మొల్ల రామాయణము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Molla Writings.jpg|thumb|right|మొల్ల రామాయణము తాటాకు ప్రతి]]
[[మొల్ల రామాయణము]], [[సంస్కృతము]] లో శ్రీ [[వాల్మీకి]] విరచితమయిన [[శ్రీమద్రామాయణము]] ను ఆధారముగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్యకావ్యము. దీనిని 16వ శతాబ్దికి చెందిన [[మొల్ల]] అను కవయిత్రి రచించెను. ఈమె పూర్తి పేరు ఆత్మకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని [[కడప]] జిల్లాలోని [[గోపవరము]] అను గ్రామములో
నివసించినదని చరిత్రకారుల అభిప్రాయము. మొల్ల రామాయణములోని మొదటి కొన్ని పద్యాలలో తాను ఒక కుమ్మరి యొక్క కుమార్తెననియూ, తన తండ్రి శివభక్తుడనియు పేర్కొనినది.
 
మొల్ల ఏ విధమయిన సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. తన సహజ పాండిత్యమునకు ఆ భగవంతుడే కారణమని మొల్ల చెప్పుకొనినది. తాను రచించిన రామాయణమును నాటి రోజుల్లో అనేక కవులు చేయుచున్న విధముగా ధనము మరియు కీర్తిని ఆశించక ఏ రాజులకునూ అంకితము నివ్వలేదు. ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనము. మొల్ల రామాయణము ఆరు కాండములలో 138సుమారు పద్యములు870 (పీఠిక తో కలిపి)పద్యముల తో కూడుకున్నది. అంతకు మునుపే పలువురు రామాయణమును గ్రంధస్తంగ్రంథస్థం చేసిన విషయమును ప్రస్తావించుచూ తన పద్యకావ్యములోని మొదటి పద్యములలో ఇట్లనినది.
<poem>
రాజిత కీర్తియైన రఘురాము మున్ గవీశ్వరుల్
పంక్తి 10:
రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పు గల్గునే?
</poem>
మొల్ల రామాయణాన్ని, కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అనడం కూడా కద్దు.
 
[[వర్గం:తెలుగు కావ్యములు]]
"https://te.wikipedia.org/wiki/మొల్ల_రామాయణము" నుండి వెలికితీశారు