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకొంటాడు. బాలును అపార్థం చేసుకున్న మాధవి అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, చావుదెబ్బలు తిన్న బాలు చావుబతుకుల మధ్య కలుస్తారు.. చివరికి కొండపై నుంచి పడి ఇద్దరూ మరణిస్తారు..▼
▲బాలు విశాఖపట్నంనుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి (మాధవి)తో పరిచయమౌతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి అతనిని ప్రోత్స్ించి, నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకొనే అవకాశం వచ్చినా గాని స్వప్న దృఢంగా అతనికి కనపడకుండా ఉంటుంది. యేడాది పూర్తి అయినాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న అపాయంలో చిక్కుకుంది. ఎప్పటినుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకొంటాడు. బాలును అపార్థం చేసుకున్న మాధవి అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, చావుదెబ్బలు తిన్న బాలు చావుబతుకుల మధ్య కలుస్తారు.. చివరికి కొండపై నుంచి పడి ఇద్దరూ మరణిస్తారు..
==పాటలు==
|