వెంపటి సదాశివబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మంకు → మానికి , మంను → మాన్ని , గా → గా , తో → తో , పెళ్లి using AWB |
||
పంక్తి 36:
'''వెంపటి సదాశివబ్రహ్మం''' (1905 - 1968) పేరుపొందిన చలనచిత్ర రచయిత.
సదాశివబ్రహ్మం [[తూర్పు గోదావరి]] జిల్లాలోని [[తుని]] గ్రామంలో [[ఫిబ్రవరి 19]], [[1905]] సంవత్సరంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. వీరు [[పంచకావ్యాలు]] చదివి, [[ఆంధ్ర]], [[సంస్కృత]] భాషలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. [[తిరుపతి వేంకటకవుల]] ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపాడు. [[అష్టావధానాలు]], [[శతావధానాలు]] జరిపి, గద్య, పద్య రచనలు చేసి బాలకవిగా పేరుపొందారు.
ఎప్పుడూ ఎక్కడా ఓ చోట కాలు నిలవని
==సినీ రచయితగా==
పంక్తి 44:
దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి, సదాశివబ్రహ్మం హరికథను విని, వెంటనే తను నిర్మించే 'తెనాలిరామకృష్ణ' (1941) చిత్రానికి రచన చేయాల్సిందిగా ఆహ్వానించాడు. 1941 వరకే దాదాపు 75 చిత్రాలు విడుదలై 'చిత్రవజ్రోత్సవాన్ని' చేసుకొన్న తెలుగు సినిమాలో వెంపటి ప్రవేశంతో స్క్రీన్ ప్లే విధానంలో మార్పు వచ్చింది. అలాగే పాత్రల స్వరూప స్వభావాలను మరింత స్పష్టపరచే విధంగా సంభాషణలు వ్రాయడంలో కొత్త ఒరవడిని వెంపటి సదాశివబ్రహ్మం సృష్టించారు. అలా తొలి చిత్రంతోనే రచయితగా విజయం సాధించిన వెంపటి అనంతర కాలంలో దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఎన్నో సినిమాలకు రచనలు చేశారు.<ref>[http://www.prabhanews.com/insidestory/article-112456 సినీగీత సుమసౌరభం - ఆంధ్రప్రభ మే 23, 2010]</ref>
1941 లోనే రాజాశాండో [[దర్శకత్వం]] వహించిన 'చూడామణి' చిత్రానికి వెంపటి స్క్రీన్ ప్లే సమకూర్చాడు. 1941 లో వచ్చినా 1950 దశకంలో రాబోతున్న సినిమాల తాలూకు ఛాయలన్నీ ఆ సినిమాలో పొడచూపాయి. అప్పటి వరకు వచ్చిన పౌరాణిక చిత్రాల మూసను వదిలిపెట్టి 'చూడామణి' కొత్త పుంతల్ని తొక్కింది. హాస్యనటి, గాయని టి. కనకం,
1943 నుంచి 1945 వరకు, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా చిత్రనిర్మాణం కుంటుపడింది. అప్పటికే మద్రాసులో మాంబళంలో క్రిసెంట్పార్కు వద్ద ఓ అద్దె ఇంట్లో కుటుంబంతో సహా మకాం పెట్టిన వెంపటి, చేతినిండా సినీరచనలు లేక మళ్లీ అవధానాలు, హరికథలు చెబుతూ కాలక్షేపం చేయసాగాడు. ఈ కాలంలో వెలువడిన చిత్రాలకు 'ఘోస్టురైటర్'గా కూడా
1948 లో దర్శక నిర్మాత సి.వి.రంగనాథ్ దాస్ సాధనా సంస్థను స్థాపించి 'దాసి' చిత్రాన్ని నిర్మిస్తూ వెంపటి సదాశివబ్రహ్మానికే కథ, మాటలు, పాటలు వ్రాసే అవకాశం ఇచ్చాడు. కానీ ఆ చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఆ తరువాత, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, లక్ష్మీరాజ్యంలతో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఘనవిజయం సాధించిన 'సంసారం' చిత్రానికి రచన చేశాడు.
1931 నుండి 1948 వరకు [[తెలుగు]]లో వెలువడిన సినిమాల గురించి వెలువడిన పత్రిక 'చిత్రకళ' (1948)
===50వ దశకం===
పంక్తి 56:
===60వ దశకం===
1960 లో 'దేవాంతకుడు', చిత్రానికి కథ, మాటలు వ్రాసింది వెంపటే. (ఈ సోషియో ఫాంటసీ చిత్రంలోని 'గోగ్గో గోంగూర' పాట జనాదరణ పొందింది) ఈ చిత్రమే మళ్లీ 1977 లో 'యమగోల'గా నిర్మించినపుడు బాక్సాఫీసును బద్దలు చేసింది. ఆ తరువాత 'యమలీల, యమదొంగ' వంటి చిత్రాలకు మూల బిందువు వెంపటి కథే. 1961 లో 'ఉషా పరిణయం', 'కన్న కొడుకు' 'శభాష్ రాజా' చిత్రాలకు కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 'లవకుశ' (1963) చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు, పద్యాలు రచించి, ఓ అపురూప దృశ్యకావ్యంగా అందించిన ఘనత వెంపటిదే. 1964 లో బి.ఎ. సుబ్బారావు దర్శకత్వం వహించిన 'మై రావణ'కు, గుత్తారామనీడు దర్శకత్వంలో వచ్చిన 'పల్నాటి యుద్ధం' చిత్రానికి కథ, మాటలు, కొన్ని పాటలు వ్రాశాడు. 1966లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పరమానందయ శిష్యుల కథ చిత్రానికి కథ మాటలు కొన్ని పాటలు పద్యాలు వ్రాశాడు. లలితా శివజ్యోతి వారి 'రహస్యం' (1967) ఈయన చివరి చిత్రం. ఈ చిత్రానికి కథను సుబ్రహ్మణ్యం పిళ్లె అందించాడు. మాటలు, కొన్ని పాటలు పద్యాలు సదాశివబ్రహ్మం వ్రాశాడు.
సదాశివబ్రహ్మం [[జనవరి 1]], [[1968]] సంవత్సరంలో గుండెపోటుతో ఆకస్మికంగా [[చెన్నై]]లో పరమపదించారు.
==చిత్రసమాహారం==
|