అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

సవరణ
విస్తరణ, సవరణ
పంక్తి 1:
'''అధినివేశ స్వరాజ్యము'''ను ఇంగ్లీషులో Dominion Status అంటారు. ఇది 19 శతాబ్దములో [[బ్రిటిష్]] ప్రభుత్వము తమ నిరంకుశ పరిపాలనలోనుండిన వలసరాజ్యములు స్వరాజ్యముకావలెననికోరి ఆందోళన చేయుచున్న దేశములకు తమ సామ్రాజ్యములో భాగముగనే వుంచుతూ అనుగ్రహించే ఒక విధమైన ప్రజాపరిపాలనా పధ్దతి. అట్టి ప్రజాపరిపాలనా పధ్ధతి ఫెడరల్ సంయుక్తరాజ్యాంగమందురు. స్వరాజ్యమే గాని, పూర్ణ స్వరాజ్యము కాదు. అట్టి అదినివేశ స్వరాజ్యమనే రాజ్యాంగము కలుగచేసిన యడల స్వపరిపాలన చేసుకునప్పటికినీ స్వరాజ్య జాతీయప్రభుత్వముతో పరిపాలింపబడు భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రరాజ్య సమ్మేళనములో నొకటైయుండెడిది. డొమీనియన్ అనగా రాష్ట్రము అని అర్దము చెప్పినప్పటికీ రాజ్యాంగ స్థితి, ప్రబుత్వాధికారమునొసగిన రాజ్యాంగ సంస్థను బట్టి డొమీనియన్ అను మాట కాలక్రమేణా కొంచెం మార్పుచెందినది. 1926 [[అక్టోబరు]] 26 తేదీన [[బ్రిటిష్ ప్రభుత్వము]] తమ రాజ్యప్రతినిధి ద్వారా చేసిన ప్రకటనలో అధినివేశ స్వరాజ్యమువలననే భారతదేశముయెక్క రాజ్యాంగమబివృధ్ధి కాగలదని వక్కాణించియున్నారు. 1926 లో సమావేశమైనబ్రిటిష్ సామ్రాజ్యసభ(Imperial Conference) వారి తీర్మానమునందు అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు వివిరింపబడియున్నవి. 1920 లో తిలక్ మరణించిన తరువాత కొంతకాలము దేశములో నెలకొనియున్న అనిశ్ఛలతమైనస్వరాజ్య భావముల కాలమందు (1921-1924 మద్యలో) [[మోతీలాల్ నెహ్రూ]] అధ్యక్షతన జరిగిన [[కాంగ్రెస్]] సమావేశములో తీర్మానము ప్రకారము భారతరాజ్యాంగ ముసాయిదా(చిత్తు) తయారుచేయబడినదనీనూ అందులో ప్రస్తావించిన స్వరాజ్యము అప్పటిలో బ్రిటిష్ సామ్రాజ్యములోనున్న '''డొమీనియన్లు అనబడు దేశములు (DOMINIONS) కెనడా,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశములందు గల స్వరాజ్య''' '''ప్రజాప్రభుత్వములాంటి సరిసమానస్తాయి ని డొమీనియన్ స్టెటస్ (dominion status)''' కావలెనని కోరబడినదని చరిత్రలో విశదమగుచున్నది.<ref> Macropedia Britannica vol 15th Edition(1984). Indian Sub-continent.Vol 9. pp 412.</ref> 1926-1931లో భారతదేశమును పరిపాలించిన వైస్రాయి, [[లార్డు ఇర్విన్]] ప్రభువు అప్పటిలో ఉదృతముగా ప్రబలుతున్న స్వరాజ్య కాంక్షకు సానుభూతిగనూ, కొంత ఉపశమనము కలుగచేయుటకునూ అవలంబించిన రాజనీతి తో భారతదేశమునకు డొమీనియన్ స్టేటస్ ఇవ్వబడవచ్చునను ఆశాచూపెట్టెను. ఆ కాలమందు తెలుగు ప్రాంతములలో మేధావులు రాజనీతిజ్ఞలును ఆ ఇంగ్లీషు పదమైన డొమీనియన్ స్టేటస్ కు [[తెలుగు]]సేత గా అధినివేశ స్వరాజ్యమని చెప్పిరి. <ref name = "ది.వేం.శి(1933)"> "అదినివేశ స్వరాజ్యము" దిగవల్లి వేంకట శివరావు, చెరుకుపల్లి వెంకటప్పయ్య (1933) విజ్ఞానచంద్రికామండలి ప్రచురణ 40. ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ</ref>
 
== వలసరాజ్యమునుండి పూర్ణస్వరాజ్యము ==
బ్రిటిష్ వారి వలసరాజ్యముగా బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ పరిపాలననుండి భారదేశము పూర్ణ స్వపరిపాలిత దేశముగా మారిన చరిత్రలో పరిచయమైన ఆంగ్ల పదములు డొమీనియన్ స్టేటస్, డొమీనియన్, సావెరిన్ (Dominion status, Dominion and finally Sovereignty). ఈ మూడు పదములకు వ్యత్యాసముకలదు. 19-20 వ శతాబ్దపు బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర దృష్టితో డొమీనియన్ అనగా ఆ బ్రటిష్ సామ్రాజ్యములోని అంతర్భాగమైన ఒక దేశము ఆ నాటి (1867) మొట్టమొదట కెనడాకు లభించిన స్వపరిపాలన రాజ్యంగము. అటువంటి స్వపరిపాలనను గీటురాయిగా చేసుకుని 1924-26 మధ్యభారతదేశము స్వరాజ్య ఆందోళన నాయకులు కోరిన కోరిక ఆ కెనడా-స్తాయి-స్వపరిపాలన ప్రసాదించమని బ్రిటిష్ ప్రభువులను అర్ధించారు. అందు చే డొమీనియన్ స్టేటస్ (స్థాయి) అనబడినది అదే అదినివేశ స్వరాజ్యము అని తెలుగునాడులో వాడుకలోనుండినది. ఆ చరిత్రనే అధినేవేశ స్వరాజ్యముగా నిచ్చట వివరించబడినది. కాల క్రమేణ డొమీనియన్ అను ఆంగ్ల పదము పరిణామము చెంది స్వపరిపాలిత రాష్ట్రముగా అర్దమైనది. 1940 తరువాత 1947 మధ్య భారతదేశము, పాకిస్తాన్ దేశములను బ్రిటిష్ సామ్రాజ్యములో భాగములుగా డోమీనియన్ స్టేటస్ లు కలుగజేయబడినవి. 1947 ఆగస్టు 15 తేదీనుండీ 1948 జనేవరి 26 తేదీ మధ్య భారతదేశమున ఇండియన్ డొమీనియన్ (Dominion of India)గా వ్యవహరించబడినది. జనేవరి 26, 1948 తేదీన భారతదేశ రాజ్యాంగము విడుదలచేసిననాటి నుండి సంపూర్ణ స్వామిత్వము (Sovereign Republic). ఆరు నెలల పాటు డొమీనియన్ ఆఫ్ ఇండియా గా సంభోదించబడిన భారతదేశము గురించి వేరుగా వివరించబడినది. (చూడు బయటి లింకులు)
 
==బ్రిటిష్ సామ్రాజ్య రూపురేఖలు. 19- 20 వశతాబ్ధమునాటి చరిత్ర ==
Line 9 ⟶ 12:
 
=== అధినివేశ స్వరాజ్యములు===
1926 లో సమావేశమైన బ్రిటిష్ సామ్రాజ్యసభ(Imperial Conference) వారి తీర్మానమునందుతీర్మానమునందును, 1931 సంవత్సరపు వెస్టుమినిస్టర్ చట్టమునందును వివరించబడిన అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు ఉల్లేఖన <ref name="ది.వేం.శి(1933)"/>
<br>
(1) "బ్రిటిష్ దీవులును, అధినివేశ స్వరాజ్యములు ఆంగ్లరాజుయొక్క మకుటమునెడల భక్తిమాత్రముచేతనే సంశ్లిష్టత గలిగి యుందురు". బ్రిటిష్ దీవులును, అధినివేశ స్వరాజ్యములు సామ్రాజ్యములో సరిసమానమైన భాగములు <br>
Line 17 ⟶ 20:
పై చెప్పిన లక్షణములకలిగిన స్వరాజ్యములు అధినివేశస్వరాజ్యములు. వాటియొక్క రాజ్యాంగ విధానము బ్రిటిష్ దీవులలో గల ప్రజాప్రభుత్వములాంటివే. భారతదేశము 1931లో అధినివేశ స్వరాజ్యమైయుంటే
పార్లమెంటు అను ప్రజాప్రభుత్వ సంస్థ నెలకొనియుండి బ్రిటిష్ రాజ్యప్రతినిధిగానున్న గవర్నర్ జనరల్ (వైస్రాయి) బ్రిటిష్ సార్వభౌముని రాజరికమునకుచిహ్నముగా కొనసాగుతూనుండెడివాడు.
 
==బయటి లింకులు==
https://en.wikipedia.org/wiki/Dominion_of_India
 
 
==మూలాలు==