మాధ్యమము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: శబ్ధం → శబ్దం (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: పరిక్ష → పరీక్ష, ఆధిఖ్యత → ఆధిక్యత, ఇప్పు using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''మాధ్యమము''' అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధానించేది. మానవాభివృద్ధికి మాధ్యమము చాలా ఉపకరిస్తుంది. సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరినప్పుడే విజ్ఞానం విస్తరిస్తుంది. ఉదాహరణగా రచయిత తన కల్పనా శక్తితో రచించే కథలు, నవలలు, వ్యాసాలు లాంటివి ప్రజలకు చేరినప్పుడే రచయితకు తృప్తి రచనకు సార్ధకత ఏర్పడుతుంది. ప్రజా పాలనకు మాధ్యమం అత్యవసరం. ఉదాహరణగా రాజ్యాంగ ఉత్తరువులను ప్రజలకు చేర్చడంలో ప్రచురణా మాధ్యమం తోడ్పడుతుంది. పండితులను పామరులకు చక్కగా చేరువ కాగలిగింది అందరికి సులువుగా అర్ధం అయ్యేది శబ్ధరూపం. ఆకాశవాణి వాణి కార్యక్రమాలు శబ్ధరూప మాధ్యమం. ఆకాశవాణి వాత్రలను అందించడం లాంటి అనేక కార్యక్రమాలను అందించి ఒకప్పుడు ప్రజలను విపరీతంగా అలరించింది. ఇక ప్రచురణా వ్యవస్థ అత్యద్భుత సేవలు అందిస్తూ ప్రజలను విపరీతంగా అలరించింది ఇప్పుడూ అనేక సంచలనాలను సృష్టిస్తుంది ప్రజాదరణ చూరగొంటూ ముందడుగు వేస్తున్నదీ మాధ్యమం.▼
▲'''మాధ్యమము''' అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధానించేది. మానవాభివృద్ధికి మాధ్యమము చాలా ఉపకరిస్తుంది. సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరినప్పుడే విజ్ఞానం విస్తరిస్తుంది. ఉదాహరణగా రచయిత తన కల్పనా శక్తితో రచించే కథలు, నవలలు, వ్యాసాలు లాంటివి ప్రజలకు చేరినప్పుడే రచయితకు తృప్తి రచనకు
=== పురాతన కాల మాధ్యమం ===
ఆదిమానవుని కాలంలో కుడ్య శిల్పాలు, కుడ్య చిత్రాలు ఒక రకంగా మొదటి మాధ్యమమని అనుకోవచ్చు. లిపి కూడా లేని కాలంలో మానవుడు తన భావాలను
వెబుచ్చడానికి చేసిన ప్రయత్నమే కుడ్యశిల్పాలు. అవి ఇప్పటికీ ఆనాటి నాగరికత, ఆనాటి జంతువులు, వారి సంస్కృతి మనకు అందిస్తూ గత చరిత్రను ఆధునికులకు అందించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నాయి. అజంతా ఎల్లోరా గుహలు దీనికి ఉదాహరణలు. లిపి పుట్టిన తరువాత కాగితం లేని సమయంలో ముందుగా సమాచారాన్ని, భద్రపరచి ప్రజలకు అందించడానికి కొంత ఎక్కువ కాలం మన్నే తాటి ఆకులను రచయితలు మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పటికీ పురాతన రచనల తాళ పత్ర
=== వస్తురూప మాధ్యమం ===
Line 8 ⟶ 10:
నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా అప్పటి చరిత్రను వేషధారణను మరింత విశదీకరిస్తాయి.
=== కళారూప మాధ్యమం ===
గానము, నాట్యము, నాటకము, బుర్రకథ, వీధినాటకాలు, కథాకాలక్షేపము, హరికథ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కథలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కథను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కథను స్వయంగా
=== అచ్చురూపమాధ్యమం ===
కాగితం, కలం కనుగొనడం మాధ్యమంలో విపవాత్మకమైన మార్పులబ్ను తీసుకు వచ్చింది. రాజ్యాంగపరమైన విషయాలను, రాజ్యాంగ వ్యవహారాలను, ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలు, నూతన పరిశోధనలు వంటి అనేక విషయాలను ప్రజల మధ్యకు దినపత్రికల రూపంలో అందడం మొదలైంది. అలాగే వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు వ్యాపారసరళిలో కథలు, కావ్యాలు, ధారావాహికలు, చిట్కాలు
మార్పులు తీసుకు వచ్చింది.
=== నాటకరంగం ===
మహాకవి కాశిదాసు నాటకాలను రచించాడు కనుక నాటకరంగానికి పునాదులు అతి ప్రాచీనమనవే. రచయితలు దృశ్యాలను వర్ణించి, పాత్రల సంసంభాణలను చేర్చి, పాత్రల ప్రవేశం హావభావాలను వివరిస్తూ సాగించిన నాటక రచనలను దర్శలుకు నటులకు ముందుగా తర్ఫీదు ఇచ్చి తరువాత రంగస్థలం మీద ప్రజల ముందు ప్రదర్శనకు తీసుకు వస్తారు. ఇంతకు ముందు కథలుగా విన్న వాటిని పాత్రల హావభావాలతో సజీవంగా చూసే అవకాశం ప్రజలను ఆకర్షించింది. ముందుగా పురాణకథలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ప్రజలకు పురాణ పాత్రలను దృశ్యరూపంగా చూసే అవకాశం కల్పించింది. అనేక మంది కళాకారులు నాటకాలకు తమ జీవితాలను అంకితం చేసారు. ఆతరువాత చిన్నగా చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు ప్రజకు అందించారు. చలన చిత్రాలు వచ్చాక అనేక నాటక కళాకారులు చిత్ర రంగ ప్రవేశం చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. నాటకానికి ప్రాణం పాటలు పద్యాలు కనుక కళాకారులు సంగీతంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండే వారు. పాటలు, పద్యాలు ప్రజలకు త్వరగా చేరువ ఔతాయి కనుక నాటకాలలో పాటలు పద్యాల పాత్ర అధికమే. కొన్ని పద్యాలను ప్రేక్షకులు ఒన్స్ మోర్ అని అడిగి పాడించుకున్న సందర్భాలు కో కొల్లలు.
కొన్ని నాటకాలు నూరు ప్రదర్శనలు దాటి ప్రదర్శించబడ్డాయి. చలన చిత్రాలు వచ్చే వరకు నాటకరంగ
=== శబ్ధరూప మాధ్యమం ===
రేడియో కనిపెట్టిన తరువాత శబ్ధరూప మాద్యమం మరింత ఊపందుకుంది. ఒకప్పుడు కొమ్ము బూరలను, శంఖనాదాన్ని, గంటా నాదాన్ని శబ్ధరూప మాధ్యమంగా వాడుకున్నారు. విదేశీ నావికులు తాము వ్యాపారార్ధం పట్టుకు వచ్చిన వస్తువులను విక్రయించడానికి శబ్ధరూపమైన సింగి నాదాన్ని వాయించి ప్రకటించే వారు. ప్రజలు ఆశబ్దం విని వెళ్ళి సామాను కొనే వారు. అందుకే సింగినాదం విని జీలకర కొనేవారు కనుక సింగినాదం జిలకర అనే సామెత వచ్చింది. రాజులు లాలంలో యుద్ధం ఆరంభించడానికి ముందు శంఖనాదంతో తమ సంసిద్ధతను చాటే వారు. కొందరు సన్యాసులు, భిక్షుకులు కూడా ఒకప్పుడు శంఖనాదం చేసేవారు. చర్చిలో గంటానాదంతో కొన్ని విషయాలను చెప్పేవారు. రాజులు గంటా నాదంతో ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. వేదాలు శబ్ధరూపంగానే వినపడ్డాయి. అవి ఎవరిచేత రచింపబడ లేదు కనుక అవి అపౌరుషేయాలు, శ్రుతులైనాయి. వేదాలను పఠించడం ద్వారానే గురువుల నుండి శిష్యులు నేర్చుకుంటారు. ఆకాశవాణి వచ్చిన తరువాత శబ్ధరూప మాద్యమంలో మరింత మార్పులు వచ్చాయి. ఊదయం భక్తి గీతాలతో ప్రారంభం చేసి సూక్తులు చెప్పి వ్యవసాయదారులకు సూచనలు అందించి దేశంలో జరిగిన విశేషాలను వార్తలలో అందించడం వరకు ఆకాశవాణి కార్యక్రమాలద్వారా ప్రజలకు అందించేది. పంచాయితీలలోను రేడియోలను పెట్టి చదువు కోని పామరులకు విశేషాలు తెలుసుకోవడం సులువైంది. సంగీతం, కథలు, నాటకాలు, స్త్రీల కార్యక్రమాలు, బాలల పాటలు ఆకాశ వాణి అందించేది. చలన చిత్రాలను శబ్ధరూపంలో విని ఆనందించే వారు. రేడియో ఉండడం అప్పట్లో
=== చలన చిత్ర రంగం ===
వినోదమే ప్రధానమైన మాధ్యమం చలన చిత్రరంగం. అప్పటి వరకూ ప్రజల మనసులను దోచుకున్న నాటకరంగాన్ని త్రోసి రాజని చలన చిత్ర రంగం ముందుకు సాగింది. ముందు మూకీ చిత్రాల విడుదల. మాటలు లేకపోయినా ప్రజలను చిత్రరంగం సమ్మోహన పరచింది. తరువాత చిత్రాలకు మాటలు పాటలు పద్యాలను చేర్చి ప్రదర్శించ గలిగారు. చిత్రరంగం ప్రజల జీవితంలో ఒక భాగం అయి పోయింది. ఒకప్పటిలా కాకున్నా ఇప్పటికీ చలన చిత్రాలకు ప్రజల జీవితంలో చలన చిత్రాల స్థానం ప్రత్యేకమే. చలన చిత్రాలు ప్రజలకు చరిత్రను సదృశ్యకంగా చూపించాయి. పల్నాటి యుద్ధము, మహామంత్రి తిమ్మరుసు, అనార్కలి, తెనాలి రామకృష్ణ, అల్లూరి సీతారామ రాజు వంటి అనేక చిత్రాలు ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. పౌరాణిక చిత్రాలు ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. రామాయణ, మహా భారతం, శివపురాణం వంటి పురాణేతిహాసాలలోని ఘట్టాలు అనేకం వివిధ చిత్రాలుగా విడుదలై ప్రజాదరణ పొంది అమోఘ విజాయాన్ని సాధించాయి. భక్తుల చరిత్రలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించిన చిత్రాలు ప్రజలకు ఆనాటి రోజులను కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రజలను అలరించాయి. చిత్రరంగం వినోదము అందించడామే కాక అనేక మందికి జీవనోపాధికి కారణమైంది. చలనచిత్ర నటులు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అభిమాన సంఘటితమై సంఘాలు ఏర్పరుచుకున్నారు. నాయకులకు పాలాభిషేకం చేసి గుడి కట్టి పూజించేంతగా నటులు ప్రజాభిమానం సంపాదించుకున్నారు. ఒకాపటి నాటక నటులు తరువాత చలచిత్ర నాయకులు, నిర్మాతలు అయ్యారు. హిందీ నటుడు రాజకపూర్ కుటుంబం అందుకు తార్కాణం. వారి తండ్రి పృధ్వీరాజ్ కపూర్ నాటకరంగం నుండి చిత్రరంగానికి వచ్చి చిత్రరంగంలో శాశ్వత స్థానం సపాదించాడు. వారి కుటుంబం ఇప్పటికీ చిత్రరంగంలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటులను చిత్రరంగానికి అందించినది నాటక రంగమే. చిత్ర రంగం నుండి రాజకీయాలలో ప్రవేశించిన ఎమ్.జి.రామచంద్రన్, పౌరాణిక పాత్రధారణతో ఆయా పాత్రలకు ప్రాణం పోసిన నందమూరి తారక రామారావు, వివిధ భాషలలో నటించి ప్రజాభిమానం చూరగొన్న జయలలిత వంటి నటీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయంగా ఆయారాష్ట్ర ఉన్నత స్థానాలైన ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నారు. చిత్ర రంగం కళాకారులంరి సమైక్య కృషితో
=== దూరదర్శన్ ===
చలన చిత్రాల తరువాత ప్రజాజీవితంలో ప్రవేశించిన దూరదర్శన్ ప్రజాలను ప్రజల మనసును చలన చిత్రాల నుండి కొంత త్న వైపు తిప్పుకుంది. ప్రారంభంలో బ్లాక్ & వైట్
|