పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), నూ → నూ , ల్ని గురించి → ల గురించి , కూడ → కూడ using AWB |
పిచ్చిగుంట్ల ఇక్కడ విలీనం |
||
పంక్తి 1:
;[[ఆంధ్ర ప్రదేశ్]]<nowiki/>లో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళా రూపం
;తెలుగు జానపద సంగీతానికి వేల సంవత్సరాలుగా ప్రాణభిక్ష పెట్టిన వారు భిక్షుక గాయకులు. పిచ్చుకుంట్లు, శారదకాండ్రు, వీరముష్టులు, జంగాలు, దాసర్లు, బుడబుక్కల, బవనీలు, జక్కులవాళ్ళు, బొమ్మలాటగాళ్ళు . [[పిచ్చికుంట్ల]] వారు వంశ, కుల, గోత్రాలను, రామయణ, భారతాది కథలను అన్ని కుటుంబాల వారికి చెబుతూ ధాన్యం, సంభావనలు తీసుకొనే వారు, కొమ్ము ఊదేవారు.ఎక్కువగా ప్రకాశం జిల్లా నుండి వచ్చారు.
== పండితారాధ్య చరిత్రలో ==
;ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని [[పాల్కురికి సోమనాథుడు]] పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.
<poem>
వీవంగ చేతులు లేవయ్య .. నడచి
Line 7 ⟶ 10:
దాన మొసగరే ధర్మాత్ములార.
</poem>
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు [[అంగవైకల్యం]] కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, ''దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు [[యాచకులు|యాచకులని]] అర్థమౌతూ వుంది.
;పద్యం
<poem>
గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచ్చు గుంట్ల, యో
Line 17 ⟶ 20:
</poem>
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రథమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన [[కమ్మ]] వారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడా చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు. పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ,
==వారు చెప్పే కథలు==
[[తెలంగాణా]] లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి, [[పర్వతాల మల్లార్తెడ్డ]], సూర్య చంద్ర రాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు. ఇలా [[రాయలసీమ]]లో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. [[నెల్లూరు]], [[గుంటూరు]] ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగ వైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు.
==మూర్తీ భవించిన శైవం==
పిచ్చుకుంటుల వారందరూ మూర్తీ భవించిన వీర శైవ మతాన్ని ఆరాధించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా వీరు శక్తి ఉపాసనా పరులు. రేణుకా మహాత్మ్యాన్ని, పోచమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, మూహూరమ్మ కథలను ప్రచారం చేయడమే కాక వారు నమ్మిన
==పిచ్చుకుంటుల పేరెందుకు వచ్చింది==
అక్కడక్కడా ఈనాడు మనకు కనిపించే పిచ్చు కుంటుల వారిని గురించి అసలు మీ పుట్టు పూర్వోత్తరా లేమిటో అని ప్రశ్నిస్తే, వారీ విధంగా ఒక గాథను వివరిస్తారు. త్రిమూర్తుల వివాహ సందర్భంలో వారి వారి గోత్రాలు వల్లించటానికి మూడు మట్టి బొమ్మల్ని చేసి వాటికి ప్రాణం పోశారనీ, అలా బొమ్మల నిర్మాణంలో ఒక బొమ్మ కాలు కుంటిగా వుండటం వల్ల అతని సంతాన మంతా భిక్షమెత్తే కుంటి వాళ్ళయ్యారనీ, చెపుతూ, మరో కథను కూడా చెపుతారు. ఏడుగురు యాదవ కాంతలు సంతానం కోసం భక్తి శ్రద్ధల్తో శివుని గూర్చి తపస్సు చేశారనీ వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక కుంటి బాలును పెంచమని వరమిచ్చాడనీ, ఆ తరువాత
==చంద్ర శేఖరుని వర్ణన==
Line 32 ⟶ 35:
<blockquote> <big>మన ఇరుగు పొరుగున వున్న కన్నడ రాష్ట్రంలో కూడ పిచ్చు కుంటుల వారున్నారు. వారంతా కూడా శ్రీ శైల మల్లికార్జునభక్తులే. వీరిలో దావన కుంట్లు, ఎద్దుకుండ్లు, గంట కుంట్లు మొదలైన తెగల వారున్నారు. పిచ్చు కుంటుల వారి వేష ధారణ కథకునికి హుందాయైన తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలూ, కాళ్ళకు గజ్జెలూ వుంటాయి. ఈయన చరణాన్ని పాడుతూ వుంటే, మిగిలిన వారిద్దారూ దీర్తం తీస్తూ కథకుని గొంతుతో గొంతు కలుపుతారు. ఒక మూడ వ్వక్తి ఒక శ్రుతి చెవులకు తగిలించు కుని గుక్క విడువని శృతి పోస్తూ వుంటాడు. ఈ శృతి చెవులకు ఎంతో ఇంపుగా వుంటుంది. ఈ శృతిని ఆధారం చేసుకుని పిచ్చు కుంటుల కథా విధానాన్ని నడుపుతూ వుంటారు. కథలో వచ్చే ఆయా పాత్రల మనస్తత్వాల ననుసరించి కథకుడూ, వంత దాదుడూ, ఆ పాత్రల్లోకి మారి పోతారు. పిచ్చు కుంటుల కథా విధానం ఎలా వుంటుందో పల్నాటి యుద్ధంలో బాల చండ్రుడు యుద్ధంలో దూకిన ఘట్టాన్ని వింటే బోధ పడుతుంది.</big>
</blockquote>
;రగడ
<poem>
కుప్పించి ఎగసిన - కుండలంబుల కాంతి
Line 51 ⟶ 54:
అదే పిచ్చుకుంటుల కథా విధానాన్ని 1943 లో వచ్చిన కంట్రోలు, రేషనింగు విధానాల ద్వారా కరువుతో ప్రజలు పడిన బాధలను వివరిస్తూ వారి సమస్యలు తీసుకుని కోసూరి పున్నయ్య, ఆకలి మంటలు అనే పిచ్చుకుంటుల కథను వ్రాసి ప్రజా నాట్య మండలి ద్వారా ప్రచారం చేశారు. తక్కువ సంపాదనతో ఎక్కువ రోజులు పస్తులుండే పేదవారి బ్రతుకుల గురించి ఇలా వివరించారు.
;ద్విపద
<poem>
తిండికి బట్టకీ - తిప్పలొచ్చేను
Line 80 ⟶ 83:
==సూచికలు==
{{మూలాలజాబితా}}
మూలం: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.▼
▲తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.
==యితర లింకులు==
|