కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
 
=== చరిత్ర ===
క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అనవేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టాడు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్ ముల్మ్ పాలనలో మంత్రి గవాన్ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్ షా కాలంలో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో [[విజయనగర]] రాజైన [[శ్రీ కృష్ణదే వరాయులు]] ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
అనంతరం [[గోల్కొండ]] ప్రభువైన [[ముహమ్మద్ కులీ కుతుబ్ షా|కులీ కుతుబ్ షా]] ఈ కోటను ఆక్రమించినట్లు తదుపరి [[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై [[ఇబ్రహీంపట్నం]] గ్రామం నిర్మించినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపాయాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొగల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]], తరువాత [[గోల్కొండ|గోల్కొండ నవాబు]]<nowiki/>లు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.
 
క్రీశ1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా కీశ 1767లో [[బ్రిటీష్]] వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.[[File:Fourcourt.JPG|thumb|ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట శిథిలాలు]]
కొండపల్లి ఖిల్లాకి వెళ్ళేందుకు [[జూపూడి (ఇబ్రహీంపట్నం మండలం)|జూపూడి]] మీదుగా కొండపైకి రోడ్డుమార్గం ఉంది. కొండపల్లి నుండి నడక మార్గం కూడా ఉంది.
[[దస్త్రం:Vijayawada-Kondapalli Quilla.jpg|thumbnail|కొండపల్లి కోట -అభివృద్ధి చేసిన తరువాత]]
 
==ఇతర దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
* శ్రీ చెన్నకేశవ రామాలయం:- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 2014, జూన్-18, బుధవారం నాడు, ఈ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ధ్వజస్తంభాలు, రెండు సింహద్వారాలు, ఒక మంటపం ఏర్పాటు చేసెదరు. ఈ పనులకు దేవాదాయ శాఖ రు. 16 లక్షలను మంజూరు చేసినది. ఆలయ యాజమాన్యం రు. ఆరులక్షలను అందించింది. [3] & [9]
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు