మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లొ → లో (2), లో → లో (7), ఉద్దేశ్యం → ఉద్దేశం (2), ప్రత using AWB
పంక్తి 37:
|signature =
}}
'''మహమ్మద్ ఖదీర్ బాబు '''<ref>[http://www.beditor.com/telugu-stories/411-khadir-babu-books ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా]</ref>'''' ఒక [[తెలుగు కథా రచయిత]]
==రచయిత పరిచయం:==
ఖదీర్ బాబు సొంత ఊరు[[కావలి]], [[నెల్లూరు జిల్లా]]. ప్రస్తుతం [[హైదరాబాద్]] వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పని చేసిపనిచేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారుపనిచేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
 
''అవార్డు :'' మే 18, 2013...ప్రసిద్ధ కథకుడు [[మధురాంతకం రాజారామ్]] స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి [[హోసూరు]]లో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
 
''బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : '' జూన్ 2013..ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్టాత్మకప్రతిష్ఠాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ [[హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ]] గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను అనువాదం చేయడానికి పొందారు. మన దేశంలో [[బెంగాలీ]], [[మళయాళ]], హిందీ, తమిళ సాహిత్యాలకు లభించినా తెలుగుకు దక్కడం మాత్రం ఇదే తొలిసారి.
 
==రచనలు:==
పంక్తి 55:
*మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు,
*న్యూ బాంబే టైలర్స్ (కథల సంపుటి) (1 edition -published ఫిబ్రవరి 15, 2012)
*బియాండ్ కాఫీ (కథల సంపుటి) (1 edition -published August 2013)
*కథలు ఇలా కూడా వ్రాస్తారు (1 edition -published March 20, 2016)
===దర్గామిట్ట కతలు===
పంక్తి 72:
 
ముందొక పిట్ట కథ.
పూర్ణయ్యని బావగాడంటారుబావగాఢంటారు అందరూఅందరు.
బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్లిగానిపెళ్ళిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘అందరూ వినండర్రా’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాట మూయించాడు. ‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’ అంటూ లిస్టు చదివాడు. ‘వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగుపచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, వూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’ అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం – అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అక్కడితో ఆగాడా? ఊహూ. లేత వంకాయలు కోయించుకు తెచ్చి ప్రదర్శనకు పెట్టాడు. ‘చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహ చక్కగా మేళవిస్తుంది’ అని జ్ఞాపకం చేశాడు. పులిహోర తిరగమోత వెయ్యగానే ఆ ఘుమఘుమలకే జనానికి శరీరమంతా ఆకలే అయ్యేలా చేశాడు. అందర్నీ బంతులుగా కూచోపెట్టి కొసరికొసరి వడ్డించి తినిపించాడు….
 
మహమ్మద్‌ ఖదీర్‌బాబున్నాడే, అచ్చం బావగాడే బావగాడు.ఒక కథల సంతర్పణ మొదలుపెట్టాడు. రోజుకో కథ అన్నాడు. ‘ఓసంతేకదా, భారతి కాలం నుంచీ ఇలాంటివి ఎన్నో చూశాం’ అని జనాలు ఎవరి గోలలో వాళ్లు పడ్డారు. కొందరు పిచ్చాపాటీ కబుర్లు, కొందరు పేకాటలు, మరికొందరు రాష్ట్ర విభజన రాజకీయాలు. వారం రోజులు తిరిగేసరికల్లా కథల్ని కొత్తకొత్తగా ఖదీర్‌బాబు వండుతున్న కమ్మని వాసన అందరికీ చేరింది. ఇక వేరే చర్చలు ఆగిపోయాయి. సంతర్పణలో బావగాడు చూపెట్టిన వంకాయల మీదే మాటలు నడిచినట్టు ఎక్కడికక్కడ కథల మీదే మాటలు మొదలయ్యాలు.
పంక్తి 103:
ఇందులో మొత్తం 44 కథలు ఉన్నాయి
 
#బఠాణిరాజుది బలే తమాషా
#జింకమ్మాజింకమ్మా
#సెబ్బాష్ రాజుగారు
#సుబుర్ బాషా
#గుత్తి వంకాయ కూర
#నిద్రనేది ఒకటి ఉంది కదా
#అల్లాకె నామ్ పా ఖైరాత్ కర్
#బీ ఫిత్నీ
#నక్కసాయెబు - నక్క బీబీ
#నక్టామాము
#ఆకలి - ఆపిల్ పండు
#ఫలాతున్ పిచుక కథ
#హమ్ న హలాల్ తుమ్ న హరామ్
#మూడు ఖర్చులు
#తైమూరు రాజు - చీమ
#యా బలఖ్ యా బాషా
#ఎంత చేసుకుంటే అంత
#భర్రున ఎగిరిపోయిందోచ్
#మనుషుల కథ పిల్లినే అడగాలి
#ఎక్కడి నుంచి రాకడ? ఎక్కడికి పోకడ?
#మఛిలీ బందర్ బాషా
#ఎవరు ఫైల్వాను?
#షర్ఫుద్దీన్
#మిట్టూ రాజా
పంక్తి 151:
 
కొంత మంది పిల్లలు, ఉన్నత పాఠశాల పిల్లలు, ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న కాలేజీ పిల్లలు యీ కతలని చాలా ఇష్టంగా కూడబలుక్కుని మరీ చదువుతున్నారని పేరెంట్స్ ద్వారా తెలిసినప్పుడు నా కల్ళెమ్మటి నీళ్ళోచ్చినాయి. ఎక్కడ కావలి, ఎక్కడ పోలేరమ్మ బండ....ఎక్కడ శ్రీధరుగాడు, ఎక్కడ మురళీగాడు, ఎక్కడ మాలకొండలరావుగాడు, కదీరుగాడు....వీళ్ళంతా ఇవ్వాళ చాలా మందికి ఫ్రెండ్స్ అయినారు.
ఇంకా విచిత్రమేమంటే ఈ కతలు అయిపోయినాక ఒకాయన మా ఆఫీసుకి వచ్చి ఈ కతల్లోని నలుగురు ఫ్రెండ్సూ టెన్త్ తోటి ఆగిపోకుండా డిగ్రీలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని , పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలయ్యేదాకా ఈ కతలు రాస్తావా చస్తావా అని కూర్చున్నాడు
అదీ ఈ కతల భాగ్యం.
ఈ భాగ్యం నాది కాదు, ఈ భోగమూ నాది కాదు.
పంక్తి 162:
1970-80 మధ్యకాలంలో హిందీలో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.
 
60వ దశకం నుండి 80 వ దశకం వరకూ హిందీ చిత్రసీమ నుండి వచ్చిన కొన్ని కళాత్మక చిత్రాలకు సంబంధించి రచయిత శ్రీ ఖదీర్‌బాబు, వారం వారం ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన 50వ్యాసాలను `బాలీవుడ్ క్లాసిక్స్` పేరుతో సంకలనంగా ప్రచురించటం జరిగింది. సినీ ప్రేమికులు ఆ చిత్రాలలో కొన్నిటిని చూసివున్నా, రచయిత విశ్లేషణా చాతుర్యం వల్లే చదువుతున్నంత సేపు మళ్లీ ఒకసారి రచయిత దృక్కోణంలో ఆ సినిమా చూస్తున్నంత అనుభూతిని పొందుతారనే ఉద్దేశ్యంతోఉద్దేశంతో ఈ పుస్తక పరిచయానికి పూనుకున్నాను.
 
నాటి సినిమాలలో, ఆయా కాలపరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే కథతో సహజపాత్రలతో పాటు చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకుడికి రసవత్తరంగా వుండటం కోసం తగుమోతాదులో కొద్దిపాటి మసాలా కూడా జోడించేవారు దర్శకనిర్మాతలు.. మరి నేటి సినిమాలో మసాలా అసలు కూరని డామినేట్ చేస్తూ అసలు కూర తక్కువైపోతుందన్నది విమర్శకుల వాదన. సినిమా అనేది వ్యాపారం. కలల్నీ, కళల్నీ అమ్ముకుని చేసే వ్యాపారం. కాలగమనంలో అన్ని వ్యాపారాల స్వభావస్వరూపాలు మారినట్లే సినిమా కూడా మారటం సహజమే.. మన చిన్నతనంలో మిఠాయిని పేపర్లో పొట్లం కట్టిచ్చేవారు… యిప్పుడు అందమైన అట్టపెట్టెల్లో యిస్తున్నా ఎందుకో చిన్నప్పటి పొట్లం మిఠాయే బాగుందనిపిస్తుంది. అంతమాత్రం చేత ప్యాకెట్లో వొద్దు.. పేపరులోనే కట్టివ్వమనం కదా.. టెక్నిక్ ప్యాకింగ్‌తో యిప్పుడొస్తున్న కోట్లాది రూపాయల సినిమాలకంటే ఆత్మవున్న నాటి సినిమాలు, నగలు లేకపోయినా అందంగా కనిపించే బాపూ బొమ్మాయిల్లా వుంటాయన్నది నిజం.. కానీ మారిన నేటి వ్యాపార సరళిలో థియేటర్ వరకూ వచ్చే సగటు ప్రేక్షకుడ్ని సంతృప్తి పరచి సొమ్ముచేసుకోవాల్సిన అగత్యం సినిమావారిదని అంగీకరించవలసిన నిజం.. అందుకే పాతని పొగడటం కొత్తని తెగడటం మాత్రమే పరమావధిగా భావించనవసరం లేదు. ఆ స్వర్ణయుగంలోని బంగారంతో నేడు సరికొత్త నగలు చేయటానికి ప్రయత్నిస్తే ఆధునిక స్వర్ణయుగం మళ్లీ సాక్ష్యాత్కారం కాకపోదు.
 
ఈ `బాలీవుడ్ క్లాసిక్స్` విషయానికొస్తే సంబంధిత చిత్రాల కథకథనాలను విశ్లేషిస్తూనే ఆ సినిమాల నిర్మాణం వెనుకవున్న కష్టనష్టాలను కూడా రచయిత తెలియజేయడంతో ఆ సినీ జీవుల పట్ల పాఠకులకు యింకా ఆరాధనా భావం ఎక్కువవుతుంది… స్క్రిప్ట్ తప్ప, ముహూర్తాలూ, టైటిల్ సెంటిమెంటూ, క్లాప్‌సెంటిమెంట్లూ, రిలీజ్‌డేట్ సెంటిమెంట్లూ అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఫ్లాప్ తీస్తున్న మనవాళ్లు కొన్ని తెలుసుకోవాలి అంటూ, `షోలే` తొలిరోజు షూటింగ్ భారీ వర్షం వల్ల అసలు జరగనేలేదనీ, మరునాడు తొలిషాట్ తీసింది వితంతువు పాత్రపైన అనీ, ఎంత పెద్ద సినిమా అయినా మొదలు ఆధారపడవలసింది అక్షరం మీదే, తయారుకావలసింది పేపర్ మీదే అని చురకలు అంటించాడు రచయిత.
పంక్తి 172:
సాదాసీదా దర్శకుడైన `బ్రిజ్` తీసిన సూపర్ హిట్ “విక్టోరియా నెం.203“ గురించి చెబుతూ `ప్రేక్షకులు మెచ్చే మిఠాయి పొట్లాన్ని ఢిల్లీ మిఠాయివాలా మాత్రమే కట్టక్కర్లేదు.. వీధి చివర రంగయ్య అయినాచాలు` అనటం రచయిత చమత్కారం. సినీ ప్రేమికుల్ని అలరించే మరెన్నో విషయాలున్నాయి ఈ పుస్తకంలో…
 
“ఇలాంటి కథ నాకు తెలుసు అని ప్రేక్షకుడు అనుకునే సినిమాలు నేను తీయను… ఇలాంటి కథ జరిగితే బాగుంటుంది అనుకునే సినిమాలనే తీస్తాను.“ అని చెప్పిన మాస్‌ మసాలా దర్శకుడు `మన్‌మోహన్ దేశయ్` తన కెరీర్‌లో కోట్లుగడించినా మాస్‌పల్స్ తెలియడానికా అన్నట్లు జీవితాంతం ముంబాయ్‌లోని మిడిల్‌క్లాస్ బస్తీలోనే నివాసమున్నాడని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తన ప్రతి సినిమాలోనూ హిందూ, ముస్లీం, క్రిస్టియన్ పాత్రలు పెట్టి వారి మధ్య బ్రదర్‌హుడ్ కోసం ప్రయత్నిచాడట.
 
తన కొడుకులా మరెవరూ పోలియో బారిన పడకూడదనే ఉద్దేశ్యంతోఉద్దేశంతో తన సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోధాన్ని అందిస్తూనే `పోలియో`పట్ల ఎడ్యుకేట్ చెయ్యాలని భావించి తన బిడ్డ `మ్యాకీ`నే ప్రధాన పాత్రగా చేసి `కువారా బాప్` చిత్రాన్ని తీసిన `మొహమూద్` గురించి చదువుతుంటే మనసులో ఏదో మూల కలుక్కుమంటుంది.
 
ఆనాటి సామాజిక పరిస్థితులనే కథాంశాలుగా తీసుకుని చిత్రాలు నిర్మించి విజయవంతమైన మనోజ్‌కుమార్, దేవానంద్, హృషికేష్ ముఖర్జీ, బాసూ చటర్జీలవంటి ఫిల్మ్‌మేకర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సమాజం పట్ల వారికున్న నిబద్ధత అర్థం అవుతుంది.
పంక్తి 180:
తారుమారయ్యాక పాత్రల స్వభావం మారి హీరో హీరోయిన్ల జీవితాలతో చెలగాటం ఆడటం అనే అనాదిగా వస్తున్న ఫార్ములాను ఒక్కొక్కరూ ఒక్కోలా తీశారు అంటూ కె.వి రెడ్డి ‘మాయాబజార్‌’ను, బాపూ ‘మంత్రిగారివియ్యంకుడి’నీ, నాసిర్ హుస్సేన్ `హమ్‌ కిసిసే కమ్‌ నహీ` చిత్రాలను రచయిత పోల్చినప్పుడు.. నిజమేకదా.. అన్ని కథాంశాలలోనూ పాయింట్ ఒకటే కదా అనిపిస్తుంది.
 
జంజీర్ గురించి రాసినవ్యాసంలొరాసినవ్యాసంలో “టైటానిక్ ” మునిగిపోయింది.. అయితే దానిని ఉత్తినే ముంచకుండా ప్రేమను జతచేశాడు దర్శకుడు. `యాదోంకి బారాత్`లొ పగ తీర్చుకోవడంవుంది. ఆయితే ఆ పగను అలాగే వుంచకుండా దానికి ప్రేమను, పాటను కలిపాడు దర్శకుడు.’జంజీర్’లో కూడా పగే వుంది. ఆయితే దానిని అలాగే చూపకుందా వర్తమాన పరిస్థితులను జతచేశాడు దర్శకుడు అంటూ సక్సెస్ ఫార్ములా కిటుకును వివరించాడు రచయిత. చెప్పే కథాశం ప్రేక్షకుడికి చేదు మాత్రలా ఘాటుగా వుండకుండా షుగర్‌కోటెడ్‌ పిల్‌లా వుండేలా అవసరమైన సరుకును కూడా కథలొ చేర్చాలనేది దీని సారాంశం . .
 
‘బావర్చీ’ చిత్రం గురించి చెబుతూ మన పని మనం ఎలాగూ చెసుకుంటూం .. ఎదుటివారి పని చేయడంలొచేయడంలో వుండే ఆనందం అనుభవిస్తే తప్ప అర్దంకాదు..తల్లితండ్రులు , తోబుట్టువులు కొత్తగా రారు. మనసుకు నచ్చిన స్నేహితులు వెంట వెంటనే దొరకరు… మన బంధాలు పరిమితం.. అపురూపమైన ఈ మనుషులను, వారితో కలిసి పొందాల్సిన సంతోషాలను మిస్‌ కాకండి అని చెప్పడం ఎంతో బాగుంది.
 
ఎప్పుడూ గతం తాలూకు విషాదంలో, భవిష్యత్తు తాలూకు బెంగలో వుంటూ ఈ క్షణంలో వున్న ఆనందాల్ని, సౌందర్యాల్ని నిర్లక్ష్యంచేసి… చెప్పాపెట్టకుండా మృత్యువు ప్రత్యక్షం అయినప్పుడు.. అరె…! యింత కాలం ఎలా వృధా చేశాను అని తల బాదుకున్నా సమయం వెనక్కిరాదు అనే సత్యాన్ని ఆవిష్కరించిన `హ్నషికేష్ ముఖర్జీ` `ఆనంద్`ని గుర్తుచేసుకున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం తడుముకుంటాము. ప్రతి క్షణాన్నీ మనస్పూర్తిగా జీవిస్తూ సాటిమనుషులకు ప్రేమను పంచుతూ వారి నుండి ప్రేమను పొందడమే జీవితం… ఈ క్షణం పోతే మళ్లీ రాదు అని చెప్పే `ఆనంద్` లాంటి పాత్ర మళ్లీ వెండి తెరపైకి వొస్తుందా..?
 
మూగ, చెవుడు, గుడ్డి మనుషులు వారి మనసులతోనే కమ్యూనికేషన్ ఏర్పరచుకొని తమ మధ్య స్నేహబంధాన్ని సృష్టించుకుంటుంటే అన్నీ వున్న మనం మాత్రం మన భాషని, మాటని, ఎప్పుడూ శత్రువులను తయారుచేసుకోవడానికే ఉపయోగించుకుంటున్నాం అని చర్చించే `గుల్జార్` `కోషిష్` చిత్రంపై ఖదీర్‌బాబు విశ్లేషణ అద్భుతం. ఆ మాటకొస్తే అన్ని విశ్లేషణలూ వ్యాసాలూ హృదయాన్ని తాకుతాయి. ఎందుకంటే యిందులో ప్రస్తావించిన సినిమాలన్నీ హృదయమున్న సినిమాలే కాబట్టి. అందుకే వెంటనే పుస్తకంకొని చదవండి. ఆ కళాఖండాలను వీక్షించమని మీ మనసే మిమ్మల్ని తొందరపెడుతుంది.
అన్నిటికన్నా ఈ పుస్తకం వెనుక అట్టమీద వున్న నాలుగులైన్లు ఆకర్షించాయి నన్ను అవి.. “ సినిమాకు భాష అడ్డుగోడకాదు. అడ్డుగోడల మీద సినిమా వారధి కావాలన్నది ఆలోచన. నిజానికి ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే గొప్ప ప్రక్రియ సినిమా“.
 
పంక్తి 193:
గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది.
 
“మన్ చాహే గీత్” ... మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన హిందీ పాటలు-పరిచయాలు చాలా సరళంగాను, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సురయ్యా, షంషాద్ బేగం , తలత్ మహమూద్, మన్నాడే నుండి రఫీ, లతా, కిశోర్ ల వరకు అందరి గాయకుల్ని, గొప్ప గొప్ప సంగీతదర్శకుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతంగా వుంది. అంతటి గొప్ప కళాకారులకి కేవలం రెండేసి పేజీలు ఎలా సరిపోతాయన్న సందేహాన్ని పుస్తకంలోకి ప్రవేశించగానే పటాపంచలు చేసేశాడు ఖదీర్ బాబు. సంగీతం గురించి చాలా సూటిగా చెబుతూనే అందరి సంగీతకారుల జీవిత కోణాల్ని స్పృశించిన పద్ధతి చాలా బావుంది.
 
పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత ఆయా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకొని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సంగీతప్రియులు తప్పక షెల్ఫు లోషెల్ఫులో ఉంచుకోవాల్సిన పుస్తకం.
 
===న్యూ బాంబే టైలర్స్: ===
న్యూ బాంబే టైలర్స్:<ref>[http://www.beditor.com/telugu-stories/402-new-bombay-tailorskhadeerbabu న్యూ బాంబే టైలర్స్...మహమ్మద్ ఖదీర్ బాబు ]</ref>
పుస్తకం లోపుస్తకంలో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్ , దావత్, జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ ) (కొన్ని కథలు సంక్షిప్తంగా)
 
ఈ కథా సంపుటం లోని మొదటి కథ న్యూ బాంబే టైలర్స్ . ఈ కథ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్ధులవిద్యార్థుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు సంపాదించుకుంటున్న తరుణంలో పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్ ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు. ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కథ.
 
*'''జమీన్:'''
ఈ సంపుటి లోని జమీన్ కథకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై కథ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం: ఇది ఇద్దరు బాల్యమిత్రుల కథ. కసాయి కొడుకు హుసేన్, మాలపల్లె లోమాలపల్లెలో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాల లోచీరాలలో ఉండే హుసేన్‌కు తన స్వస్థలమైన కావలి లోకావలిలో చిన్న ఇల్లు కట్టుకోవాలని, అక్కడే కనుమూయాలని ప్రగాఢ కోరిక. స్థలం లభ్యమయ్యిందన్న కబురు బ్రమ్మయ్య నుంచి అందగానే కావలికి పయనమైన హుసేన్ ఆ స్థలం తన మిత్రుడు బ్రమ్మయ్యదే అని తెలుసుకొని ఆనందభరితుడవుతాడు. అయితే బ్రమ్మయ్య కొడుకు రమణ ఆర్.ఎస్.ఎస్. పార్టీ లోపార్టీలో చేరి ఆ సిద్ధాంతాలను ఒంటపట్టించుకొని, సాయిబు హుసేన్ కు స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో, ఖిన్నుడయిన హుసేన్ చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు, వికల హృదయంతో.
 
*'''ఒక సాయంత్రపు అదృష్టం:'''
పంక్తి 213:
మొదటిసారి మహ్మమ్మద్‌ ఖదీర్‌ బాబు రచన “గెట్‌ పబ్లిష్‌డ్‌’! 36 పేజీల చిన్న పుస్తకం. ఏ పత్రికలోనూ రాకుండా, డైరెక్ట్‌ కతానికగా ప్రత్యేక బుక్‌లెట్‌గా వచ్చింది. ఇపుడు అదే కథ ఈ పుస్తకంలో చేర్చారు. చారిత్రక అవసరం అనదగిన ఈ “మాష్టర్‌ పీస్‌’ కథానికలో వస్తువుని ముందుగా తెలుసుకుందాం. షకీల్‌ ఒక బాధ్యతాయుతమైన పదవిలోని పాత్రికేయుడు. అతనొక రిపోర్ట్‌ తయారు చేస్తున్నాడు. ఆ రిపోర్టే ఈ కథానిక.
 
“గెట్‌ పబ్లిష్‌డ్‌’ లోపబ్లిష్‌డ్‌’లో (షకీల్‌ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్‌. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్‌ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్‌ స్మార్ట్‌ బాయ్‌. ముష్టాక్‌ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్‌-మూడోపాత్ర. అతను అత్తర్‌ నయాబ్‌-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్‌ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.
 
ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్‌’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. హైదరాబాద్‌లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్‌ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్‌ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్‌ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్‌ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! ముగ్గురు అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!
పంక్తి 223:
[https://www.kahaniya.com/s/mukku-poleramma-banda పోలేరమ్మబండ కతలు]
{{Reflist}}
 
 
అరుణ పప్పుగారి విశ్లేషణ
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు