వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1784 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( (2) using AWB
పంక్తి 5:
 
== వృత్తి ==
అప్పటికే బందరు ఇంగ్లీషువారి ఆధీనంలో ఉండేది. అక్కడ కలెక్టర్ వద్ద సుబ్బారావు గుమస్తాగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. 1797లో పాపయ్య కుమార్తెను వివాహం చేసుకున్నాకా పాపయ్య మరణించారు. తిరిగి సుబ్బారావు బూడిపాటి వెంకటాచలం వద్ద ఇంగ్లీషుభాషను నేర్చుకున్నారు. తర్వాత గుంటూరు వెళ్లి పెరియతంబి పిళ్లై సహకారంతో పే-మాస్టర్ విల్సన్ వద్ద నెలకు ఒక వరహా జీతంతో సర్కారుజాబులు రాసేందుకు చేరారు. అనంతరం ఆయన దుబాసీ (ద్విభాషి-ఇంటర్ప్రిటర్) గా మారారు. ఆ ఘటన జీవితాన్ని మలుపుతిప్పింది.<br />
 
అప్పట్లో దత్తమండలాలుగా ఉన్న కడప-కర్నూలు-బళ్ళారి జిల్లాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోనూ, ఆ తర్వాత మంగళూరు కలెక్టర్ కచేరీలోనూ, 1806లో కసరా జిల్లాలోనూ దుబాసీగా పనిచేశారు. మంగళూరులో రిజిస్ట్రార్ గా ఉన్న మెక్ రెల్ కు తెలుగుభాష నేర్పారు. శ్రీరంగపట్టణంలోని జిల్లాకోర్టులో హెడ్ ఇంగ్లీషు రైటరుగా చేరి ఎంతో దీక్షాదక్షతలతో పనిచేసి మైసూరు మహారాజా సత్కారాలు పొందారు. అనారోగ్య కారణాల రీత్యా నెల్లూరు చేరుకుని కలెక్టర్ ఫ్రేజర్ వద్ద ఉద్యోగంలో వద్ద ఉద్యోగంలో చేరి చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన వ్యక్తిగా పేరొందారు. 1815కే మాతృభాష తెలుగుతో పాటుగా ఆంగ్లం, పార్శీ, హిందుస్థానీ(హిందీ), తమిళం భాషలు నేర్చి మద్రాసు సుప్రీం కోర్టులో 14సంవత్సరాలపాటు పరభాషల దుబాసీగా పనిచేశారు.<br />
 
అప్పట్లో దత్తమండలాలుగా ఉన్న కడప-కర్నూలు-బళ్ళారి జిల్లాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాల్లోనూ, ఆ తర్వాత మంగళూరు కలెక్టర్ కచేరీలోనూ, 1806లో కసరా జిల్లాలోనూ దుబాసీగా పనిచేశారు. మంగళూరులో రిజిస్ట్రార్ గా ఉన్న మెక్ రెల్ కు తెలుగుభాష నేర్పారు. శ్రీరంగపట్టణంలోని జిల్లాకోర్టులో హెడ్ ఇంగ్లీషు రైటరుగా చేరి ఎంతో దీక్షాదక్షతలతో పనిచేసి మైసూరు మహారాజా సత్కారాలు పొందారు. అనారోగ్య కారణాల రీత్యా నెల్లూరు చేరుకుని కలెక్టర్ ఫ్రేజర్ వద్ద ఉద్యోగంలో వద్ద ఉద్యోగంలో చేరి చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన వ్యక్తిగా పేరొందారు. 1815కే మాతృభాష తెలుగుతో పాటుగా ఆంగ్లం, పార్శీ, హిందుస్థానీ (హిందీ), తమిళం భాషలు నేర్చి మద్రాసు సుప్రీం కోర్టులో 14సంవత్సరాలపాటు పరభాషల దుబాసీగా పనిచేశారు.<br />
 
== రచన రంగం ==
Line 21 ⟶ 20:
 
== సమాజ సేవ ==
ఆనాటి కంపెనీ పాలనలో ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన సుబ్బారావు సమాజసేవలో కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించారు. ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ ప్రాంతంలో బాటసారులకు మజిలీ చేసే సౌకర్యాలు లేకపోవడం గమనించిన సుబ్బారావు సత్రం కట్టించారు. ఆ సత్రానికి తన భార్య కనకమ్మ పేరిట "కనకమ్మ సత్రం"గా నామకరణం చేశారు. ఎన్నో ఏళ్ల పాటు దారినపోయే బాటసారులకు మజిలీగా ఉపయోగపడిన ఆ సత్రం అటువైపు నుంచి రహదారులు వేరేవైపుకు మారిపోగా వందల ఏళ్లకు నిరుపయోగమై శిథిలావస్థకు చేరుకుంది. ఆ స్థితిలో సత్రం ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో ప్రముఖ పాదయాత్రికుడు [[ప్రొఫెసర్ ఆదినారాయణ]] 2010ప్రాంతాల్లో కనుగొన్నారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు గ్రంథాన్ని, ఆనాటి కంపెనీ కాలంలోని స్పష్టాస్పష్టమైన మాపులను ఆధారంగా తీసుకుని కాలగర్భంలో కలిసిపోయిన రాజమార్గాలను సాహిత్యాధారాలతో ఊహించి ఆ సత్రాన్ని కనుగొన్నారు.<ref>ప్రొ.ఆదినారాయణ రాసిన వెన్నెలకంటి సుబ్బారావు నిర్మించిన సత్రం పరిశోధనకు సంబంధించిన వ్యాసం, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక</ref><br />
 
వెన్నెలకంటి సుబ్బారావు ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారు. "[[కాశీయాత్ర చరిత్ర]]"గ్రంథకర్త, నాటి మద్రాసు సుప్రీంకోర్టులో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని పొందిన [[ఏనుగుల వీరాస్వామయ్య]]కు మద్రాసుకోర్టులో ఉద్యోగాన్ని ఇప్పించిన వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావే.<ref>ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీ.56</ref>