దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
[[Devarakondafromhill.JPG|thumb|left|దేవరకొండ కోటనుండి పట్టణ దృశ్యము]]
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ [[రేచర్ల నాయకులు|రేచర్ల నాయకుల]] కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. [[నల్గొండ]], [[మహబూబ్ నగర్]], [[మిర్యాలగూడ]] మరియు [[హైదరాబాదు]] నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
 
===చరిత్ర===
గతంలో కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన పద్మనాయక వంశస్థులకు చెందిన భేతాళ నాయకుడు సంతతి వారు దేవర కొండ రాజ్యాన్ని స్థాపించి నట్టుగా చారిత్రిక ఆధారలను బట్టి తెలుస్తున్నది. వీరి తరంలో రెండవ మాదానాయుడు కాలంలోనె దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాదారలనుబట్టి తెలుస్తున్నది. ఇతనికాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది.ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ ధుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.
 
===విశేషాలు===
ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు ఉన్నాయి. ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు ఉన్నాయి. కోటకు 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, కోటలో 23 పెద్ద బావులు, 53 దిగుడుబావులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలున్నట్లు ఆధారాలున్నాయి. అత్యంత కళాకృతమైన సింహ ద్వారాలు కలిగిన ఈ కోట ఏనాడు శతృవుల వశం కాలేదు. కాని ఆనాటి రాజకీయ కారణాల చేత రాజైన రెండవ మాదానాయుడి కాలంలో పాలకులు స్వచ్ఛందంగా కోటను వదిలి విజయనగర రాజుల వద్ద ఆశ్రయం పొందినట్టుగా చరిత్రను బట్టి తెలుస్తుంది.
 
===ప్రస్తుత పరిస్థితి===
 
ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రిక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడా శిథిలమౌతున్నాయి. దుండగులు గుప్తనిదులకొరకు జరిపిన త్రవ్వకాలలో అనేక విలువైన కళా ఖండాలు ద్వంశం చేయ బడ్డాయి.
 
===ఎక్కడున్నది===
[[హైదరాబాదు]] నుండి [[నాగార్జున సాగర్]] వెళ్ళే రహదారిలో [[మల్లెపల్లి]] గ్రామం ఉంది. అక్కడినుండి 7 కిలోమీటర్ల దూరంలోనె దేవరకొండ దుర్గం ఉంది.
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు