మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కు → కు (2), గా → గా , ప్రత్యర్ధు → ప్రత్యర్థు, using AWB |
||
పంక్తి 1:
[[బొమ్మ:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది) ]]
ఆంధ్ర, [[తెలంగాణా]] ప్రాంతాలు కలిసి [[ఆంధ్ర ప్రదేశ్ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] కావడంలో కీలకమైనది [[పెద్దమనుషుల ఒప్పందం]]. [[1956]], [[ఫిబ్రవరి 20]] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి [[1956]], [[నవంబర్ 1]] న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు.
అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే [[1959]]లో [[దామోదరం సంజీవయ్య]] ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన [[కె.వి.రంగారెడ్డి|కొండా వెంకట రంగారెడ్డి]] (కె.వి.రంగారెడ్డి) ని నియమించాడు. అయితే మళ్ళీ [[1962]] నుండి [[1969]] వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన [[జె.వి.నర్సింగరావు]]ను ఉపముఖ్యమంత్రిగా నియమించారు.
ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు.
==సామాజిక నేపథ్యం==
ఆంధ్ర ప్రాంతం నుండి తరలి వచ్చిన ప్రజలు తెలంగాణా ప్రాంతంలో భూములు లకొని, వ్యవసాయం చేసారు . ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణా ప్రజలు తెలుసుకొనరు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణా ప్రజల్లో కలిగింది. తెలంగాణా విద్యాసంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని
మాకు సరైన న్యాయము
పంక్తి 12:
==రాజకీయ నేపథ్యం==
[[1967]]లో ముఖ్యమంత్రి అయిన తరువాత [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడీ అయిన [[మర్రి చెన్నారెడ్డి]] ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు, గనుల శాఖమంత్రిగా [[ఢిల్లీ]] వెళ్ళడంతో, ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. <!--ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డికి ఇది లాభించింది. -->అయితే, కొద్దిరోజుల్లోనే అనుకోని ఒక సంఘటన జరిగింది.
అంతకు కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన [[వందేమాతరం రామచంద్రరావు]] వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చెయ్యకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, పైకోర్టుకు వెళ్ళాడు. అక్కడా ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది. <!--ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా పనిచెయ్యలేదని ఆగ్రహించిన చెన్నారెడ్డి అవకాశం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. కొద్దిరోజుల్లోనే మొదలైన తెలంగాణా పరిరక్షణ ఉద్యమం ఈ రాజకీయ నిరుద్యోగికి అందివచ్చిన అవకాశమైంది.-->
పంక్తి 18:
==ఉద్యమ ప్రారంభం==
తెలంగాణా ఉద్యమం '''తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమం''' గా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ [[1969]], [[జనవరి 9]] న [[ఖమ్మం]] పట్టణంలో
అయితే, [[జనవరి 13]] న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో
జనవరి 18 న
ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం [[జనవరి 19]] న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది.
పంక్తి 35:
==రెండవ దశ==
[[బొమ్మ:Kaloji-1.jpg|thumb|right|మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త [[కాళోజీ నారాయణరావు]]]]
[[జనవరి 24]] న [[సదాశివపేట]]
[[జనవరి 28]] న [[వరంగల్లు]]
==కోర్టు కేసులు==
పంక్తి 48:
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో మరో దావా వెయ్యగా, కోర్టు తమ ఫిబ్రవరి 3 నాటి తీర్పు అమలు పై స్టే ఇచ్చి, విచారణకు డివిజను బెంచిని ఆదేశించింది. [[ఫిబ్రవరి 18]] న సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చి, ఉద్యోగుల బదిలీలను ఆపేసింది.
1969, [[ఫిబ్రవరి 20]]: హైకోర్టు మరో తీర్పు ఇస్తూ, ఇలా వ్యాఖ్యానించింది.
* ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమే.
పంక్తి 57:
1969, [[మార్చి 7]]: ముల్కీ నిబంధనల అమలుపై మునుపు తనిచ్చిన స్టేను ధృవీకరిస్తూ, అదనపు పోస్టుల సృష్టించడాన్ని కూడా నిలిపివేసింది.
1969, [[మార్చి 29]]: సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది:
* ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
పంక్తి 65:
1969 [[ఫిబ్రవరి 28]] న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో '''తెలంగాణా ప్రజాసమితి''' ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా [[మార్చి 3]] న తెలంగాణా బందును జరిపింది.
[[బొమ్మ:Marri Chennareddy.jpg|thumb|right|ఉద్యమాన్ని రాజకీయం చేసిన [[కాంగ్రేసు పార్టీ]] నాయకుడు [[మర్రి చెన్నారెడ్డి]]]]
మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న [[మర్రి చెన్నారెడ్డి]] కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. [[మే 1]] - '''మేడే''' నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. [[మే 15]] న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్థినాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి
1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దోపిడీలు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది.
1969 [[జూన్ 24]] న తెలంగాణా నాయకులు [[ప్రధానమంత్రి]] [[ఇందిరా గాంధీ]]తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. [[జూన్ 25]]న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, [[రాజమండ్రి]]కి తరలించారు. [[జూన్ 27]] న ముఖ్యమంత్రి [[కాసు బ్రహ్మానందరెడ్డి]] తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు [[నిజలింగప్ప]]కు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు.
పంక్తి 74:
==ఉద్యమం వెనుకంజ==
1969 సెప్టెంబర్ లో ఉద్యమం చల్లారడం మొదలైంది. 1969 [[సెప్టెంబర్ 22]]న కొండా లక్ష్మణ్ బాపూజీ "ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు" అని అన్నాడు. ఉద్యమ తిరోగమనానికి ఇది ఒక సూచిక.
విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 [[సెప్టెంబర్ 29]] న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.
[[అక్టోబర్ 10]] నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు
1969 [[నవంబర్ 26]] చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక
ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి, 1969 డిసెంబర్ వరకు రాజకీయనాయకుల ఎత్తులు పైయెత్తుల మధ్య, ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్లారిపోయింది. తెలంగాణా ప్రజాసమితి మరో రెండేళ్ళు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. [[1971]] [[సెప్టెంబర్ 24]] న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.
|