ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , నారయణ → నారాయణ, నరాయణ → నారాయణ, ణంలు → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Muktinath Temple.jpg|thumb|right|ముక్తినాథ్]]
 
[[నేపాల్]] దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం '''ముక్తినాథ్'''. ముక్తినాథ్ హిందువులకు ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా (ఒక్కోసారి పొరపాటుగా దీనిని కుడా ముక్తినాథ్ అంటూ ఉంటారు) గ్రామానికి సమీపంలో ఉంది. [[హిందువులు]] ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉన్నదని తరువాత బౌద్ధుల ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తున్నారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నరాయణకుశ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారు. [[టిబెట్]] భాషలో చుమింగ్ గ్యాస్థా అంటే నూరు జలాలు అని అర్ధం. టిబెటిన్
[[బౌద్ధులు]] ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తున్నారు.
 
పంక్తి 8:
[[File:Brass watespouts (108 total)at Chumig Gyatsa, Muktinath (4522750737).jpg|thumb|right|నందిముఖ జలధారలు]]
[[File:Men running through the 108 waterspouts at Muktinath (4522751877).jpg|thumb|left|పవిత్రజల స్నానం]]
ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అల్లగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా [[శ్రీరంగం]], [[శ్రీవైకుంఠం]], [[తిరుమల]], [[నైమిశారణ్యం]], [[తోతాద్రి]], [[పుష్కర్]] మరియు [[బద్రీనాథ్]]. ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భవిస్తున్నారు. భక్తిలు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు. బౌద్ధుల ఆరాధనకు చిహ్నంగా ఆలయంలో ఒక బౌద్ధసన్యాసి నివసిస్తున్నాడు.
 
== శక్తి పీఠం ==
[[File:Dakshayani.jpg|thumb| సతీదేవి దేహాన్ని మోసుకుపోతున్న మహాశివుడు]]
భారతీయ సంస్కృతిలో హిందూమత పురాణలలో దక్షయఙం మరియు సతీదేవి దహనం గురించి విస్తారంగా ప్రస్తావించబడింది. సతీదేవి దేహత్యాగం పలు శక్తిపీఠాల స్థాపనకు దారితీసింది. శక్తి ఆరాధనకు ఈ శక్తిపీఠాలు తగినంత బలం చేకూరుస్తున్నాయి. పురాణాలలో దక్షయఙం గురించిన వివరణ విస్తారంగా కనిపిస్తుంది. శైవంలో ఇది అతిముఖ్యమైన సంఘటన. సతీదేవి దేహత్యాగం ఫలితంగా పార్వతీ జననం సంభవించింది. శివుడు గృహస్థుగా మారడం గణపతి మరియు సుబ్రహ్మణంలుసుబ్రహ్మణాలు ఆవిర్భవించడానికి దారితీసింది. శక్తి ఆరాధనకు శక్తిపీఠాలు మూలస్థానాలు. శక్తి పీఠాలు మహాశివుడు సతీదేవి దేహాన్ని భుజానవేసుకుని దుఃఖిస్తూ ఆర్యావర్తంలో సంచరించ సాగాడు. సమయంలో ఇంద్రాది దేవతలు బ్రహదేవుడితో కలిసి మహావిష్ణువును ఈ దిగ్భ్రాంతి నుండి మహాశివుని వెలుపలికి తీసుకురమ్మని వేడుకున్నారు.మహాశివుని ఆ దిగ్భ్రాంతి నుండి వెలుపలికి తీసుకురావడానికి సతీదేవి దేహన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసాడు. సతీదేవి దేహం పడిన ప్రదేశాలన్ని 51 శక్తిపీఠాలు అయ్యాయి. .
 
== పురాణం ==
[[File:Kali Gandaki Valley263, Nepal.JPG|thumb|left|గండకీ లోయ]]
టిబెట్ బుద్ధిజం స్థాపకుడైన పద్మసంభవ ( గురురింపోచ్) టిబెట్‌కు వెళ్ళే సమయంలో ఈ ప్రదేశానికి చేరుకుని ద్యానం చేసాడని బుద్ధసంప్రదాయకులు భవిస్తున్నారు. ఈ ఆలయాన్ని హిందూపురాణాలు కూడా పలుమార్లు ప్రస్థావించాయిప్రస్తావించాయి. విష్ణుపురాణంలో గండకీ నదీ మహాత్యంలో ముక్తినాథ్ గురించి శ్లాఘించబడింది.
 
