వేంకట రామకృష్ణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , → (8) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Venkataramakrishnakavulu.jpg|right|200px|thumb]]
'''వేంకట రామకృష్ణ కవులు''' అనే పేరుతో జంటకవిత్వం చెప్పిన వారు [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] మరియు [[వేదుల రామకృష్ణశాస్త్రి]]<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0003/817&first=1&last=568&barcode=2020120003815| [[ఆంధ్ర రచయితలు]] - [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]] పేజీలు 295-307]</ref>, <ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0061/724&first=1&last=516&barcode=2990100061719| పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ - సి.కమలా అనార్కలి - పేజీలు: 341-352]</ref>. వీరు 1909 సంవత్సరములో పిఠాపుర సంస్థానంలో ప్రవేశించారు. నాటికి [[ఓలేటి వేంకటరామశాస్త్రి]] వయస్సు 26 సంవత్సరాలు. [[వేదుల రామకృష్ణశాస్త్రి]] 18 సంవత్సరాలు. సంస్థాన ప్రభువు [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] ఈ కవుల బుద్ధి చాకచక్యానికి కవితాధోరణికి ఆనందపడి అవధానము చేయడానికి అనుమతించాడు. ఏ సుముహూర్తంలో ఈ జంటకవులు ప్రభువు కంటపడ్డారో కానీ వీరి అభ్యుదయానికి నాంది పలికింది. దిగ్దంతులవంటి పండితుల సమక్షంలో జరిగిన అవధానములో వీరి లీలలు పలువురకు ఆనందాశ్చర్యాలను కలిగించాయి. [[రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు]] అవధానం తరువాత రూ.316/-లు పట్టుశాలువాలతో సత్కరించి తన పిఠాపురం సంస్థానానికి ఆస్థానకవులుగా నియమించాడు. వీరు ఆ సంస్థానంలో శతావధానము, శతవిధానము [గంటకు 100 పద్యాలు చెప్పుట], శత ప్రాసము [ఒకేప్రాసతో 100 పాదాలు గంటలో చెప్పుట], అష్టావధానము మొదలైనవాటిని నిర్వహించి పండితుల, ప్రభువుల మెప్పు పొందారు. వీరు పిఠాపుర సంస్థానంలో ప్రవేశించిన వెనువెంటనే సుప్రసిద్ధులైన [[తిరుపతి వేంకటకవులు|తిరుపతి వేంకటకవుల]] తో వాగ్యుద్ధం తటస్థించింది. రామకృష్ణకవులు వయసున చిన్నవారైనా ఆ కవుల కృతులలోని దోషాలను బయట బెట్టి 'శతఘ్ని' అనే ఖండన గ్రంథాన్ని ప్రకటించారు. ఈ వివాదం మొదట చక్కని కృతి విమర్శలతో ప్రారంభమై క్రమక్రమంగా శ్రుతి మించి వ్యక్తిదూషణలకు దారితీసింది. ఏదిఏమైనా ఆనాటి ఈ వివాదం సాహిత్యప్రియులకు మంచి కాలక్షేపాన్ని కలిగించింది. ఈ వాక్సమరంలో దేశము లోని పండిత కవులెందఱో కలుగ చేసికొని పైకి వచ్చారు. ఇది సారస్వత చరిత్రలో మఱవరాని సరసఘట్టం. ఈ వివాదారంభంలో [[కవిత (మాసపత్రిక)|కవిత]] అనే మాసపత్రికను వీరు నెలకొల్పారు. ఈ పత్రిక తొమ్మిది ఏండ్లు అవిచ్ఛిన్నంగా సాగింది.
==అవధానాలు==
వీరు అవధానాలలో అత్యద్భుత శతావధానం, శతవిధానం, శతప్రాసం, ద్విగుణీకృత అష్టావధానం అనే వినూత్న ప్రయోగాలు ప్రవేశపెట్టి తమ ప్రత్యేకతను చాటుకొన్నారు. వీరు యానాం మహాలక్ష్మి సంస్థానంలో ఒక శతావధానం, పిఠాపురం సంస్థానంలో రెండు అష్టావధానాలు జంటగా చేయగా, వేదుల రామకృష్ణశాస్త్రి కాకరపర్రులో ఒక అష్టావధానం, పల్లిపాలెంలో రెండు అష్టావధానాలు చేశాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=138-141|edition=ప్రథమ|accessdate=19 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
వీరి అవధాన పద్యాలు మచ్చుకు:
*సమస్య: కుండను గొండసొచ్చి నిదిగో! యని పల్కెను విస్మయంబునన్
పూరణ:<poem>కొండలురేగి లోకముల గుండలు సేయుచునుండ జూచి యా
ఖండలు డుద్ధతుండయి యఖండ పరాక్రమమొప్ప ఱెక్కలన్
పంక్తి 25:
 
==రచనలు==
వీరిరువురూ కలిసి 30కి పైగా రచనలను ప్రచురించారు.
 
వాటిలో కొన్ని:
# శతఘ్ని
# రామకృష్ణ మహాభారతము<ref>[http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0035/739&first=1&last=149&barcode=2020120035734| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో రామకృష్ణ మహాభారతము పుస్తకప్రతి]</ref>
# అట్టహాసము
# శృంగభంగము ?