మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహబుబ్ నగర్ → మహబూబ్ నగర్, మహాబూబ్‌నగర్ → మహబూబ్ నగర్, using AWB
పంక్తి 21:
|pincode = 509001
}}
'''మహబూబ్‌నగర్''' జిల్లా [[తెలంగాణా]] రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం, '''మహబూబ్‌నగర్'''. ఇది [[హైదరాబాదు]]నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కలదుఉంది. జిల్లాకు దక్షిణాన [[తుంగభద్ర నది]], [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[నల్గొండ]] జిల్లా, ఉత్తరమున [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమమున [[కర్ణాటక]] లోని [[రాయచూరు]], [[గుల్బర్గా]] జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో [[హైదరాబాదు]] జిల్లా కలదుఉంది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233</ref> రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. [[కృష్ణానది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచిన[[ఆలంపూర్]]<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133</ref>, [[మన్యంకొండ]], [[కురుమూర్తి]],మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, [[శ్రీరంగాపూర్]] లాంటి పుణ్యక్షేత్రాలు, [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[బీచుపల్లి]], వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], [[కోయిలకొండ]]కోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247</ref>) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన [[గద్వాల]] కోట, [[కోయిలకొండ కోట]], [[చంద్రగఢ్ కోట]], పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పల్లెర్ల హనుమంతరావు]] లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, [[గడియారం రామకృష్ణ శర్మ]] లాంటి సాహితీవేత్తలు, [[సూదిని జైపాల్ రెడ్డి]], సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. [[ఎన్.టి.రామారావు]]ను సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడె తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన [[నారాయణపేట]], చేనేత వస్త్రాలకు పేరుగాంచిన [[రాజోలి]], కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, [[మామిడి]]పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, [[రామాయణం|రామాయణ]] కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన [[తంగడి]] ప్రాంతం<ref>పాలమూరు వైజయంతి, 2013</ref> ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]].
 
==భౌగోళికం==
పంక్తి 29:
 
==చరిత్ర==
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం [[పాలమూరు]] (Palamooru) అని [[రుక్మమ్మపేట]] (Rukmammapeta) అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, [[1890]]నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ [[మహబూబ్ ఆలీ ఖాన్]] అసఫ్ జా ([[1869]] - [[1911]]) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినదిమార్చబడింది. క్రీ.శ. [[1883]]నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా వున్నదిఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని '''చోళవాడి''' (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన [[కోహినూర్]] వజ్రం మరియు [[గోల్కొండ]] వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు<ref name="mahabubnagar.nic.in">http://mahabubnagar.nic.in/history.html</ref>.
 
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ప్రముఖ సంస్థానాలలో [[గద్వాల సంస్థానము|గద్వాల]], [[వనపర్తి సంస్థానము|వనపర్తి]], [[జటప్రోలు సంస్థానము|జటప్రోలు]], [[అమరచింత సంస్థానము|అమరచింత]] మరియు [[కొల్లాపూర్ సంస్థానము|కొల్లాపూర్]] సంస్థానాలు ప్రముఖమైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.
 
===పాలించిన రాజవంశాలు===
* '''మౌర్య సామ్రాజ్యం''' : క్రీ.పూ.250 లో [[అశోకుడు|అశోక]] చక్రవర్తి కాలంలో [[మౌర్య సామ్రాజ్యం]] లో ఈ ప్రాంతము దక్షిణ సరిహద్దుగా ఉండేది.
* '''శాతవాహన రాజ్యం''' : క్రీ.పూ.221 నుంచి క్రీ.శ 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతం భాగంగా ఉండేది.
* '''చాళుక్య రాజ్యం''' : క్రీ.శ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ.11 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతము చాళుక్య రాజ్యంలో భాగంగా ఉండింది.
* '''రాష్ట్రకూట రాజ్యం''' : క్రీ.శ. 9 వ శతాబ్దంలో కొద్ది కాలం ఇక్కడ రాష్ట్రకూటులు పాలించారు.
* '''కాకతీయ రాజ్యం''' : క్రీ.శ.1100 నుంచి క్రీ.శ.1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు రాజ్యం చేశారు.
* '''బహమనీ రాజ్యం''' : క్రీ.శ.1347 నుంచి క్రీ.శ.1518 వరకు ఇది బహమనీ రాజ్యం లోరాజ్యంలో భాగంగా ఉండింది.
* '''కుతుబ్ షాహి రాజ్యం''' : క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్ షాహి రాజ్యంలో భాగం
* '''మొఘల్ సామ్రాజ్యం''' : క్రీ.శ. 1687 నుంచి దాదాపు 37 సం.ల పాటు మహబూబ్ నగర్ ప్రాంతంనుప్రాంతాన్ని మొఘలులు పాలించారు.
* '''నిజాం రాజ్యం''' : క్రీ.శ. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్రంస్వాతంత్ర్యం అనంతరం [[హైదరాబాదు]] సంస్థానం దేశంలో కల్సే వరకు నిజాం రాజ్యంలో భాగం గానే కొనసాగింది.
 
===ఆధునిక చరిత్ర===
హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చినదివచ్చింది. జిల్లాలో [[పాలు]], [[పెరుగు]] సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది.
 
[[1870]]లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. [[1881]] నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. [[1883]]లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి.
పంక్తి 59:
 
==మహబూబ్ నగర్ జిల్లా సమాచారం==
[[తెలంగాణ]]లో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా అతి పెద్ద జిల్లా. [[పాలమూరు]] అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు (నగర పంచాయతీలతో కలిపి), 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు ఉన్నాయి. [[కృష్ణా నది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]]లతొ పాటు దిండి, భీమా లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉన్నదిఉంది.
 
==మహబూబ్ నగర్ మండలాలు==
పంక్తి 208:
 
==జనాభా==
[[బొమ్మ:Mahabub nagar 03.jpg|thumb|right|250px|మహబూబ్ నగర్ జిల్లా జనాభా పెర్గుదలపెరుగుదల గ్రాఫ్ (ఎడమ ప్రక్క ఉన్న అంకెలు లక్షలలో సూచిస్తాయి]]
[[1941]] జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, [[2011]] జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడినదిచూపెట్టబడింది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధిచెంది 40,42,191కు చేరింది. 2011 జనాభా ప్రకారం ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో 9వ స్థానంలో, దేశంలో 55వ స్థానంలో ఉంది. జనసాంద్రత 2001లో 191 ఉండగా, 2011 నాటికి 219కు పెరిగింది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్.
 
==రవాణా సౌకర్యాలు==
[[బొమ్మ:Mahabubnagar Railway Station.JPG|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ రైల్వే స్టేషను</center>]]
[[బొమ్మ:Mahabubnagar Bus Station.jpg|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ బస్ స్టేషను</center>]]
'''రైలు సౌకర్యం''' : [[దక్షిణ మధ్య రైల్వే]] పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం [[సికింద్రాబాదు]] నుంచి [[కర్నూలు]] గుండా [[తిరుపతి]], [[బెంగుళూరు]] వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు ఉన్నాయి. (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు ఏనుగొండ). కర్ణాటకలోని [[వాడి]] మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. [[మాగనూరు]] మండలంలోని [[కృష్ణ (మాగనూరు మండలము)|కృష్ణా]] రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. [[గద్వాల]] నుంచి [[కర్ణాటక]] లోని [[రాయచూరు]]కు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.
 
'''రోడ్డు సౌకర్యం''' : దేశంలోనే అతి పొడవైన [[జాతీయ రహదారి]] అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు కలదుఉంది. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, [[జడ్చర్ల]], పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-[[బీజాపూర్]] రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.
 
'''బస్ డిపోలు''' : మహబూబ్ నగర్ జిల్లాలో [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] కు చెందిన 8 బస్సు డిపోలు ఉన్నాయి - మహబూబ్ నగర్, గద్వాల, షాద్‌నగర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్.
 
==జిల్లా రాజకీయాలు==
పంక్తి 241:
==స్వాతంత్రానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లా లో సంస్థానాలు==
{{main|పాలమూరు సంస్థానాలు}}
స్వాతంత్రానికిస్వాతంత్ర్యానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లో 16 సంస్థానాలు ఉండేవి<ref name="mahabubnagar.nic.in"/>. అందులో ముఖ్యమైన సంస్థానాలు :
{{col-begin}}
{{col-2}}
పంక్తి 291:
[[బొమ్మ:Gadwal Fort.JPG|thumb|right|200px|<center>సంస్థానాధీశుల కాలం నాటి గద్వాల మట్టికోట</center>]]
[[బొమ్మ:Mahabubnagar ZP.jpg|thumb|right|200px|<center>మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు కార్యాలయము</center>]]
*'''ఆలంపూర్ దేవాలయాలు''' : [[తుంగభద్ర నది]] ఒడ్డున ఉన్న [[ఆలంపూర్]] వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో క్రీ.శ.7, 8వ శతాబ్దాలలో నిర్మితమైనాయి<ref>శ్రీసాయిధాత్రి పర్యాటకాంధ్ర, దాసరి ధాత్రి రచన, 2009 ముద్రణ, పేజీ 295</ref>. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడకూడా ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి.
*'''పిల్లలమర్రి''' : మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్, దర్గా మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
*'''బీచుపల్లి''' : 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై [[కృష్ణానది]] పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
*'''ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు''' : ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద [[కర్ణాటక]] సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది [[తెలంగాణ]] లో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది [[గద్వాల]] నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది.
*'''మన్యంకొండ దేవాలయం''' : మహబూబ్ నగర్ జిల్లా లోనే అతిపెద్ద దేవాలయం మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎత్తయిన కొండపై మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో [[కర్ణాటక]] లోని [[రాయచూరు]] వెళ్ళు మార్గంలో కలదుఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర జర్గుతుంది. కొండపై ఉన్న ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను ఆకట్టుకొంటుంది.
*'''కోయిల్‌సాగర్ ప్రాజెక్టు''' :50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు.
*'''కురుమూర్తి దేవస్థానం''' : తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో పోలికలున్న [[కురుమూర్తి]] శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం క్రీ.శ.14 వ శతాబ్దానికి చెందినది. ఇది [[చిన్నచింతకుంట]] మండలంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరడానికి రైలుమార్గం కూడా ఉంది.
*'''ఉమా మహేశ్వర క్షేత్రం''' : నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. ఇది [[శ్రీశైలం]] ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో ఉంది కాబట్టి శ్రీశైలం వెళ్ళు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తారు. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉండటం కూడకూడా భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు
*'''గద్వాల కోట''' : సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున కలదుఉంది. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. కోట లోపలే ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. కోటలోని స్థలాన్ని కళాశాలకు ఇచ్చినందున కళాశాల పేరు కూడా మహారాణి ఆదిలక్ష్మీ డిగ్రీ కళాశాలగా చెలమణిలో ఉంది. కోట పరిసరాలలో గతంలో సినిమా షూటింగులు కూడా జర్గాయి.
*'''శిర్సనగండ్ల దేవాలయం''' : అపరభద్రాద్రిగా పేరుగాంచిన క్రీ.శ.14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం [[వంగూరు]] మండలంలో ఉంది. ఇక్కడ ప్రతిఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు.
*'''చంద్రగఢ్ కోట''' : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో [[మొదటి బాజీరావు]] కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో [[నర్వ]] మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.
పంక్తి 305:
 
==పాలమూరు మహనీయులు==
* '''బూర్గుల రామకృష్ణా రావు''' హైదరాబాదు రాష్ట్ర చివరి [[ముఖ్యమంత్రి]] అయిన [[బూర్గుల రామకృష్ణారావు]] మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పోరాటయోధులలో ముఖ్యుడు. [[1915]] నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది.పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం [[ఫరూక్‌నగర్|షాద్‌నగర్]] మండంలోని [[బూర్గుల్ (ఫరూఖ్ నగర్)|బూర్గుల]] గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. [[1952]]లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. [[ఆంధ్రప్రదేశ్]] అవరతణకు వీలుగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత [[కేరళ]], [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రాలకు [[గవర్నర్]] గా పనిచేశాడు.
*'''సురవరం ప్రతాపరెడ్డి''' : ప్రముఖ న్యాయవాది, పత్రికా సంపాదకుడు, గ్రంథాలయోద్యమనేత, రాజకీయ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[సురవరం ప్రతాపరెడ్డి]] పాలమూరు జిల్లా [[మనోపాడ్]] మండలంలోని [[ఇటిక్యాలపాడు]] గ్రామంలో [[1896]], [[మే 28]]న జన్మించాడు. [[1926]]లో గోల్కొండ పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వపు లోపాలను ఎండగట్టాడు. మెదక్ జిల్లా లొనిలోని జొగిపేట లొజొగిపేటలో జరిగిన నిజామ్ ఆంధ్ర మహాసబ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహిన్చారు[[1944]]లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. [[1952]]లో జరిగిన తొలి ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో [[వనపర్తి]] నుంచి ఎన్నికయ్యాడు. [[1953]] [[ఆగష్టు 25]]న ఆయన మరణించాడు.
* '''రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి''' : ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడైన [[రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి]] మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. నిజాంకు కొత్వాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తరువాత గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. [[హైదరాబాదు]] . ప్రజాచైతన్యం కల్గించడానికి అనేక విద్యాసంస్థలను స్థాపించాడు.
* '''వందేమాతరం రామచంద్రారావు''' : పాలమూరు జిల్లానుంచి స్వాతంత్రస్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖ నేతలలో [[వందేమాతరం రామచంద్రారావు]] ఒకడు. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. తొలుత [[గద్వాల]] సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూమహాసభలో చేరినాడు. పలుసార్లు జైలుశిక్ష అనిభవించాడు. విచారణ సమయంలో ఊరు, తండ్రిపేరు అడగగా అన్నింటికీ వందేమాతరం అనే సమాధానం ఇచ్చాడు. అందుచే జైలునుంచి విడుదల అనంతరం అందరూ వందేమాతరం రామచంద్రారావు అని పిల్వడం ప్రారంభించారు.
* '''బి.సత్యనారాయణరెడ్డి''' : 1927లో మహబూబ్‌నగర్ జిల్లా అన్నారంలో జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, ఆ తర్వాత ఒడిషా గవర్నరుగా పనిచేశాడు. ఇదే కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఇంచార్జి గవర్నరుగా కూడా విధులు చేపట్టాడు. అక్టోబరు 6, 2012న మరణించాడు
* '''హాస్టల్ రామారావు''' : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. [[కొల్లాపూర్]] మండలం అతని స్వస్థలం. స్వతంత్ర్యస్వతంత్ర [[భారతదేశం]]లో కలిసేందుకు [[హైదరాబాదు]] సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి[[1947]]లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత [[నాగర్ కర్నూల్]] లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది.
* '''గడియారం రామకృష్ణ శర్మ''' : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో [[గడియారం రామకృష్ణ శర్మ]] ప్రముఖుడు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర [[సాహిత్య అకాడమీ]] అవార్డు లభించింది <ref>http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 తీసుకున్న తేది 27.12.2007</ref>. ఇతడు [[1919]]లో [[అనంతపురం]] జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని [[ఆలంపూర్]] లో స్థిరపడ్డాడు. [[2006]] [[జూలై]]లో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ప్రముఖమైనది.
* '''రాజగిరి పరశురాములు''' : ఇతను ప్రముఖ సామాజిక కార్యకర్త. సర్వోదయం ఉద్యమంలో జాతీయ స్థాయిలో పనిచేసారు. అమ్రాబాద్ మండలం వంకేశ్వరంలో 1929లో జన్మించిన పరశురాములు భూదానోద్యమ రూపశిల్పి అయిన వినోభాబావే ప్రియశిష్యుడిగా చాలాకాలం పనిచేసారు.
* '''[[రాజా రామేశ్వర్ రావు 1]]''' : సంస్థానాధీశుడు, పరిపాలనదక్షుడు, సంస్కర్త. 19వ శతాబ్ది తొలిసంవత్సరాలలో వనపర్తి సంస్థానాధీశునిగా పరిపాలన ప్రారంభించిన రామేశ్వర్ రావు మరణించేంతవరకూ దాదాపుగా 43 సంవత్సరాల పాటు పరిపాలించారు. చుట్టుపక్కల బ్రిటీష్ ఇండియాలో జరుగుతున్న మార్పులను అనుసరించి వనపర్తి సంస్థానంలో వివిధ సంస్కరణలు, నూతన రాజ్యపాలన విధానాలు చేపట్టారు. సైన్యబలం వల్ల ఆయన సంస్థానంలో స్వతంత్రమైన పాలన చేపట్టేవారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>. హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించారు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది<ref name="AP District Gazetteer">{{cite book|last1=K|first1=Sukhender Reddy|last2=Bh|first2=Sivasankaranarayana|title=Andhra Pradesh District Gazetteers|page=40|edition=12|url=http://books.google.com/books?id=dcFhAAAAIAAJ&q=rameshwar+rao&dq=rameshwar+rao&lr=&client=firefox-a&pgis=1|accessdate=28 November 2014}}</ref>.
పంక్తి 319:
 
==విద్యారంగం==
మహాబూబ్‌నగర్మహబూబ్ నగర్ జిల్లాలో 1875 లోనే మొగిలిగిద్ధ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. జిల్లాలో [[1955]]-[[1956|56]] నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, [[2006]]-[[2007|07]] నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది.<ref>ఈనాడు దినపత్రిక జిల్లా ఎడిషన్ తేది 26.01.2008 పేజీ సంఖ్య 8</ref> [[2008]]-[[2009|09]] నాటికి ఈ సంఖ్య 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలకు చేరింది.
ఇవే కాకుండా 45 డీగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బీఎడ్ కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, ఒక మెడికల్ కళాశాల, ఒక వ్యవసాయ కళాశాల ఉన్నాయి. 2008 లో [[పాలమూరు విశ్వవిద్యాలయం]] స్థాపించబడింది.పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే 'లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్'అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వాసికెక్కింది. జాతీయసేవాపథకం విభాగంలో ఈ రికార్డు ఆంగ్ల భాషలో గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆధ్వర్యంలో నవంబర్ 12, 2010 న 2,500 మంది పాల్గొని నిర్వహించారు.ఈ రికార్డు సాధించడం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 'మహా మహా'అనే బిరుదునిచ్చి గౌరవించారు.
 
==సాహిత్యం==
సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో [[సురవరం ప్రతాపరెడ్డి]] గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 8</ref> హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ సెప్టెంబరు 2012, పేజీ 14</ref> [[గడియారం రామకృష్ణ శర్మ]], [[కపిలవాయి లింగమూర్తి]] లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు.
16 అక్తొబర్ 2000 లొలో సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అద్వరయములొఅద్వరయములో నారాయణపెట లొనారాయణపెటలో వార్తతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడము జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లరెడ్ది, మాజి యెమ్మెల్యె చిట్టం నర్సిరెడ్డి,కొదంగల్ యెమ్మెల్యె సుర్యనారయణసుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటీ మునిసిపాల్ చైర్మన్ గడ్డం సాఇబన్న తదితరులు పాల్గొన్నరు.
14 జనవరి 2004 లొలో మహబూబ్ నగర్ జిల్లా కెంద్రంగ వార్తతరంగాలు పత్రిక నుపత్రికను దిన పత్రికగా మార్చడము జరిగింది.ప్రస్తతము రాస్ట్రా రాజధాని నుండి కూడకూడా పత్రిక ప్రింట్ అవుతుంది.
మన కాలాపు మహనియుడూమహానియుడూ ప్రజ కవి గోరెటీ వేంకన్న పాలమురు బిడ్డే ఆన్నసంగథి మరువొద్దు.
 
==వర్షపాతం, వాతావరణం==
మహబూబ్ నగర్ జిల్లాలో [[వర్షపాతం]] తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల [[జూన్]], [[జూలై]] మరియు [[ఆగస్టు]] నెలలలో కురుస్తుంది. [[బంగాళాఖాతం]]లో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. దక్షిణవైపున [[తుంగభద్ర]] మరియు [[కృష్ణానది]] తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయువ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది.
 
జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ మరియు చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం [[ప్రత్తి]] వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్టగరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో [[నవంబర్]], [[డిసెంబర్]] మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.
{{Weather box
|location = మహబూబ్‌నగర్
పంక్తి 382:
 
==నీటిపారుదల సౌకర్యం==
దేశంలోనే మూడవ పెద్దనది కృష్ణానది, దాని ప్రధాన ఉపనది తుంగభద్ర మరియు చిన్న వాగులపై జిల్లాలో జూరాలా ప్రాజెక్టు, ఆర్డీఎస్, కోయిలకొండ ప్రాజెక్టు, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించగా, సరళా సాగర్ ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నాయి. పెద్దతరహా మరియు మధ్యతరహా ప్రాజెక్టులు కలిపి జిల్లాలో 215000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి కాకుండా కాలువలు, చెరువులు, బోరుబావులు, ఊటబావులు తదితరాల ద్వారా మరో 212000 ఎకరాల భూమి సాగవుతుంది. పంటల వారీగా చూస్తే అత్యధికంగా వరి 145000 ఎకరాలు, వేరుశనగ 71000 నీటిపారుదల సాగు క్రింద ఉన్నదిఉంది.
==ఖనిజ వనరులు==
పాలమూరు జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది. కోడంగల్ ప్రాంతంలో నాపరాయి, సున్నపురాయి లభ్యమౌతుంది. గట్టు ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ ఇంకనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
పంక్తి 403:
*'''2013 సెప్టెంబరు 27''': మహబూబ్‌నగర్ పట్టణంలో [[సుష్మా స్వరాజ్]] యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" సదస్సు నిర్వహించబడింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-09-2013</ref>
*'''2013 మార్చి 22''': కల్వకుర్తి మేజర్ పంచాయతిని నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు.<ref>ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 118, తేది 22-3-2013</ref>
*'''2012 డిసెంబరు 21''': [[కడ్తాల్ (ఆమన‌గల్)]] లో ప్రపంచ ధ్యానమహాసభలు ప్రారంభమై 10 రోజులపాటు జరిగాయి.
*'''2012 డిసెంబరు 18, 19''': జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి.
*'''2012 అక్టోబరు 7''': ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]] మరణం.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-10-2012</ref>
పంక్తి 411:
*'''2012 ఫిబ్రవరి 10''': మాడ్గుల ప్రాంతంలో ఇనుపయుగం కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది 11-02-2012</ref>
* '''2012 జనవరి 7''': మహబూబ్‌నగర్ పట్టణంలో టివి నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
* '''2011 అక్టోబరు 30''': మహబుబ్మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ రాజేష్వర్ రెడ్డి మృతిచెందాడు.
* '''2010 అక్టోబరు 20''' : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడిగా, గద్వాల పురపాలక సంఘం చైర్మెన్‌గా, గద్వాల మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.<ref>ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010</ref>
* '''2009 అక్టోబరు 2''': తుంగభద్ర నది వరదల వల్ల నదీతీర గ్రామాలు నీటమునిగాయి.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>