ముక్తినాథ్ నుండి ప్రవహిస్తున్న కాలిగండకి శిలామూర్తి లేక సాలిగ్రామశిలలకు ఆలవాలం. ప్రపంచంలో ఎక్కడ విష్ణాలయాలు నిర్మించాలన్నా ఈ శలిగ్రామశిలలు అత్యవసరం. హిందువుల అత్యంత పవిత్రక్షేత్రాలలో గండకీ నది ఒకటి అని భావించబడుతుంది. 108 జలప్రవాహాలు పలు హిందూ విశ్వాసాలకు ప్రాతిపదిక. హిందూ జ్యోతిషంలో రాశిచక్రంలో 12 స్థానాలు ఉంటాయి. అలాగే 9 గ్రహాలకూ అంతే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రాశులను గ్రహాలతో గుణించినప్పుడు వచ్చే సంఖ్య 108. జ్యోతిషంలో నక్షత్రాల సంఖ్య 27, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. ఈ నక్షత్రాలను పాదాలతో లెక్కిస్తే వచ్చే సంఖ్య 108. దేవతల అష్టోత్త్స్రంలో నామాల సంఖ్య 108. ఇలా హిందూ సమాజంలో 108కి ఒక ప్రత్యేకత ఉంది.
పంక్తి 30:
==దర్శనం, సేవలు మరియు ఉత్సవాలు ==
[[File:Looking back up the Jhong Khola valley to Jharkot, Muktinath, and the Thorong La pass (4523539947).jpg|thumb|right|ముక్తినాథ్‌ నుండి హిమాలయ శిఖరాల సుందర దృశ్యం]]
ముక్తినాథ్ దర్శనానికి తగిన సమయం మార్చ్మార్చి నుండి జూన్. ఇతరమాసాలలో వాతావరణ పరిస్తితులుపరిస్థితులు అనుకూలిచవు. భక్తులకు ఈ ప్రయాణంలో అనేక ఆలయాలు మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
 
==. శ్రీ వైష్ణవ సంప్రదాయం ==
తిరుమంగై ఆళ్వార్ ముక్తినాథ్‌ను సందర్శించనప్పటికీ శ్రీమూర్తి సమీపప్రదేశాల గురించి తన పాటలద్వారా వర్ణించాడు. పెరియాళ్వార్ తన కీర్తనలలో శ్రిమూర్తిని సాలిగ్రామముడైయానంబి అని కీర్తించాడు. 2009లో జరిగిన మహాయఙం సందర్భంలో తమిళనాడులోని ముఖ్యమైన వైష్ణవవక్షేత్రాలలో ఒకటైన శ్రీవిల్లిపుత్తూరు పూజారి, శ్రీ మనవాళ మునిగళ్ మఠం , శ్రీ శ్రీ శ్రీ శఠగోప రామానుజ జీయర్‌లు ఆండాళ్ (గోదాదేవి), [[శ్రీరామానుజ]] మరియు మనవాళ మునిగళ్ విగ్రహాలను పురాతన వైష్ణవక్షేత్రమైన ముక్తినాథ్ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. ఇది పవిత్రమైన ముక్తినాథ్ చరిత్రలో ఒక మైలురాయి అని భక్తులు భావిస్తున్నారు. శ్రీవైష్ణవానికి చెందిన అనేకమంది భక్తులు ఈ పవిత్రక్షేత్రాన్ని దర్శించారు. ఈ క్షేత్రంలో శ్రీపరాపధనాథ్ శ్రీ భూమి, నీలా మరియు గోదాదేవిలతో పర్యవేష్టితమై ఉన్నాడు. భౌద్ధులకు ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనది. బౌద్ధులు కూడా ముకినాథ్‌లో ఉన్న శ్రీమన్నారయణశ్రీమన్నారాయణ మూర్తిని మోక్షప్రదాతగా ఆరాధిస్తున్నారు. ఆలయం చుట్టూ నందిముఖాల నుండి వెలువడుతున్న పవిత్రజలాలు [[శ్రీరంగం]], [[శ్రీవైకుంఠం]] మరియు [[తిరుమల]] వంటి 108 దివ్యక్షేత్రాల పుష్కరిణికి ప్రతీకలుగా భావిస్తున్నారు.
 
==ప్రయాణ వసతులు ==
[[File:Hotel North Pole, Ranipauwa (Muktinath) (4560217823).jpg|thumb|right|ముక్తినాథ్ లోని యాత్రికుల వసతిగృహం]]
క్లిష్టమైన వాతావరణ పరిస్తితులపరిస్థితుల కారణంగా కాట్మండ్ నుండి పోక్రా లోని జాంసం విమానాశ్రయానికి ప్రయాణించి అక్కడి నుండి ట్రక్కులు మరియు జీబుల ద్వారా ప్రయాణించి ముక్తినాథ్ చేరుకోవచ్చు. పరిస్తితులుపరిస్థితులు అనుకూలించినపుడు కొంతమంది భక్తులు హెలికాఫ్టర్ ద్వారా ప్రయాణించి 40 నిముషాలకు ముక్తినాథ్ చేరుకోవచ్చు. హెలికాఫ్టర్‌లో వచ్చేవారిని సిక్నెస్ కారణంగా ఎక్కువసేపు ఉండడానికి అనుమతించబడరు. మౌంటెన్ ఇలా చేస్తుంటారు. రాణిపురా, జాంకర్‌కాట్, చొంగర్, కాగ్‌బెనీ లేక జాంసంలలో యాత్రీకులకు బసచేయడానికి వసతిగృహాలు లభ్యమౌతాయి.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు