చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), గాధ → గాథ, శిధిలా → శిథిలా (3), శిథిలావస్త using AWB |
|||
పంక్తి 14:
==గ్రామంలోని దేవాలయాలు==
#మండల పరిధిలోని మట్లి రాజుల కాలంనాడు నిర్మించిన, పాత చిట్వేలి వరదరాజస్వామి ఆలయం, చోళరాజుల వైభవానికి సాక్షీభూతంగా నిలుచుచున్నది. గుంజన నదీతీరాన, ఒకటిన్నర ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం, అతి ప్రాచీనమైనది. గర్భగుడిలో నేటికీ వెలుగుతగ్గని వరదరాజస్వామి, భక్తులకు అభయమిచ్చుచున్నాడు. 15 అడుగుల ఎత్తయిన ప్రహరీగోడ, ఆలయానికి ప్రధాన రక్షణకవచంగా ఉంది. ఆలయానికి ముందుభాగాన 36 స్తంభాలతో మండపం ఉంది. రాతిస్తంభాలపైన వివిధ శృంగారభంగిమలతో నాట్యవిలాసాల చిత్రాలు, దేవతామూర్తులు మనకు కనువిందుచేయును. ఎత్తయిన రాతి మండపం ఇక్కడ మాత్రమే మనకు కనిపించును. ఈ మండపంలో వాలీ సుగ్రీవుల యుద్ధంలో చెట్టుచాటు నుండి, రాముడు వాలిపై బాణప్రయోగం చేసిన శిల్పాలు, ఇక్కడ ఒకే స్తంభంపై ఉండటం విశేషం. లేపాక్షిని గుర్తుకు తెచ్చే విధంగా రెండు పొరలను అంటించిన మండపస్తంభం, నాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణం. ఆలయ గర్భగుడి దక్షిణ గోడపై ఒక రాతి శాసనం కనిపించుచున్నది. ఈ ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉంది. ఎకరా స్థలానికి రు. 2 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంత సంపద ఉన్న ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది. 400 ఏళ్ళనాటిదిగా చెప్పబడుచున్న ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలు కరువైనవి. [2]
#శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం.
#ఈ గ్రామంలో వెలసిన గంగమ్మ జాతరను ప్రతి సంవత్సరం, పెంచల పౌర్ణమికి ముందు నిర్వహించెదరు. జాతరలో భాగంగా భక్తులు ముద్దలతో మ్రొక్కులు చెల్లించెదరు. పాడి పంటలు ఉన్న భక్తులు అమ్మవారి చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షణలు చేసి వెళ్ళెదరు. [3]
#మండల పరిధిలోని రాపూరు - తిమ్మాయపాలెం క్రాస్ వద్ద వెలసిన శ్రీ నరసింహస్వామివారి ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. 400 సంవత్సరాల చరిత్రగల ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళే భక్తులు, స్వామివారి పాదాలు దర్శించుకొని, తిరుమలకు వెళ్ళటం ఆనవాయితీ. ఏడుకొండల వెంకటేశ్వరుడి నుండి విడిపోతూ, తొలిసారి పాదం ఇక్కడ పెట్టి, రెండో పాదం పెంచలకోనలో పెట్టినాడని పురాణ గాథ. ఈ నేపథ్యంలో పెంచలకోన క్షేత్రంలో పది రోజులపాటు ఉత్సవాలు, ఎంతో వైభవంగా నిర్వహించెదరు. అయితే స్వామివారి తొలిపాదం ఉన్న ఈ ఆలయం మాత్రం, ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరుకోవడం, భక్తులకు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పెంచలకోనకు వెళ్ళలేని భక్తులు ఇకడ స్వామివారి పాదాలచెంత ముడుపులు చెల్లించుకుంటారు. [4]
|