సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

/* హనుమంతుని సాగర తరణ
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , కు → కు , డను గురించి → డ గురించి , మ using AWB
పంక్తి 1:
{{అయోమయం}}
'''సుందరకాండ''' [[రామాయణం]]లో ఐదవ కాండ. [[హనుమంతుడు]] లంకా లంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో [[కిష్కింధకాండ]] ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.
[[ఫైలు:Hanuman's visit to Lanka.jpg|right|thumb|400px|సుందరకాండములోని కొన్ని ఘట్టాలు - 1800 కాలం నాటి చిత్రం - ఇందులో సాగర లంఘనం, సీతా దర్శనం, లంకా దహనం చిత్రీకరింపబడినాయి]]
 
పంక్తి 19:
అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.
 
మరొక అభిప్రాయం: "హనుమంతుడు" (వజ్రాయుధం వల్ల హనుమ, అనగా దవడ, కు దెబ్బ తగిలినవాడు), ఆంజనేయుడు (అంజనా దేవి కుమారుడు), మారుతి (వాయుదేవుని కొడుకు) వంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు "సుందరుడు" అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడని అంటారు.
 
[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] అనే పుస్తకం ముందుమాటలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇలా రాశాడు - ”"రామాయణమునందు తక్కిన కాండలకు తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి విడిగా "సుందరకాండము" అను పేరు ఏల .. అను సంశయము పలుమందికి కలదుఉంది. నేను సుమారు ముప్పది యేండ్లక్రింద కీ.శే. శ్రీ కాశీకృష్ణాచార్యులవారిని ఈ ప్రశ్న అడిగితిని. సుందర హనుమన్మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించుట వలన ఆ పేరు వచ్చినది అని చెప్పిరి."” <ref name="shodasi">[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000</ref>
 
అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్రశర్మ, పై వాదనలతో ఏకీభవించలేదు. "శ్రీ సుందరకాండకు ఆ పేరెట్లు వచ్చినది?" అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం - సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క [[కుండలిని|కుండలినీ యోగసాధన]], త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందుఅర్ధములో వసించును. కనుక ఇది సుందరకాండము. [[ఆది శంకరుడు|ఆది శంకరుని]] ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము [[సౌందర్య లహరి]]లోని "సౌందర్య" పదము ఈ భావములోనే వాడబడినదివాడబడింది. [[బ్రహ్మాండ పురాణము]]లో ఈ కాండము "సౌందర్య కాండము" అనియే చెప్పబడినదిచెప్పబడింది.<ref name="shodasi"/>
 
==సుందరకాండ సంక్షిప్త కథ==
పంక్తి 40:
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు [[రావణుడు|రావణుని]] మందిరములోనూ, పానశాలలోనూ, [[పుష్పక విమానము]]లోనూ .. అన్నిచోట్లా సీతను వెదకాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో [[మండోదరి]]ని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టం లేదు. తన కార్యం విఫలమైతే [[సుగ్రీవుడు]], రామ [[లక్ష్మణుడు|లక్ష్మణులు]], మరెందరో హతాశులౌతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.
 
'''నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః''' అని ప్రార్ధించాడుప్రార్థించాడు. దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, [[అగ్ని]], [[వాయుదేవుడు]], [[ఇంద్రుడు]], [[వరుణుడు]], [[సూర్యుడు|సూర్య]][[చంద్రుడు|చంద్రులు]], [[అశ్వినీ దేవతలు]], మరుత్తులు, [[శివుడు]], సకల భూతములు, [[శ్రీమహావిష్ణువు]] తనకు కార్యసిద్ధి కలిగించవలెనని ప్రార్ధించిప్రార్థించి సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు.
 
