యజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పుర్తి → పూర్తి, రొజు → రోజు, సమిష్టి → సమష్టి (2), ప్రధమ using AWB
పంక్తి 7:
వైదిక యజ్ఞంలో "అధ్వర్యుడు" ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు, పండితులు ఉంటారు. "హోత" ఈయన ఆహుతికి పూర్వం మంత్రాల్ని పఠించి దేవతల్ని యజ్ఞాభూమికి తీసుకొస్తాడు. "ఉద్గాత" వేద మంత్రాలు చదువుతాడు. ఇంకొకరు "బ్రహ్మ" హోతాద్వర్యుల కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే ఈయనపని.పొరపాటు వస్తే సరిదిద్దుతాడు. ఇంకొకరు "అగ్నీత్తు"-బ్రహ్మకు సహకారి.
యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చును.
[[File:Agni gundam.JPG|thumb|right|యాగశాల (వనస్థలిపురం) ]]
 
ఈక్రింద '''ఇష్టియాగం''' అను యాగ క్రతువును అనుసరించి వివరించబడినదివివరించబడింది. ఈ యాగము పౌర్ణము నాడు గాని, అమావాస్యనాడు గాని ప్రతీ గృహస్తుడు చేయవచ్చును. పౌర్ణమినాడు చేయబడితే అది పూర్ణమాసయాగాం, అమావాస్యనాడు చేయబడితే దర్శయాగం.
 
* '''పురోడాశం'''
పంక్తి 16:
 
* '''వ్రతగ్రహణం'''
ఇది యాగానికి పూర్వదినం అపరాహ్న (సాయంసంధ్యవేళ) పూర్నాహ్న (తెల్లవారుజాము) సమయములలో చెయ్యాల్సిన క్రియలు. ఇవి యాగానికి సంబందించినసంబంధించిన అగ్నిని ముందుగానే సిద్ధముగా ఉంచుట. ఇవి రెండు విధాలు. వ్రతగ్రహణ, అంవాధానాలు. పూర్వాహ్నంలో యజమాని గార్హపత్యం (శ్రోతగ్ని), ఆహవనీయ, దక్షిణాగ్నుల్లో క్రమంగా ఒక్కొక్క సమిత్తు వేసి, అగ్నిని యజ్ఞానుకూలం చేస్తాడు. నేను రేపు యాగం చేస్తాను సిద్ధంగా ఉండుసుమా అని అప్పుడే అగ్నికి చెప్పి ఉంచటము. అపరాహ్నం క్షుర కర్మచేసుకొని, స్నానం చేసుకొని కొంచెం ఏమైనా తింటాడు. తరువాత అగ్నికి పక్కగా నిల్చి, నేను సత్యాన్నే పలుకుతాను మొదలుగాగల కొన్ని నియమాల్ని పాలించటానికి ప్రతిజ్ఞ తీసుకొంటాడు. పత్నీ సహితంగా రాత్రి యజ్ఞసాలలోనే గడపాలి.
 
* '''వరణం'''
మరునాడు నిత్యాగ్నిహోత్రకర్మానంతరం ఇది ఋత్విక్కులు వారి వారి దిక్కులను అనుసరించి అగ్నికి అనుకూలంగా కూర్చెడెడి విధానము. ఇందులో ప్రధమంప్రథమం బ్రహ్మ వరణం. వరణానంతరం బ్రహ్మ ఆహవనీయానికి (శ్రోతగ్ని) దక్షిణంగా ఆసనాన్ని స్వీకరించి, కర్మనంతటినీ పర్యవేక్షిస్తాడు. బ్రహ్మకు వామభాగమున యజమాని కూర్చుండే చోటు. యజమాని భార్య గార్హపత్యానికి దక్షిణంగా అధివసిస్తుంది. వేదికకి ఉత్తరంగా హోతా అగ్నీత్తులు ఉంటారు. అధ్వర్యుడు యాగకాలంలో కూర్చోటానికి వీలుండదు. దీనికీ దానికీ కదుల్టు ఉండాలి.
 
* '''ప్రణీత'''
పంక్తి 37:
 
* '''ఉపాంశుయాగం'''
ఆజ్యభాగదానం తరువాత ప్రధానయాగం. అగ్నిని ఉద్దేశించి ప్రధమపురోడాశంప్రథమపురోడాశం. అగ్నిని, సోముణ్ణి ఉద్దేశించి ద్వితీయపురోడాశదానం. ఈ రెంటికీ మధ్య అగ్నిసోములకి కొంచెం ఘృతాహుతి. ఈఘృతాహుతి సమయంలో మంత్రపానం అనుచ్చస్వరంలో జరుగుతుంది.కాబట్టి దీనిపేరు ఉపాంశుయాగం.
 
* '''స్విష్టకృత్తు'''
 
రెండు కపాలాల్లో ఉంచిన పురోడాశాన్ని అంతటినీ ఆహుతి వేయకుండా అగ్ని-స్వష్టకృత్తు నుద్దేశించి ఆహుతి నీయాలి.వీరు రుద్ర దేవాతకము. ఈ రుద్రదేవత అంటె ఎంతో భయం. ఇతని బాణాలంటే చెప్పలేనంత భయం. స్పష్టంగా ఇతనిపేరు ఉచ్చరించటానికికూడా జడుపేనట. ఉగ్ర, భీమ, కపర్ది శబ్దాలు ఈ భయానికే సూచనలు. ఇతన్ని సంతోషింపజేయుటకే శంకరుడనే పిలుపు. వేదంలోని ఇతర దేవతలకీ, ఇతనికే ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు దేవతలు ప్రార్ధిస్తే, ఈయన ప్రజాపతి అంతటివాడిమీద బాణాల్ని విసిరాడు. దానికి దేవతలెంతో సంతోషించి, పశుగణానికి ఈయన్ని అధిపతిగా చేశారు. పశుపతి అయినాడు. పూర్వం యజ్ఞభాగాల్లో పాలు ఉండేది కాదు. ఒకసారి ఈయన బలవంతంగా యజ్ఞ భాగాన్ని గ్రహించాడు. అప్పట్నుంచే ఈ స్విష్టకృత్ యాగం ఆరంభంఅయింది.
 
* '''అనుయాజ'''
పంక్తి 48:
 
* '''సమాన్యనియమక్రమం'''
ఈ ప్రధాన యాగాల్ని చేసే కొన్ని నియమాలు. అధ్వర్యుడే యాగకర్త, హోత ఆహ్వానకారి.ఆహావనీయంలోనే ఆహుతిసమర్పణ. అద్వర్యుడి ఆసనం ఆహావనీయానికి ఉత్తరంగా. అక్కడ ఆయన నిలబడి ఉండాలి. ఏ యాగంలోనైనసరే, ఆయన దక్షిణహస్తంతో జుహువును (మోదుగు కర్రతో చేసిన పరికరం. ఆజ్యాన్ని హోమం చేయడానికి ఉపయోగపడే గరిట), వామహస్తంతో ఉపభృత్తు (యజ్ఞాంగ పాత్రము. రావికఱ్ఱతో చేసిన స్రుక్కు) పట్టుకొని వేదికకి ఉత్తరమ్నుండి దక్షిణంగా వస్తాడు.అక్కడ నిలబడి అగ్నీత్తును ఆదేశిస్తాడు : '''ఓం శ్వావయః'''. అంటే దేవతలని మంత్రాల్ని వినమని ప్రార్ధించుప్రార్థించు.ఈ అగ్నీత్తు వేదికకి ఉత్తరంగా నిలబడతాడు, చేత్తో ఒక కర్రకాతిని పట్టుకొని. ఈ కర్రకత్తిపేరు "స్ఫ్యః" ఆయన జవాబిస్తాడు: '''అస్తు శ్రౌషట్'''. అంటె మంచిది దేవతలు వింటున్నారు అని. అప్పుడు అద్వర్యుడు హోతకాదేశిస్తాడు, దేవతల్ని ఆహ్వానించమని. హోత రెండు మంత్రాలు చదవాలి. ఒకటి అనువాక్యం-ఇది ఋక్ మంత్రం. ఈ మంత్రంవల్ల దేవతల్ని అనుకూలంగా చేసుకుంటారు.ద్వితీయ మంత్రం యాజ్యం. ఇది కొన్నిపట్ల ఋక్కును, కొన్ని పట్ల యజుస్సు. ఇదే యాగమంత్రం. కనుకనే యాజ్యం. హోత మంత్రపఠాన్ని '''యే యజామహే అగ్నిం దేవం''' అని ఆరంభిస్తాడు. దీని పేరు '''అగూః''' మంత్రం. తరువాత యాజ్యమంత్రాన్ని చదివి '''అగ్నే విహి ఔషట్''' అగ్ని దీన్ని భక్షించి దేవతల దగ్గరకు వెళ్ళు అని అర్ధము. ఈ వషట్కారము ఉచ్చారితమవుతూ ఉన్నప్పుడే అధ్వర్యుడు ఆహుతి ద్రవ్యాన్ని అగ్నిలో వేస్తాడు. యజమాని ఆహుత్యనంతరము '''ఇదం అగ్నయే న మమ''' ఇది నాదికాదు అనే త్యాగ మంత్రాన్ని ఉచ్చరిస్తాడు.
 
* '''హవిర్భక్షణ'''
పంక్తి 57:
 
* '''సమాప్తిక్రమం'''
ప్రస్తర మనబడే దర్భకట్టతో యజమానశరీరాన్ని ఏకంగా భావించాలి. అనుయాజ యాగానంతరం ఈ ప్రస్తరాన్ని ఆహవనీయాగ్నిలో పడేయ్యాలి. ఇది కాలిపోతున్నప్పుడు యజమాని స్వర్గానికి వెళుతున్నట్టు. సంపూర్ణంగా దగ్ధమైతే, యజమాని స్వర్గలోకంలో దేవతల్తో ఐక్యమైనట్టు. ప్రస్తరం కాలిపోతున్నప్పుడు, హోత అధ్వర్యుడి అనుజ్ఞతో కొన్ని మంత్రాల్ని చదువుతాడు. వీటి పేరు సూక్తవాక్కు.పుర్తిగాపూర్తిగా కలిపోయినాక మరికొన్ని మంత్రాలని చదువుతాడు వీటి పేరు శంయూవాక్కు. ఇవి ఆశీర్వాద సుచకాలు.
 
పరిధి అనబడే సంత్కాష్ఠఖండత్రయంలో, మానవహోత దేవహోతను పిలుచుకువచ్చిన దానిని లిపిన దర్భ పేరు పరిధి. వీటిని కూడా అగ్నిలో వేయాలి. అప్పుడు దేవహోత యజ్ఞస్థలం నుంచి వెళ్ళిపోతాడు.
పంక్తి 66:
 
* '''పత్నీకృత్యం '''
ఇంతవరకూ ఒపికగా గార్హపత్యాగ్ని ప్రక్కగా కూర్చున్న యజమాని భార్య దగ్గరకు బ్రహ్మ కాక మిగిలిన ముగ్గురు ఋత్విక్కులు వచ్చి, గార్హపత్యాగ్నిలో కొన్ని ఆహుతులు వేస్తారు. ఆహుతి ద్రవ్యం ఆజ్యం. దేవతలు: సోముడు, త్వష్ట, దేవపత్నీగణం, అగ్ని-గృహపతి. ప్రధానయాగానంతరం హవిర్భక్షణ జరిగినట్టే ఇప్పుడు కూడా జరగాలి.
 
* '''సమష్టిహోమం'''
* '''సమిష్టిహోమం'''
దక్షిణాగ్నిలో ఇంతవరకూ ఒక్క ఆహుతి కూడా పడలేదు. కనుక, అధ్వర్యుడు దక్షిణాగ్నిలో ఆజ్యహోమాన్ని చేస్తాడు. పురోడాశం చేయ్యగా మిగిలిన కొంచెం రుబ్బుడు పిండిని, విశ్వదేవతల నుద్దేశించి అగ్నిలో వేస్తారు. దేవహోత ఆహ్వానాన్ని అనుసరించి యజ్ఞక్షేత్రానికి వచ్చిన దేవతలందరూ ఇంకా వెళ్ళిపోలేదు. అధ్వర్యుడు వీళ్ళందరి నిమిత్తమూ ఆజ్యాహుతుల్ని ఆహనీయంలో వేస్తాడు. అప్పుడు వాళ్ళు సంతుష్టులై వెళ్ళిపోతారు. దీనిపేరు సమిష్టియజుర్హోమంసమష్టియజుర్హోమం.
 
* '''రాక్షసులకు'''
పంక్తి 78:
 
* '''ప్రక్రమణ'''
ఈ యజ్ఞ నిర్వహణఫలంగా యజమాని దైవత్వాన్ని పొందాడు. అంతేకాదు దేవతల్లో సర్వశ్రేష్ఠుడైన విష్ణువుపదాన్ని పొదటానికే అతడిప్పుడు అభ్యర్ధిఅభ్యర్థి. విష్ణువు త్రిపదవిన్యాసంతో మూడులోకాల్ని ఆక్రమించాడు అని భావించి యజమాని యజ్ఞస్థలంలో మూడు అడుగులు వేసి, తూర్పుగా ఆహవనీయం వరకు ప్రక్రమిస్తాడు. దీనిపేరు విష్ణుక్రమ ప్రక్రరణ. పూర్వదిక్కు దేవతల స్థానం. యజమాని తూర్పుగా తిరిగి చూస్తూ '''నేను జ్యోతిలో గమనమొనరుస్తున్నాను, జ్యోతిలో కలిశాను''' అనే అర్ధం గల మంత్రాన్ని జపిస్తాడు.
 
* ''' వ్రత విసర్జన'''
యజమాన్ని గార్హపత్య ఉపస్థానమూ, సూర్యోపస్థానమూ జరిపి '''గృహపతి అయిన అగ్నీ! నేను స్వగృహపతిని అవుతాను అగుగాక ''' అని అంటాడు. తర్వాత, పుత్రుడు పేరు చెప్పి , నా ఈ పుత్రుడు ఈ కర్మనీకు అనుక్రమంగా విస్తరిల్లాజేస్తాడుగాక. అని ప్రార్ధిస్తాడు.
 
విసర్జనానంతరము యజమాని బ్రహ్మతో కలిపి యజ్ఞశాలకు బయటకు వచ్చి, తమకోసం అట్టేపెట్టిన పురోడాశాభాగాన్ని స్వీకరిస్తారు.
పంక్తి 90:
 
== యజ్ఞము, యాగము, హోమము, క్రతువు ==
యాగానికి, హోమానికి తేడా ఉంది. యాగంలో ఆహుతి ఇచ్చేది అధ్వర్యుడు; మంత్రాల్ని పఠించేది హోత. మంత్రాంతంలో ఉచ్చరించబడే '''వౌషట్''' శబ్దమే వషట్కారం. ఈ వషట్కారోచ్చరణకాలంలోనే అధ్వర్యుడు అగ్నిలో ఆహుతుల్ని వ్రేలుస్తాడు. ఈ క్రమంతో కూడినది యాగం.
 
హోమరీతి ఇంతకంటేకూడా సంక్షిప్తం. దీనికి హోతతో పనిలేదు. అధ్వర్యుడు అగ్ని పార్స్వాన ఆసీనుడై, తనే యజుర్మంత్రాల్ని చదువుతాడు. మత్రాంతన '''స్వాహా''' శబ్దాన్ని ఉచ్చరిస్తాడు. ఇదే స్వాహాకారం.ఇది ఉచ్చరిస్తున్నప్పుడు ఆహుతిని వేస్తాడు. ఇది హోమ క్రమము.
పంక్తి 96:
== యజ్ఞాలలో రకాలు ==
యజ్ఞాలు మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు <ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>.
[[File:2durgamaataadee.JPG|thumb|left|యజ్ఞం (వనస్థలిపురము) ]]
# '''పాక యజ్ఞాలు''' - ఇవి మళ్ళీ ఏడు విధాలు
## ఔపాసన
పంక్తి 127:
* [[రాజసూయ యాగం]]
* [[సర్పయాగం]]
* [[విశ్వజిత్ యాగం]] : ఒక్క రొజులోరోజులో పూర్తి కావలిసిన [[యాగం]]. ఇందులో యజమాని తన మొత్తం [[ఆస్తి]]ని [[దానం]] చేయవలసి ఉంటుంది.
 
== మూలాలు ==
పంక్తి 133:
 
== బయటి లింకులు ==
 
 
{{హిందూమతం ఆరాధన}}
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/యజ్ఞం" నుండి వెలికితీశారు