సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →కడమాట |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారయణ → నారాయణ (5), లో → లో , లబ్ది → లబ్ధి, సారధ్య → సారథ్ using AWB |
||
పంక్తి 1:
[[బొమ్మ:Sima kathalu.jpg|thumb|right|250px|సీమ కథలు పుస్తక ముఖచిత్రం]]
===తొలిమాట===
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ
సీమ కథలు పుస్తకాన్ని [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]], [[హైదరాబాదు]] వారు మొదటిసారిగా[[1992]]లో ప్రచురించారు. మలిముద్రణ[[1994]]
అట్టిరాయలసీమ చిద్రమైన పల్లెజనుల బతుకులను పాఠకులముందుంచిన పుస్తకం-సీమ కథలు.
===మలిమాట===
ఈపుస్తకంలోని పద్దెనిమిదికథలలో మొదటి ఆరుకథలు [[అనంతపురం]] జిల్లాకు, ఆతర్వాతి ఆరుకథలు [[కడప]]జిల్లాకు, కడ ఆరుకథలు [[చిత్తూరు]] జిల్లాకు సంబంధించినకథలు.ఎందుచేతనో ఈప్రచురణలో [[కర్నూలు]]జిల్లా కుచెందిన కథలకు తావుదొరకలేదు.
'''సంకలనంలోని కథలు-రచయితలు'''
పంక్తి 20:
|మన్నుతిన్న మనిషి||[[చిలుకూరి దేవపుత్ర]]||ఆంధ్రప్రభవీక్లి-1991
|-
|కల్లమయిపాయ||శాంతి
|-
|రాములవారి గుడి ముందు||మోహ్న||ఆంధ్రజ్యోతివీక్లి-1977
|-
|అడుసు||సింగమనేని
|-
|కసాయి కరువు||చక్రవేణు||ఆంధ్రప్రభవీక్లీ-1986
పంక్తి 53:
==ఈసీమ కథల్లో ఏముంది?==
తాగేటందుకు గుక్కెడునీళ్లకై నెత్తిమీద, భుజాలమీద, సంకళ్లో కుండలు, కడవలు పెట్టుకొని మైళ్ళకుమైళ్ళు ఆడ, మగ, పిల్లలు అనేతేడా లేకుండ మిట్టమధ్యహన్నం, అపరరాత్రి వేళాపాలా లేకుండ నడచివెళ్ళడం వుంది. తాగునీటికై రోజూ కొట్లాటలు, తగాదాలు, బుర్రలు బద్దలు కావటాలు
రెక్కలుముక్కలుచేసుకొని, కుటుంబంలోని వారంత తమ స్వంతపొలాల్లోనే కూలీలుగా మారి పంటపండిస్తె, వడ్దివ్యాపారులు, ఎరువులు, నాసిరకంవిత్తనాలు, నకిలీపురుగుల మందులు అప్పుగాయిచ్చిన ఆంగడి వాళ్ళు, పంటకొనటానికి వచ్చిన దళారులు, కొనుగోలుదారులు రాబందులవలె చుట్టూచేరి, రైతు కష్టఫలాన్నిదోచుకొని రైతును నడిబజారులో బిచ్చగాడిలా నిలబెట్టిన నిజాలున్నాయి.నగరంలో విలాసవంతమైన జీవితానికై హైటెక్కు వ్యభిచారం చేస్తుంటే, ఒకపూటనైన పస్తులున్న పిల్లలకడుపునింపెటందుకు "ఆతప్పు"చేస్తె తప్పెముందనుకునే కూలిపనిచేసె చెంగమ్మ లాంటి ఆడబ్రతుకులున్నాయి.
అందినకాడికి అప్పుచేసి, తాళిబొట్టుతో సహ అయినకాడికి అన్నీ అమ్మి, బావి త్రవ్విస్తే, అందులో బండపడి, తమబతుకులు బండలై, ఆబావిలోనే శవాలైన చితికిన రైతుబతుకులున్నాయి. పూలమ్మినచోట కట్టెలమ్మలేక పక్కజిల్లాలకు, కూలీలగా, ప్యాక్టరిలలో కార్మికులుగా వెళ్లిన జనుల వుదాంతాలున్నాయి.
రైతులబ్రతులు బాగుపడితే తమ ఆధిపత్యంసాగదని వారిని అలాగేవుంచే రాజకీయవేత్తలు, కుళ్ళు రాజకీయాలు
==కడమాట==
'''కథలగురించి టూకీగా'''
'''నీళ్ళు''':కథపేరింటేనే కథాంశమెమిటో తెలిసిపోతున్నది. తాగేనీళ్ళను పొందెటందుకై మధ్యతరతి సగటుజీవుని పోరాటం ఈ కథా వృత్తాంతం. బిందెడునీళ్ళకై కొట్టుకున్నవాళ్ళు బెయిల్ఇప్పించెవారులేక జైలుగదిలో అల్లాడుతుంటే, రాజకీయ
'''హైనా''':నారాయణప్ప మూడెకరాల సేద్యంచేస్తున్నాడు. బోరుంది, పంపుంది. కాని కరెంటే లేదు ఏప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్దితి. రోజంతా చేనికాడే కరెంట్ రాకడకై ఎదురు చూపులయ్యే. పులిమీద పుట్ర లాగా వూరిలోకి హైనా వచ్చి పిల్లలనెత్తుకుపొతున్నదన్నవార్త. హైనాను చంపేటందుకు వూరిజనమంతా ఒక్కటైనారు.ఈ సందర్భంలో సూరన్న
"పేదరికాన్ని ఆసరాచేసుకునే ప్రభుత్వాలూ మంత్రులూ పుట్టుకొస్తారు. పేదరికం నశిస్తే ఈవ్యవహరమే వుండదు. ఏదేశంలో నయినా ఇంతే జరిగేది. అందుకే ప్రభుత్వాలు పుట్టాక అవి వశించకుండా వుండే పనులే చేస్తాయి. బ్యాంకుల అప్పులూ, వడ్డిలూ, సబ్సిడీలూ, చిల్లర సహాయాలూ, అన్నీఅవే.మనల్ని కలిసికట్టుగా చేరకుండా పేదరికాన్నిపూర్తిగా తొలగించకుండా-అట్లాచావకుండా ఇట్లాబతక్కుండా శవల్లా నడిపిస్తాయి. కాబట్టే హైనాను ఎదుర్కొటానికి కలిసినట్లుగా కరువును ఎదుర్కోటానికి కలవం. పిల్లలకు భవిష్యత్తు లేకుండా హైనాచేస్తే, ఎవ్వరికి భవిష్యత్తు లేకుండా కరువు చేస్తున్నది. ఎన్నోవేలరెట్లు హైనా కన్న కరువు భయంకరమైనా ఎందుకు అడ్దుకోలేమో ములాన్ని ఆలోచించం.."అంటాడు.
ఆతరువాత హైనా కంటబడగానే నారాయణప్పఆవేశంగా, కసిగా హైనాను ముక్కముక్కలుగా నరికి చంపుతాడు.
'''మన్నుతినమనిషి''': అనంతపురంజిల్లాలోని గ్రామం చెన్నప్పది.పదెకెరాల పొలమున్నది. కరువుపుణ్యాన ఈమధ్యకాలంలో పంట చేతికొచ్చిందిలేదు. చెన్నప్పకొడుకు రామచంద్రడు తనపెల్లాం ఒబులమ్మ, ఇద్దరుపిల్లలతో బళ్ళారికొచ్చి, పెళ్లంతోపాటు బెల్దారికూలీ పనికెల్లుతున్నాడు. ఉండేగుడిసెకు నూరురూపాయలు బాడిగె, ఊళ్ళొని తండ్రికి వందరూపాయలు పంపాలె. జరగడం కష్టంగా వుంది. అందుకే ఒబులమ్మ ఊర్లోని పొలాన్ని అమ్మేసి ఇక్కడే జాగాకొని గుడెసె వేసుకొంటె, బాడిగె డబ్బులు మిగులుతాయి. మామను ఇక్కడికే తెచ్చి వుంచుకుందామని రోజు పోరు.మొదటపెళ్ళం మాటలు కొట్టిపడెసిన, చివరికి వూరికొచ్చి, రాత్రి తండ్రికి అసలు విషయం చెప్తాడు. చెన్నప్ప ఒప్పుకోడు. ఈనాడైతే కరువొచ్చినమాట నిజమైన, ఇప్పటివారకు ఆధుకున్నది ఆభూమేకదా అంటాడు. అమ్మకం విషయమై తండ్రి కొడుకులకు గట్టీగా గొడవ అవుతుంది. అలిగిన చెన్నప్ప కోపంగా బయటికెల్తాడు. కోపంతగ్గిన రామచంద్రుడు, ఓబులమ్మ రాత్రంతా బెంగగా చెన్నప్పకై ఎదురు చూస్తుంటారు. వుదయాన్నే అందరు తోటల్లో, చేలల్లోని బావుల్లో వెదుకుతారు.చివరికి తనపొలంలో.....
<center>'''వాడిపోయిన వేరుశనగ చేలో, తల్లిఎదమీద అదమరిచి నిద్రిస్తున్న పసివాడిలా, నిర్విచారంగా నిర్మలంగా ఉంది చెన్నప్ప శవం.రామచంద్రుడు చేష్టలుడిగి తండ్రిశవం మీద పడిపోయినాడు'''.</center>
'''కల్లమయిపాయ''':సీమలో వ్యవసాయాన్ని నమ్ముకున్నరైతుకు కరువొచ్చి పండకపోతే 'అప్పులు', అదృష్టంబాగుండి పంట పండితే 'పస్తులు' అనేది అక్షరసత్యం. విత్తనాలకు ఎరువులకు, మందులకు, ఇంటి అవసరానికి అప్పులిచ్చినవాళ్ళు పంటకళ్లంలో నుండగానే కాకుల్ల వాలిపోతారు. పంట దిగుబడి ఇరవైమూటల వడ్లు వస్తే, కళ్లంనుండి బండి ఇంటిపట్టుకు చేరేటప్పటికి మూడు మూట లైయ్యాయి. ఆమూడు మూటలవడ్లతోటే ఆఎడాదింత కుటుంబం బతకాలా?.
▲'''కల్లమయిపాయ''':సీమలో వ్యవసాయాన్ని నమ్ముకున్నరైతుకు కరువొచ్చి పండకపోతే 'అప్పులు', అదృష్టంబాగుండి పంట పండితే 'పస్తులు' అనేది అక్షరసత్యం. విత్తనాలకు ఎరువులకు, మందులకు, ఇంటి అవసరానికి అప్పులిచ్చినవాళ్ళు పంటకళ్లంలో నుండగానే కాకుల్ల వాలిపోతారు. పంట దిగుబడి ఇరవైమూటల వడ్లు వస్తే,కళ్లంనుండి బండి ఇంటిపట్టుకు చేరేటప్పటికి మూడు మూట లైయ్యాయి. ఆమూడు మూటలవడ్లతోటే ఆఎడాదింత కుటుంబం బతకాలా?.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:పుస్తక పరిచయాలు]]
|