మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కధ → కథ, స్థంభ → స్తంభ, వున్నాయి. → ఉన్నాయి., ) → ) , ( → ( (2) using AWB
పంక్తి 34:
| website =
}}
 
 
[[వరంగల్]] జిల్లాలోని [[మంగపేట]] మండలం [[మల్లూరు]] గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం - భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
Line 43 ⟶ 42:
 
==ఆలయ ప్రత్యేకతలు==
[[నవనారసింహులు]] క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెపుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపుచేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట. ఆనాటినుంచి ఆ రంధ్రంనుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధానే్న భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
 
ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నృసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తిస్నానాలు చేస్తారు. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కల్గినదని, దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంది.
 
చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మిదేవి పురాతన మందిరం ఉంది. హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా వున్నాయిఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఆ దివ్యాలయాల సందర్శనం పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవిలో శిఖాంజనేయస్వామి మందిరం ఉంది. ఇది అతి పురాతనమైనది. స్వామివారి మూర్తి ఏ కాలంనాటిదని చెప్పడానికి ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ హేమాచల నరసింహస్వామి మూర్తి కాలంనాటిదిగా చెబుతారు.
 
==బ్రహ్మోత్సవాలు==
శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతీ యేటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నర్సింహస్వామి జయంతి, స్వామి వారి కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాక భలి (నాగబెల్లి), వసంతోత్సవం, నిర్వహిస్తారు.
 
==హేమాచల క్షేత్రాన్ని దర్శించిన రాణి రుద్రమదేవి==
Line 57 ⟶ 56:
 
==17వ శతాబ్దంలో గజనీమహమ్మద్ రాక==
కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో [[గజనీ మహ్మద్]] ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్థంభాలస్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం.
 
==చింతామణి జలపాతం==
హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం (అక్కధారఅక్కథార - చెల్లెధార) ను సర్వరోగనివారిణిగా పరిగణిస్తారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రం పై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమి పై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట.
 
==మూలాలు==
* [http://namasthetelangaana.com/Zindagi/article.asp?category=7&subCategory=1&ContentId=390229 | నమస్తే తెలంగాణ వెబ్సైట్ లో ప్రచురితమైన వ్యాసం]
 
==ఇతర లింకులు==