రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), మధ్యపాన → మద్యపాన, → , , → ,, ( → ( (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Raachakonda.jpg|thumb| రాచకొండ విశ్వనాధశాస్త్రి]]
'''రాచకొండ విశ్వనాధశాస్త్రి''' ([[జూలై 30]], [[1922]] - [[నవంబర్ 10]], [[1993]]) వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.
 
పంక్తి 6:
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]], [[జూలై 30]]న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.
[[దస్త్రం:Raavisastrisign.jpg|thumb|right|సంతకం]]
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]] లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని [[1950]]లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు.
ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.
 
[[1947]] ప్రాంతంలో లోప్రాంతంలోలో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం , విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. [[గురజాడ అప్పారావు]], శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.
 
==రచనలు==
తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన ''[[అల్పజీవి]]'' మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే. ఇది ఆయన మొట్టమొదటి నవల.
 
ఈ నవలను ఆయన [[1952]] లో రచించాడు. తరువాత ''రాజు మహిషీ'',''రత్తాలు-రాంబాబు'' అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ''ఇల్లు'' అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ ''అల్పజీవి'' నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.
 
ఆంధ్రలో మధ్యపానమద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ''ఆరుసారా కథలు'' తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన ''నిజం'' నాటకంలో వ్యక్తం చేసాడు.
 
=== రచనల జాబితా ===
[[File:Rachakonda Viswanatha sastry.jpg|thumb|right|విశాఖపట్నం బీచ్ రోడ్ లో రావిశాస్త్రి విగ్రహం.]]
*''కథాసాగరం'' (1955)
*''ఆరుసారా కథలు'' (1961)
*''రాచకొండ కథలు'' (1966)
పంక్తి 29:
*''బానిస కథలు'' (1972)
*''ఋక్కులు'' (1973)
*''[[రత్తాలు-రాంబాబు]] '' (1975)
*''సొమ్ములు పోనాయండి''
*''గోవులోస్తున్నాయి జాగ్రత్త''
పంక్తి 41:
 
==రావిశాస్త్రి విశిష్టత==
[[1983]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ [[కళాప్రపూర్ణ]]ను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా [[1966]] లో తీసుకున్న [[సాహిత్య అకాడమీ అవార్డు]]ను తిరిగి ఇచ్చివేసాడు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]]
 
ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన ''నిజం'' నాటకంలోను, గురజాడ [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే [[1962]] ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు