సాలూరు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కుటుంబ సభ్యులు: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి (2), సమిష్టి → సమష్టి, విద్యార్ధ using AWB
పంక్తి 48:
 
“వేల్‌” వారి [[శశిరేఖాపరిణయం]] (మాయాబజార్‌ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో [[అభిమన్యుడు|అభిమన్యుడి]] పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (''నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ'') పాడాడు. ఆ చిత్రం పూర్తయిన తరువాత మరొక చిత్రంలో నటించేందుకై కలకత్తాకు చేరుకోవడంతో ఇతని జీవితంలో మరో ముఖ్య ఘట్టం మొదలయ్యింది. గాయక నటునిగా పేరు సంపాదించినా సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తృష్ణ ఈయనలో అధికంగా వుండేది. అదే, కలకత్తాలో,”న్యూ థియేటర్స్‌ సంగీతత్రయం”తో ([[ఆర్‌.సి.బోరల్]]‌, [[పంకజ్‌ మల్లిక్]]‌, [[తిమిర్‌ బరన్‌]]) పరిచయాలకు, ప్రముఖ గాయకుడు [[కె.ఎల్.సైగల్‌]] వద్ద శిష్యరికానికి దారి తీసింది. ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన వ్యక్తి సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. ఆయన తదుపరి సంగీత సృష్టిలో అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు. మరికొద్ది కాలానికి [[చిత్రపు నరసింహరావు]] దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. కాని ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా [[ఇల్లాలు]] (1940).
 
===ఇల్లాలు సినిమా===
పంక్తి 61:
 
===జెమినీ ఆస్థాన సంగీతదర్శకుడు===
మరో రామబ్రహ్మం చిత్రానికి ([[అపవాదు]] (1941), “కోయిలొకసారొచ్చి కూసిపోయింది” లాంటి సుమధుర గీతాలతో) పని చేసినపనిచేసిన అనంతరం మంచి అవకాశం రావడంతో “జెమిని” సంస్థలో చేరి, [[జీవన్ముక్తి]] (1942) నుంచి [[మంగళ]] (1951) వరకు, ఆ సంస్థకు ఆస్థాన సంగీతదర్శకుడిగా పనిచేశాడు. “జెమినీ” వారి [[బాలనాగమ్మ]]కు (1942) నేపథ్య సంగీతంలో అందులోని భయానక కరుణరస సన్నివేశాలకు అనుగుణంగా మనవారికి నచ్చేరీతిని పాశ్చాత్య స్వరమేళ ఫణితుల్ని అవలీలగా కల్పించి ప్రయోగించాడు. అదే సమయంలో, “జెమినీ”వారి చిత్రానికి పోటీగా తయారయిన “వసుంధర” వారి [[శాంత బాలనాగమ్మ]]లో (1942) “బాలవర్ధి రాజు” పాత్ర ధరిస్తూ ఆ చిత్రానికి సంగీతాన్ని అందివ్వడం, కొన్ని పాటలు పాడడం (ప్రియజననీ వరదాయని, సుఖదాయి సుఖదాయి) వింతైన విషయం.
 
“జెమిని”లో పని చేస్తున్న కాలంలోనే అడపదడపా రేడియోవారి నాటకాలకు, సంగీతరూపకాలకు కూడా వరసలు కట్టడం, పాటలు పాడడం చేస్తుండేవాడు. “మోహినీ రుక్మాంగద” (1942, శ్రీశ్రీ రచన) లాంటి నాటకాలకు అందించిన సంగీతం ద్వారా ఆయన అనుభవశాలియైన సంగీత దర్శకుడనిగా నిరూపించుకున్నాడు.
పంక్తి 69:
 
===మల్లీశ్వరి సినిమా===
ఇంక సాలూరి కిరీటంలో కలికితురాయి [[మల్లీశ్వరి]] (1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. [[వి.ఎ.కె.రంగారావు]]గారి మాటల్లో చెప్పాలంటే “[[బి.ఎన్‌.రెడ్డి]] కార్యదక్షతతో, [[దేవులపల్లి]] మల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, [[పసుమర్తి కృష్ణమూర్తి]] నృత్య సారధ్యంతో, [[ఘంటసాల]] [[భానుమతీ రామకృష్ణ|భానుమతి]]ల గళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది వున్నారుఉన్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ '' "చంద్రలేఖ" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగిందని చెప్తే ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ్చర్యగా ఉంటుందేమో'' అని అన్నాడు. ఈ చిత్రంలో చేపట్టని సంగీతప్రక్రియ లేదేమో! ప్రతి సంగీత విద్యార్థిమొదటిగా నేర్చుకొనే ''శ్రీగణనాధ సింధూరవర్ణ'' (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (''ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ''), హాస్య గీతం (''కోతీబావకు పెళ్ళంట''), ప్రకృతి పాట (''పరుగులు తీయాలి''), జావళి ( ''పిలచిన బిగువటరా''), జానపదం (''నోమీన మల్లాల''), వీడ్కోలు పాట (''పోయిరావే తల్లి''), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమిష్టిసమష్టి కృషిఫలితం ''ఆకాశవీధిలో'' అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్‌, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!
 
===విప్రనారాయణ సినిమా===
పంక్తి 75:
 
==ప్రతిభ==
శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు , పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా చెప్పుకొంటారు. 20 - 30 వయొలిన్లు ఒకేసారి వాడిన సందర్భాల్లో ఏ వొక్క వయొలిన్‌ తప్పు పలికినా ఆ నంబరును చెప్పి మరీ గుర్తించే వారని అంటారు. మరో పర్యాయం అతను అడిగిన గమకాన్ని పలికించక పోగా, అది అసాధ్యం అన్న వాద్యకారునికి ఈయనే వెంటనే వయొలిన్‌ను అందుకొని అదే గమకాన్ని పలికించాడు. ఇదెలా సాధ్యపడిందని ఆశ్చర్యపోయేవారికి, ఆయన నిత్యం విద్యార్ధిగానేవిద్యార్థిగానే కొనసాగాడని చెప్పాలి. బాల్యంలోనే తబలా, ఢోలక్‌, మృదంగం, హార్మోనియం నేర్చిన సాలూరి, తరువాత కలకత్తాలో సితార్‌, సుర్బహార్‌ అధ్యయనం చేశాడు. ఆ తరువాత పియానో, మాండలిన్‌, ఎలెక్ట్రిక్‌ గిటార్‌ వాయించడంలో కూడా పరిణతి సాధించాడు. ఇలా పలు వాద్యాలలో ప్రవేశం ఆర్కెస్ట్రేషన్‌ నిర్వహణలో ఈయనకు ఎంతో సహాయపడింది.
 
లక్ష్మన్న తమ వ్యాసంలో సాలూరిపై [[పెండ్యాల నాగేశ్వరరావు]] అభిప్రాయాన్ని పేర్కొన్నాడు. అలాగే సహ దర్శకుల యెడల సాలూరికున్న గౌరవాభిమానాలు గుర్తించదగ్గవి. ఉదాహరణలుగా పెండ్యాల “భీంపలాస్‌”లో స్వరపరచిన ''నీలిమేఘాలలో గాలి కెరటాలలో'' (బావామరదళ్ళు, 1960), [[రమేష్‌ నాయుడు]] 'కల్యాణి' రాగంలో చేసిన ''జోరు మీదున్నావు తుమ్మెదా'' ([[శివరంజని]], 1978) పాటలను తనకు నచ్చిన ఉత్తమమైన గీతాలుగా యెన్నుకుంటూ వారిని కొనియాడడం చెప్పుకోవచ్చు.
పంక్తి 81:
ఈయన సుదూర సుస్వర సంగీతయాత్రలో 200కు పైగా చిత్రాలకు, ఎన్నో లలిత గీతాలకు, పెక్కు ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించాడు. ఆయన 40 ఏళ్ళకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు [[రాజు పేద]] (54), [[మిస్సమ్మ]] (1955), [[భలేరాముడు]] (1956), [[మాయాబజార్‌]] (1957, 4 పాటలు మాత్రమే), [[అప్పుచేసి పప్పుకూడు]], (1958), [[చెంచులక్ష్మి]] (1958), [[భక్త జయదేవ]] (1960), [[అమరశిల్పి జక్కన]] (1963), [[భక్త ప్రహ్లాద]] (1967).
 
అభేరి (భీంపలాస్‌), కల్యాణి, మోహన, సింధుభైరవి,శంకరాభరణం ఈయనకు ప్రియమైన రాగాలు. శాస్త్రీయ రాగాల్లో ఆయన వినిపించిన వరసలనువరసల గురించి మరొక సుదీర్ఘమైన వ్యాసమే రాయవచ్చు. ''జగమే మారినది'' (కల్యాణి, [[దేశ ద్రోహులు]] 62), ''నా హృదయంలో నిదురించే చెలీ'' (శంకరాభరణం, [[ఆరాధన]] 62), ''పాడవేల రాధికా'' (మోహన, [[ఇద్దరు మిత్రులు]] 60), … లాంటి పాటలు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
 
సాధారణంగా, సృజనాత్మకత అన్నది పెరుగుతున్న వయసుతో తగ్గుతూ పోతుంది అనడం కద్దు. కాని, సినీరంగంలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటిన తరువాత కూడా ఆయనలో అలాంటి తగ్గుదలేమి లేదని చెప్పడానికి ఈ మూడు రికార్డులు, 1977లో చేసిన ''ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు'' ([[ఈనాటి బంధం ఏనాటిదో]]), 1980లో చేసిన ''అభినందన మందారమాల'' ([[తాండ్ర పాపారాయుడు]]), ''కృష్ణం వందే జగద్గురుం'' (ప్రైవేటు ఎల్‌ పి.) చాలు.
పంక్తి 91:
 
==కుటుంబ సభ్యులు==
రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం. ఇతని అన్న '''[[సాలూరు హనుమంతరావు]]''' కూడా తెలుగు, కన్నడ సినిమాలలో సంగీత దర్శకులుగా పని చేశాడుపనిచేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ధ పియానో మరియు ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్ధ గిటారిస్టు. ఈయన మూడవ మరియు నాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకులే. ముఖ్యంగా కోటేశ్వరరావు ([[కోటి]]) ప్రముఖ సంగీత దర్శకులు [[టీ.వీ.రాజు]] కోడుకైన సోమరాజుతో కలసి [[రాజ్-కోటి]] అన్న పేరుతో అనేక విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తరువాత కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు.
 
==సంగీతం అందించిన సినిమాలు==
పంక్తి 134:
#[[కులగోత్రాలు]] (1962) - చెలికాడు నన్నే పిలువా,అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే
#[[చదువుకున్న అమ్మాయిలు]] (1963) - ఒకటే హృదయం కోసము, వినిపించని రాగాలే, ఈ నల్లని రాలలో, కిలకిల నవ్వులు చిలికిన
#[[పూజాఫలం]] (1964) - నిన్నలేని అందమేదో , పగలే వెన్నెలా
#[[బొబ్బిలి యుద్ధం (సినిమా)|బొబ్బిలి యుద్ధం]] (1964)- శ్రీకర కరణాలవాల వేణుగోపాల, ముత్యాల చెమ్మ చెక్క, అందాల రాణివే, మురిపించే అందాలే
#[[మంచి మనిషి]] (1964)
పంక్తి 226:
* రాజేశ్వరరావు అన్న [[సాలూరు హనుమంతరావు]] కూడా సంగీత దర్శకునిగా [[రాధిక]] (1948), [[రాజీ నా ప్రాణం]] (1954), [[ఉషాపరిణయం]] (1960) మొదలైన చిత్రాలకు, ''నల్లనివాడా నే గొల్లకన్నెనోయ్‌'', ''వినవే చెలి పిలుపు'' (బాలసరస్వతి పాడినవి) లాంటి లలితగీతాలకు చక్కని సంగీతాన్ని అందించాడు.
* సాహిత్యాన్ని మింగి వేయని సరస సంగీతాన్ని అందించడం వీరి ప్రత్యేకత.
* ''స్వరాలూరు రాజేశ్వరరావు'' అని ఈయననుఈయన గురించి అభిమానులు చమత్కారంగా వ్రాశారు.
* [[విష్ణులీల]] (1938) అనే తమిళ సినిమాకు సహాయ సంగీత దర్శకునిగా పని చెయ్యటమే కాక [[బలరాముడు|బలరాముని]] పాత్ర ధరించి కొన్ని పాటలు కూడా పాడాడు.