యాచకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వచ్చంద → స్వచ్ఛంద, స్మశానా → శ్మశానా, , → , (5) using AWB
పంక్తి 1:
{{వికీకరణ}}
[[Image:Bartolomé Esteban Perez Murillo 004.jpg|thumb|250px|[[బార్టొలొమీ ఎస్తెబాన్ పెర్నెజ్ మురిలొ]], "యాచక బాలలు ద్రాక్ష మరియు పుచ్చకాయ తింటున్న చిత్రం", ([[అల్టె పినకొథెక్]]).]]
[[దానం]] ఇమ్మని అర్ధించేవారిని '''యాచకులు''' బిక్షగాళ్ళు అడుక్కునేవాళ్ళు అంటారు.
 
==ఢిల్లీలో 60 వేల మంది భిక్షగాళ్ళు==
కామన్ వెల్త్ ఆటల పోటీల ప్రారంభం నాటికి దేశ రాజధానిలో యాచకులెవరూ కనిపించకుండా చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 1959నాటి బాంబే భిక్షాటన నిషేధ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయనున్నారు. యాచకులు కనిపించిన వెంటనే అక్కడికక్కడే విచారించి శిక్షలు విధించేందుకు సంచార న్యాయస్థానాలను ప్రారంభించారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పునరావాస చర్యల్లో భాగంగా నగరంలో ఇప్పటికే 11 భిక్షాటకుల గృహాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీల ప్రాంగణాల్లో యాచకులను అనుమతించవద్దని ఆయా మత పెద్దలను సంక్షేమ శాఖ అధికారులు కోరారు. ఢిల్లీని యాచకులు లేని నగరంగా మార్చాలని హైకోర్టు సూచించింది.పొరుగు రాష్ట్రాల నుంచి బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో నగరానికి వస్తుండటం వల్ల రాజధాని సరిహద్దు రాష్ట్రాలు తమ బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
==రకరకాల బిచ్చగాళ్ళు==
ముంబైలో బిచ్చగాళ్లు షిఫ్టుల్లో అడుక్కుంటారు. వాళ్ల అడ్డాలని అద్దెకిస్తారు. తమ హక్కుల పరిరక్షణ కోసం కొందరు నాయకుల్ని నియమించుకుంటారు.బిచ్చగాళ్లు వేసుకునే చిరిగిన బట్టల్ని, వాళ్ల చంకనెత్తుకోవడానికి కావాల్సిన పసిపిల్లల్ని సైతం అద్దెకిచ్చే వాళ్లున్నారు.ప్రతి వందమంది ముంబై వాసుల్లో ముగ్గురు బిచ్చగాళ్ళు.కొన్ని దేవాలయ ప్రాంగణాల్లో బిచ్చగాళ్లు ఈ వృత్తిని వారసత్వంగా కూడా చేపడుతున్నారు.ఒక ప్రాంతంలోని యాచకులు మరో ప్రాంతంలో భిక్షాటన చేయడానికి వీలు లేదు.లాభసాటి యాచకకేంద్రాలకు వేలం నిర్వహిస్తారు.
స్థానిక గూండాలు బిచ్చగాళ్ల నుండి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు.ఇక్కడ తెలుగువారి సంఖ్యే ఎక్కువ.కొన్ని ప్రదేశాల్లో బిచ్చగాళ్లు రెండురూపాయిలకి తక్కువ వేసిన వారిని అవమానిస్తారు కూడా. తటపటాయించే వారిని కన్నెర్రచేసి బెదిరించడం, గద్దించడం కూడా చేస్తారు.
==సింధుతాయి సక్పాల్==
వార్ధా జిల్లాకు చెందిన సింధుతాయి ఒకప్పుడు రోజుల బిడ్డతో కడుపు నింపుకునేందుకు వేరే దారిలేక బిక్షాటన చేసింది. రైల్వేస్టేషన్లు, స్మశానాల్లోశ్మశానాల్లో తలదాచుకుంటూ కూతురిని హాస్టల్లో ఉంచి చదివించింది. యాచక వృత్తిలో సంపాదించిన డబ్బు కూడబెట్టి పూనే, అమరావతిలలో నాలుగు అనాథాశ్రమాల్ని నడుపుతోంది. ఆ ఆశ్రమాల్లో ఉండి చదువుకున్న పిల్లలు కొందరు ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నారు.<ref>ఆంధ్రజ్యోతి,19-9-2010</ref>
==మన రాష్ట్రంలో కూడా==
బహిరంగ ప్రదేశాల్లో జరిగే భిక్షాటనను ప్రభుత్వం నేరంగా ప్రకటించింది. జనసమ్మర్థమున్న ప్రాంతాల్లో ఇకపై భిక్షాటన చేస్తే అరెస్టు చేయాలని నిర్ణయించింది. యాచకులు (బెగ్గర్స్‌) లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో 1977 ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ కింద సాంఘిక సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులిచ్చింది.జనాలు ఎక్కువగా ఉన్న చోట భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారెంటు లేకుండా అరెస్టు చేస్తారు. తరువాత 24 గంటల్లోగా కోర్టుకు హాజరు పరుస్తారు. యాచకుడు తాను ఎందుకు భిక్షాటన చేస్తున్నదీ, అంగవైకల్యం ఉన్నదీ లేనిదీ, అన్నీ కోర్టుకు వివరించుకోవాల్సి ఉంటుంది.అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిని ప్రత్యేక హోమ్‌లకు తరలించి వసతులు కల్పించాలి.అరెస్టు చేసిన వారికి పునరావాసం లేదా ఆశ్రయం కల్పించడం కోసం సాంఘిక సంక్షేమశాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి.ఆశ్రయం కల్పిస్తున్న సంస్థల్లో చిన్న పిల్లలకైతే చదువు, పెద్దవారికైతే వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు కూడా వసతులు కల్పించాలి. ఎవరైనా యాచక వృత్తి చేస్తూ పట్టుబడి, మార్పు చెంది తిరిగి ఆ వృత్తి చేయకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ముందుకొస్తే, కోర్టు అనుమతి ద్వారా ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చు.యాచక వృత్తిని నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. చీఫ్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా పనిచేసే రాష్ట్ర కమిటీ 6 నెలలకోసారి దీనిపై సమీక్ష జరిపి చట్టం అమలు ఎలా ఉందో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
==పసికందులతో భిక్షాటన==
[[Image:Beggers.jpg|left|thumb|180px|[[తమిళనాడు]] లోని ఒక క్యాథలిక్ చర్చి ఎదుట భిక్షాటన చేస్తున్న బాలలు ఆదివారము 27 ఫిబ్రవరి 2010]]
కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో 'భిక్షాటన వ్యాపారం' చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున 'అద్దె'కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్‌ లైన్‌) కు ఫోన్‌ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారాస్వచ్ఛందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/యాచకులు" నుండి వెలికితీశారు