షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్మశాన → శ్మశాన using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అమేరికా → అమెరికా, నంకు → నానికి , జంను → జాన్ని , లో → ల using AWB
పంక్తి 5:
 
== జననం ==
షోయబ్ ఉల్లాఖాన్ [[1920]], [[అక్టోబరు 17]] న [[ఖమ్మం]] జిల్లా [[సుబ్రవేడు]] లో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. [[నిజాం]] ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం [[ఉత్తరప్రదేశ్]] నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది. షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్ [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. [[బొంబాయి]]లో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు. తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు. ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు, విశాలభావాలు కలవాడు.
 
== మరణం ==
పంక్తి 19:
 
==[[రావెల సోమయ్య]] కదనం==
1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడు.స్వతంత్రం వచ్చిన తరువాత పేరు మార్చుకొని రాడికల్ హ్యూమనిస్ట్ పేరుతో ఆ పత్రిక ఇప్పడికీ వస్తుంది .నిర్దాక్షిణ్యమైన చరిత్రరథం తన గమనంలో పక్షపాతంగా ఎందరో మహానుభావులను ఎక్కించుకోకుండానే వెల్లిపోతుంటుంది. అటువంటి వారిలో షోయబుల్లా ఖాన్ ఒకరు . ఆ రథం మెడలు వంచి ఇటువంటి మహానుభావుల్ని ఎక్కించాలి. షోయబుల్లా ఖాన్ మీదా ఇంటెర్నెట్ అంతా వెదికినా ఒక్క ఫోటో కానీ, వీకీపీడియాలో అతని చరిత్ర కానీ దొరకదు మనకు . 1990 ల్లో నటరాజన్ అనే అతను అమేరికాఅమెరికా నుండి వచ్చి ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంతకీ అది ఎక్కడుందో కూడా తెలియదు. దాన్ని అన్ని భాషల్లోకి అనువదించమని అప్పటి ప్రదాని పి.వి.నరసిమ్హారావు నినరసిమ్హారావుని అడిగిన కాళోజి మాట ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. ఇంతకీ అతని గురించి తెలియని చాలా విషయాలు కింద లింక్స్ లో వున్నాయిఉన్నాయి. మీరే నిర్ణయించండి అతని త్యాగం , గొప్పదనం .<ref>https://www.facebook.com/photo.php?fbid=191811704341396&set=a.173030969552803.1073741829.100005377021376&type=1</ref>
 
==[[సయ్యద్ నశీర్ అహమద్]] కథనం==
పంక్తి 25:
 
===గాంధీ విజయవాడ యాత్ర - షోయబ్ బాల్యం===
అది 1920 సంవత్సరం. జాతీయోద్యమం పరవళ్ళు తొక్కుతుంది. భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ విజయవాడకు వెడుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ప్రస్తుత వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ రైల్వేస్టేషను‌ విూదుగా సాగుతోంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు హబీబుల్లా ఖాన్‌ అను పోలీసు అధికారిని నియమించారు. ఆయన డ్యూటీలో ఉండగా గాంధీజీ ప్రయాణిస్తున్న రైలు రానే వచ్చింది. గాంధీజీని సమీపం నుండి చూసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ డ్యూటీని ముగించుకున్న హబీబుల్లా ఖాన్‌ ఇంటికి వెళ్ళారు. ఆయన ఇల్లు చేరుకోగానే కుమారుడు పుట్టాడన్న శుభవార్త అందింది. ఆ రోజు అక్టోబరు17. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బిడ్డను చూసిన ఆయన మరింతగా సంతోషిస్తూ, అరే వీడు అచ్చం గాంధీజీ లాగే ఉన్నాడే ...అవే కళ్ళు...అదే నుదురు. అచ్చం గాంధీలానే ఉన్నాడు, అంటూ మరింత సంబరపడిపోయాడు. ఆ బిడ్డకు షోయాబుల్లా ఖాన్‌ అని నామకరణం చేసినా హబీబుల్లా ఖాన్‌ మాత్రం తన పుత్రరత్నాన్ని ఎంతో ప్రేమతో షోయాబుల్లా గాంధీ అని పిలుచుకోసాగారు. ఆ బాలుడు చిన్నతనం నుండే, మహాత్మాగాంధీ గురించి వింటూ విద్యార్థిగా ఆయన రచనలను విస్తృతంగా చదువుతూ వచ్చాడు. ఆక్రమంలో గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన గాంధీజీ బాటను తన జీవితమార్గంగా నిర్ణయించుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం షోయాబుల్లా ఖాన్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ చేశారు. నైజాం సంస్థానంలో మంచి హోదాగల ఉద్యోగం లభించగల అవకాశం ఉన్నా జాతీయోద్యమానికి సేవలందించేందుకు షోయాబుల్లా ఖాన్‌ జర్నలిజంనుజర్నలిజాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టారు. ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం, గౌరవం గల షోయాబుల్లా ఖాన్‌ తొలుత నుండి నిరంకుశ పాలకులను వ్యతిరేకించారు. ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న తేజ్‌ ఉర్దూ వారపత్రికలో ఆయన చేరారు. ఆనాటి హైదరాబాద్‌ సంస్థానాధీశులైన నిజాం పాలకుల నిరంకుశత్యం, ఆ పాలకుల తాబేదార్లయిన రజాకారుల, భూస్వాముల అమానుషకృత్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఆయన వ్యాసాలు సహజంగానే పాలకవర్గాలకు రుచించలేదు. ఆ కారణంగా తేజ్‌ పత్రిక నిషేధానికి గురయ్యింది. ఆ తరువాత స్వాతంత్య్రసమర యోధులు మందుముల నరశింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న రయ్యత్‌ ఉర్దూపత్రికలో షోయాబుల్లా ఖాన్‌ చేరారు. నిజాం పాలకుల దాష్టీకాలను, రజాకారుల చర్యలను తీవ్రంగా ఎండగడ్తూ రచనలు చేయడాన్ని ఆయన కొనసాగించారు. ఆ కారణంగా షోయాబుల్లా ఖాన్‌ను హెచ్చరిస్తూ అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు రాసాగాయి. ఆ బెదిరింపులను ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. చివరకు రయ్యత్‌ పత్రిక కూడా పాలకవర్గాల ఆగ్రహానికి ఎరకాక తప్పలేదు. ఆయన అధైర్యపడలేదు. ప్రజల పక్షంగా అక్షరాయుధంతో నిరంకుశ పాలకుల విూద పోరాటం సాగించాల్సిందేనని షోయాబుల్లా ఖాన్‌ నిశ్చయించుకున్నారు. స్వయంగా జాతీయ భావాలను పెంపొందించగల పత్రికను ఆరంభించడానికి పూనుకున్నారు. భార్య, తల్లి ఆభరణాలను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఇమ్రోజ్‌ ఉర్దూ దినపత్రికను ప్రారంభించారు. ఇమ్రోజ్‌ ప్రథమ సంచిక 1947 నవంబరు 15న విడులయ్యింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడ్తున్నా, ఇమ్రోజ్‌ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. ప్రభువుల నిరంకుశత్వం, ఉన్మాదుల మత దురహంకారం మీద తిరుగులేని సమరం కొనసాగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. దేశంలోని సంస్థానాలన్నీ ఇండియన్‌ యూనియన్‌లో కలసి పోతున్నాయి. జునాఘడ్‌, రాంపూర్‌ లాంటి కొన్ని సంస్థానాలతో పాటుగా తొలుత నుండి బ్రిటీష్‌ పాలకులతో స్నేహం నెరపిన నైజాం సంస్థ్ధానాధీశులు ఇండియన్‌ యూనియన్‌లో తమ సంస్థానాలను విలీనం చేయడానికి నిరాకరించారు. ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో నైజాం పాలకులు చర్యలు చేపట్టారు. ఆ విపత్కర వాతావరణంలో ఇమ్రోజ్‌ పత్రికా సంపాదకునిగా షోయాబుల్లా బృహత్తర బాధ్యతలను నిర్వర్తించారు. నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం ఎంతటి అవసరమో వివరిస్తూ నిజాం నిరాకరణ వెనుక గల స్వార్ధ రాజకీయాలను తూర్పార పడుతూ వ్యాసాలు ప్రచురించారు. హైదరాబాద్‌ సంస్థానం పరిధిలోని ప్రజలలో ఎక్కువ మంది ఉర్దూ చదువుకున్న వారు కావడంతో ఇమ్రోజ్‌ రాతల ప్రభావం వలన రోజురోజుకూ విలీనంకువిలీనానికి అనుకూలంగా మేధావులు, ప్రజలు స్పందించసాగారు.
 
1948 జనవరి 29 నాటి ఇమ్రోజ్‌ సంచికలో 'పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం' అను శీర్షికతో షోయాబుల్లా రాసిన సంపాదకీయం ఈ క్రింది విధంగా సాగింది. '...ఈనాడు గ్రామస్తులుగ్రామస్థులు ప్రభుత్వ తిరుగలిలో పిండి చేయబడుతున్నారు. ఇంత వరకు జరిగిన సంఘటనలు ప్రజల ఎదుట ఉన్నాయి. అరాచకం ఏవిధంగా రాజ్యం చేస్తోందో అందరికి తెలుసు ... ఇత్తేహదుల్‌ ముసల్‌విూన్‌ సభ్యులు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ గ్రామాలను దోచుకుంటున్నారు. బాధ్యతయుతమైన పదవుల్లో వున్న వ్యక్తులు వీటినన్నిటిని సాధారణ చోరీ నేరాల క్రింద త్రోసివేస్తున్నారు...మా అభిప్రాయంలో ఈ అరాచక వ్యవస్థ ఒక విషవలయంగా పరిణమించింది. ఒక గ్రావిూణుడు బాధతో 'పగటిపూట ఒక ప్రభుత్వం, రాత్రి మరొక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నది' ఆన్న మాట సత్యదూరమేవిూ కాదు...ఇత్తేహదుల్‌ ముస్లివిూన్‌ సంస్థ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలను ఎందుకు విధించకూడదు? ప్రజలందరికి ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గాన్ని యెందువల్ల ఏర్పాటు చేయదు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి పరిపాలన సాగిస్తేనే ఏమైనా, ఏ ప్రభుత్వమైనా మనగలుగుతుంది...'<ref>హైదరాబాద్‌ అజ్ఞాత చరిత్ర పుటలు, హిందీ మూలం: శ్రీ ఖండేరావు కులకర్ణి, తెలుగుసేతః శ్రీ నిఖిలేశ్వర్‌, నవభారతి, విజయవాడ, 1979, పేజి.70-71</ref>
 
ఈ పరిణామాలు నిజాం పాలకవర్గాలకు కంటక ప్రాయమయ్యాయి. కలం యోధుడు షోయాబుల్లాను నయానా, భయానా నచ్చచెప్పి ఆయన కలాన్ని నియంత్రించాలని పాలక వర్గాలు శతవిధాల ప్రయత్నించాయి. అన్నిరకాల ఆశలు చూపాయి. తమ ప్రయత్నాలు ఏమాత్రం నెరవేరకపోవడంతో, భయంకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, చివరికి పరోక్షంగా, ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశాయి. ఆ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయక, నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాల్సిందేనని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిజాం సంస్థ్ధానాన్ని స్వతంత్ర రాజ్యం కానివ్వరాదన్న పట్టుదలతో రచనలు చేస్తూ వచ్చిన షోయాబుల్లా ఖాన్‌ ఆ హెచ్చరికలను గడ్డిపోచ క్రింద జమకట్టారు. అనునిత్యం హెచ్చరికలను ఎదుర్కొంటూ కూడా వజ్ర సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్న షోయాబుల్లా అంటే ప్రేమాభిమానాలు గల స్వాతంత్య్రసమరయోధులు బూర్గుల రామకృషారావు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆయనకు సలహలిచ్చారు. ఆ సలహాలకు సమాధానంగా, సత్యాన్వేషణలో ఒక వ్యక్తి మరణిస్తే అది గర్వించదగిన విషయమని గాంధీజీ చెప్పారుకదా! అటువంటప్పుడు నేనెందుకు భయపడాలి' అంటూ షోయాబుల్లా ఖాన్‌ ప్రత్యుత్తర మిచ్చి బూర్గులను ఆశ్చర్యచకితుల్ని చేశారు.
పంక్తి 42:
ఆ మరుసటి రోజున షోయాబుల్లా ఖాన్‌ హత్యోదంతం మీద నైజాం ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సంఘటన విూద గూఢచారి విభాగం దర్యాప్తు జరిపిందని, అది రాజకీయ హత్య ఏమాత్రం కాదని, ఈ హత్యవెనుక ఎటువంటి రాజకీయ కారణాలు ఏమీ లేవని ప్రకటించింది. అది వ్యక్తిగతమైన శత్రుత్వం వలన మాత్రమే జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటూ, ఈ సంఘటన మీద ఇంకా విస్తృతంగా దర్యాప్తు జరుగుతుందని ప్రకటించి నైజాం ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
 
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి ముహమ్మద్‌ బాకర్‌ అమరుడైన తరువాత ఒక సంపాదకునిగా జాతీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ, నిరంకుశ పాలకుల కిరాతకత్వానికి బలైన ఏకైక పాత్రికేయుడిగా షోయాబుల్లా ఖాన్‌ మరోచరిత్ర సృష్టించారు. భారతదేశ స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో 1857లో ముహమ్మద్‌ బాకర్‌, 1948లో షోయాబుల్లా ఖాన్‌ తప్ప, ఆంగ్లేయుల, ఆంగ్లేయుల వత్తాసుదారుల దాష్టీకాలను అక్షరాయుధాలతో ఎదుర్కొని, ఆ క్రమంలో ప్రాణాలను సైతం బలిపెట్టిన మరో సంపాదకుడు గాని, ఇంకో పత్రికాధిపతి గాని కన్పించరు. ఆ విధంగా భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్ర తొలిథలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌, మలిథలో ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ ప్రాణ త్యాగాలు చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవప్రతిష్టలుగౌరవప్రతిష్ఠలు సమకూర్చిపెట్టారు.<ref>హైదరాబాద్ మిర్రర్ 22.8.2013,,భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు</ref>
 
==పాత్రికేయునిగా==
సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు. చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు. ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు.
 
కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషను రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. [[1948]] [[ఆగస్టు 22]] న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించిందినిషేధించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట శ్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.<ref>http://www.scribd.com/doc/189173348/50-Samvatsarala-Hyd-on-Shoebullah-Khan</ref> , <ref>http://www.10tv.in/specials/Telangana-Rebellion-Shoaibullah-Khan-Fight-against-Nizam-for-Freedom-Yodha</ref>
 
==డిమాండ్లు==
*షోయబుల్లాఖాన్ ను చంపేసిన చోట ఆయన విగ్రహం పెట్టాలనీ, కాచిగూడ చాపెల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలనీ జర్నలిస్టులు డిమాండు చేశారు. అయితే ఆయన పుట్టిన ఊరు ఏదో స్పష్టంగా తెలియడంలేదు. సుబ్రవేడు, సుబ్రదేవ్, మహబూబాబాద్ ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు.ఇప్పటికైనా ఆయన జన్మస్థలాన్ని విలేకరులు కనుక్కోవాలి.మండలం, పంచాయతీ తోపంచాయతీతో సహా ఆయన ఊరు స్పష్టంగా తెలుసుకొని ఆయనకు జన్మనిచ్చిన ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టాలి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు