సర్వోత్తమ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సర్వోత్తమ గ్రంథాలయం''' విజవాడలో కల ఒక పురాతన గ్రంథాలయం. సర్వోత్తమ భవన్ అనే దానిలో కల ఈ గ్రంథాలయం [[విజయవాడ]] పట్టణానికి తూర్పున మచిలీపట్టణం మార్గంలో ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉంది.
విషయ సూచిక
== ప్రారంభ చరిత్ర==
==గ్రంథాలయ నిర్మాణ విశేషాలు==
* ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు
[[ఆంధ్రప్రదేశ్]] గ్రంథాలయ సంఘానికి అనుబంధంగా 1946 వ సంవత్సరంలో ఆంధ్రగ్రంథాలయ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీని స్థాపకులు [[పటమట]] వాస్తవ్యులు కీ.శే. శ్రీ కొమ్మా సీతారామయ్యగారు. వీరు సంఘమునకు స్థలం సేకరించడమే కాక స్థిర నివాసం ఏర్పాటుకు కూడా తోడ్పడ్డారు.
 
ట్రస్టు కార్యకలాపాలలో గ్రంథాలయ భవనముల నిర్మాణం, గ్రంథప్రచురణ, గ్రంథాలయ పుస్తకశాల నిర్వహణము ప్రధానమైనవి. ట్రస్టు ప్రచురించిన గ్రంథాలలో ప్రధానమైనవి శ్రీ గోటేటి జోగిరాజు గారి వ్యవసాయ విజ్ఞాన సంపుటములు, గాడిచెర్ల వారి వయోజన విద్యకు సంబంధించినవి. జోగిరాజుగారి గ్రామ సేవాగ్రంథమాలలోని 20 పుస్తకములతో పాటు పండ్ల దినుసుల నిల్వ చేయుట, వ్యవసాయ శాస్త్ర ప్రథమ పాఠములు, పాడిపరిశ్రమ, కోళ్ళ పెంపకంతో కలుపుకుని 19 సంవత్సరానికి 41 పుస్తకాలు ప్రచురించింది ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు. వీటితోపాటు హరిసర్వోత్తమరావుగారి [[శ్రీరామ చరిత్రము]], సర్వోత్తమ అక్షరాభ్యాస పటములను ప్రచురించింది.
ట్రస్టు పక్షాన సర్వోత్తమ భవనం, పైన [[బాపూజీ]] మందిరంతోపాటు, కార్యకర్తల నివాసానికి జోగిరాజు భవనం, రామినేని అచ్యుతరావు సదనాలను నిర్మించారు.
 
* సర్వోత్తమ భవనం :
సంఘం స్థాపించి ఎంతో కాలమైనా, [[1938]] వ సంవత్సరం నాటికి దీనికి స్వంత భవనంగాని, స్థలంగాని లేవు. పటమటలంక వాస్తవ్యలు శ్రీ కొమ్మా సీతారామయ్యగారు ఈ లోటును పూరించారు.[[1939]] లో సంఘం క్రింద ఒక ఎకరం స్థలం ఖరీదు చేశారు. అలాగే గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారి షష్ఠిపూర్తి ఉత్సవాలను ముందుగా తామే నిర్వహించి వారికి కానుకగా నగదు సమర్పించి, మరికొన్ని తావులలో కూడా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆ రకంగా లభ్యమయిన మొత్తాన్ని భవన నిర్మాణానికి వినియోగించారు. ఇంకా దాతల నుండి విరాళాలను సేకరించి, చేతి సొమ్ము కొంత వెచ్చించి రూ. 25 వేలతో సర్వోత్తమ భవనాన్ని [[ఆంధ్రప్రదేశ్]] గ్రంథాలయ సంఘానికి ఎర్పాటు చేశారు.
 
==స్థాపనలో ప్రముఖులు==