===అశోకవనంలో సీతమ్మ దర్శనం===
పంక్తి 62:
===శ్రీరామ వర్ణన===
[[File:Hanuman's visit, in bazaar art with a Marathi caption, early 1900's.jpg|thumb|సీత హనుమంతునికి చూడామణిని ఇచ్చుట]]
చెట్టుపైనుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంక ఆలస్యము చేసినచో సీత ప్రాణత్యాగము చేయగలదని ఊహించాడు. కాని ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె ఖంగారుపడి కేకలు వేయవచ్చనీ, అలాగయితే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపైనుండి మెల్లగా [[దశరథుడు|దశరథ]] కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, [[బృహస్పతి]]కి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
 
{{main|సుందరకాండలో శ్రీరాముని వర్ణన}}
పంక్తి 70:
 
[[దస్త్రం:AN00916018 001 l.jpg|thumb|left|హనుమంతుడికి చూడామణిని ఇస్తున్న సీత]]
శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని కోరాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చినదిఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం (హనుమంతుడు, వాయుదేవుడు, [[గరుత్మంతుడు]] తప్ప) ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.
 
అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి (యుద్ధానికి కాదు) పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి సూర్య చంద్రుల వలె, అగ్ని వాయువులవలె లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.
పంక్తి 80:
ఆ కపిని బంధించమని రావణుడు ఎనుబదివేల మంది సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు - '''జయత్యతిబలో రామో, లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభిపాలితః, దాసోహం కోసలేంద్రస్య, రామస్యా క్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః''' అని జయఘోష చేశాడు - ''మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన [[కిష్కింధ]] ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక'' - ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.
 
అప్పుడు రావణుడు, [[ప్రహస్తుడు|ప్రహస్తుని]] కుమారుడు మహా బలశాలీ అయిన [[జంబుమాలి]]ని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అఱచేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా యుద్ధ భూమి అంతా శత్రువుల రక్త మాంసాలు చెల్లాచెదరయ్యాయి. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేత నిహతులైపోయారు. రణ భూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోను, ఆయుధ, రధరథ శకలాలతోను నిండిపోయింది.
 
[[దస్త్రం:Hanuman allowing himself to be taken before Ravana.jpg|thumb|300px|left|హముమంతుని బంధించి తీసుకు వెళుతున్న ఇంద్రజిత్తు]]
పంక్తి 97:
===లంకా దహనం===
[[File:Hanuman Watches Lanka Burn.jpg|thumb|ఎడమ|మండుచున్నలంకను చూచుచున్న హనుమంతుడు]]
రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్ధించిందిప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు.
 
అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న ఊహతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి, ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని అభయం పలికాడు. ఆమెకు ప్రణమిల్లి, తిరిగి ఉత్తరదిశకు బయలుదేరాడు.
పంక్తి 117:
===రామునకు సీత జాడ తెలుపుట===
 
అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. '''దృష్టా దేవీ (చూచాను సీతను) ''' అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, మె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.
 
ఓ రామా! సీతామాత ఏకవేణియై, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.
పంక్తి 127:
 
==సుందరకాండ ప్రాముఖ్యత==y
రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పేరు గురించి పైన వ్రాసిన విషయాలలో ఆ కాండము మంత్రయుక్తమనీ, పారాయణా భాగమనీ తెలుపబడింది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం విజయవంతమౌతుందనీ బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము. అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మ శాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండనుసుందరకాండ గురించి '''"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం, హనూమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమమ్"''' అని పేర్కొన్నది..<ref name="shodasi"/>
 
సుందరకాండ పారాయణా విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంధాలుగ్రంథాలు ఉన్నాయి. గుంటూరు శేషేంద్ర శర్మ తన "షోడశి - రామాయణ రహస్యాలలో తెలిపిన కొన్ని విశేషాలు <ref name="shodasi"/>
 
* రామాయణానికి ఇది బీజకాండము. మంత్ర సంయుక్తము.
* దీనిలో గుప్తముగా హనుమంతుని కుండలినీ యోగసాధన నిక్షిప్తమై ఉన్నది. మొదటి శ్లోకంలో "చారిణా చరిత పథే.." అన్న పదాలలోనే యోగ సాధన సూచితమైంది. మైనాక, సురస, సింహికా వృత్తాంతాలు గ్రంధిగ్రంథి త్రయ భేదనాలకు నిదర్శనాలు. లంకయే మూలాధార చక్రము. సీతా వర్ణనలో వాడిన అనేక పదాలు పరాశక్తికి, కుండలినీ శక్తికి నిదర్శనాలు. సీత కృశించిన "పన్నగేంద్ర వధువు" వలె ముడుచుకొని యున్నది. ("బిస తంతు తనీయసీ" అని కుండలిని వర్ణిస్తారు). ప్రతిపత్ చంద్ర కళ, విద్య, శ్రద్ధ, బుద్ధి, ఆజ్ఞ, కీర్తి వంటి ఉపమానాలు అన్నీ దేవి నామాలుగా [[లలితా సహస్రనామ స్తోత్రము]], [[దేవీ భాగవతము]], [[దుర్గా సప్తశతి]] వంటి గ్రంధాలలోగ్రంథాలలో ఉన్నాయి. "సుందర" కాండ అనే పేరే సచ్చిదానంద సౌందర్యమూర్తిని సూచిస్తుంది.
* త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది మణిపతకం వంటిది.
 
పంక్తి 139:
* వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహపీడలు, అనపత్యతలు, దారిద్ర్యములోనైన సంకటములన్నియను సుందరకాండ పారాయణము వలన తొలగుటయే గాక భక్తి ముక్తులును కలుగును. ఇది పారంపర్యముగ వచ్చిన మూఢ విశ్వాసము కాదు. పరీక్షితము, సిద్ధాంతితము, ప్రత్యక్షము, సహేతుకము.
* తత్వ సంగ్రహ రామాయణములో ఏయే సర్గ పారాయణం వలన ఏయే ఫలితాలు కలుగుతాయో చెప్పబడింది.
* అర్ధ పంచక జ్ఞానము ఆచార్యుల వలననే కలుగునని హనుమంతుని చర్య వలన బోధింపబడినదిబోధింపబడింది. అర్ధ పంచకమనగా (1) ప్రాప్యమగు బ్రహ్మ స్వరూపము (2) జీవాత్మ స్వరూపము (3) ఉపాయ స్వరూపము (4) ఫల స్వరూపము (5) విరోధి స్వరూపము
* దశేంద్రియాధిష్ఠితమైన దేహమే లంక. అహంకార మమకారములు రావణ కుంభకర్ణులు. బంధింపబడిన చేతనుడే సీత. వివేకమే విభీషణుడు. భగవంతుడు తనను రక్షించునో రక్షింపడో అన్న సందేహముచే పరితపించుచున్న జీవునికి ఆచార్యుడు అర్ధ పంచక జ్ఞానము కలుగజేసి ఉజ్జీవింపజేయును.
* [[ద్వయ మంత్రము]]లోని శరణ శబ్దార్ధ రహస్యములు ఇందులో వివరింపబడినవి. గాయత్రీ మంత్రములోని "దేవ" శబ్దార్ధము ఇందు శ్రీరామ దివ్య మంగళ విగ్రహ వర్ణనచే వర్ణింపబడినదివర్ణింపబడింది.
* సంసార సాగర తరణము కోరు యోగులకు తగిన అభ్యాస విధి ఇందలి హనుమంతుని చర్యల వలన తెలియుచున్నవి.
* సుందర కాండములోని మొదటి అక్షరము "త" (తతో రావణీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః). చివరి అక్షరము "త" (తథాభిపీడితా). ఇది గాక సుందరకాండ ప్రతి సర్గమున మొదటి అక్షరములో సకారముగాని, తకారము గాని, లేదా శ్లోకములో "సీత"యను పదముగాని, తత్పర్యాయపదము గాని ఉండును. అలా కాని చోట్ల సర్గ రెండవ శ్లోకము మొదటి అక్షరము సకారము గాని తకారము గాని కలిగియుండును. "సీత"యే సుందరకాండమునకు అధిష్ఠాన దేవత. "ఓం తత్ సత్" ఈ కాండములో నిక్షిప్తమై ఉన్నదిఉంది.
 
==సాహితీ విశేషాలు==
పంక్తి 149:
 
==సుందరకాండ పారాయణా విధం==
ఆపదల నివారణ కోసం, అభీష్ట సిద్ధి, సంకల్ప జయం కోసం సాంప్రదాయికంగా సుందరకాండను పారాయణం చేసే ఆచారం ఉన్నదిఉంది. భక్తులు తమ ఇష్టానుసారం, వీలునుబట్టి పారాయణ చేస్తారు. అంతే కాకుండా "ఉమా సంహిత", "తత్వ సంగ్రహం", "బ్రహ్మాండ పురాణం" , "పారాశర్య ఉపపురాణం" వంటి గ్రంధాలలోగ్రంథాలలో పారాయణకు కొన్ని ప్రత్యేక విధానాలు చెప్పబడ్డాయి. ఏయే తిథి, వార, నక్షత్రాలలో ఏయే శ్లోకాలు, సర్గలు పారాయణం చేయాలో కూడా వివరింపబడింది. ఈ పారాయణంలో "సామాన్య పద్ధతి", "సంపుటీకరణ పద్ధతి" అనే రెండు విధానాలున్నాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ట, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ ఫల్గుణ మాసములలోను; విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులయందును; ఆది, బుధ, గురు, శుక్ర వారములలోను ఈ పారాయణ ప్రాంభించుట మంచిదని - నదీ సాగర తీరములందును, పవిత్ర తీర్ధ క్షేత్రములందును, దేవాలయములలోను, భక్తుల సన్నిధియందును, స్వగృహ దైవ ప్రారంధనా మందిరాలలోను, తులసి కోట చెంతను ఈ పారాయణము ఆచరించుట శుభ ప్రథమని సంప్రదాయ విశ్వాసము. మొత్తం కాండం పారాయణం మాత్రమే కాకుండా ఒక్కొక్క దుఃఖ నివారణకు లేదా ఫల సిద్ధికి కొన్ని కొన్ని శ్లోకములు కూడా పారాయణకు ఉత్తమములని చెబుతారు. "సప్తసర్గ పారాయణ" అనే క్రమం కూడా ఆచరణలో ఉన్నదిఉంది.
 
సాధారణంగా పారాయణానికి ముందు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అంగన్యాస కరన్యాసాదులు నిర్వహిస్తారు. ఒక విధానం ప్రకారం పారాయణం ఈ క్రమంలో ఉంటుంది.
[[ఫైలు:Kashtbhanjan.jpg|right|thumb|200px|కష్టభంజనుడు హనుమంతుడు - సారంగపూర్ స్వామి నారాయణ మందిరంలోని విగ్రహం]]
# గురువులకు, గణపతికి, ఇష్టదైవానికి, వాల్మీకికి, ఆంజనేయునకు, రామాయణమునకు, శ్రీరామునకు ప్రార్ధనలుప్రార్థనలు చేస్తారు.
# అనంతరం గాయత్రీ రామాయణం చదువాలి.
# సంక్షేప రామాయణము (బాలకాండలోనిది)
పంక్తి 340:
 
;పుస్తకాలు
తెలుగులో అనేక రామాయణాలు వెలువడినాయి. వాటిలో భాగంగా సుందరకాండ కూడా ఉన్నదిఉంది. ఇవే కాకుండా ప్రత్యేకంగా సుందరకాండకు సంబంధించిన అనేక రచనలు వెలువడినాయి. వాటిలో కొన్ని -
* సుందర కాండము, పారాయణ గ్రంథం - శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య
పంక్తి 349:
* రామాయణ సౌరభం - సుందరకాండ - [[మల్లాది శివరామశాస్త్రి]] [http://www.archive.org/details/ramayanasowrabha022577mbp]
* షోడశి - రామాయణ రహస్యాలు - [[గుంటూరు శేషేంద్రశర్మ]]
* వాల్మీకి మహర్షమహార్ష ప్రణీత రామాయణము - సుందరకాండము : త్రిదండి [[చినజియ్యర్ స్వామి]] [http://www.archive.org/details/valmikimaharship023962mbp]
 
; ఆడియో
పంక్తి 375:
==వనరులు==
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
 
* సుందర కాడంము, పారాయణ గ్రంథం - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి.వి.కోనప్పాచార్యులు - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2002)
 
* ఉషశ్రీ రామాయణం – రచన: [[ఉషశ్రీ]] - ప్రచురణ: శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ (2005)
 
* శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందర కాండము (శ్లోకములు, తాత్పర్యములు) - అనువాదకులు: డాక్టర్ ఎమ్.కృష్ణమాచార్యులు, డా.గోలి వేంకటరామయ్య - ప్రచురణ: గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ (2003)
 
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు