క్షణం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
లింకులు |
|||
పంక్తి 22:
== కథ ==
రిషి ([[అడివి శేష్]])
రిషి హైదరాబాదులో ఓ హోటల్ లో దిగి కారును అద్దెకిచ్చే బాబూ ఖాన్ ([[వెన్నెల కిశోర్|వెన్నెల కిషోర్]]) దగ్గర నుంచి ఒక కారు అద్దెకు తీసుకుంటాడు. శ్వేతను కలిస్తే ఆమె తన కూతురు బడికి వెళుతుండగా ఎవరో అపహరించారనీ, తనకు పోలీసుల నుండి గానీ, పాఠశాల యాజమాన్యం నుండి గానీ ఎలాంటి సహాయం అందడం లేదనీ, కాబట్టి రిషిని తనకు సహాయం చేయమని అడుగుతుంది. ఆమె భర్త కార్తీక్ ([[సత్యదేవ్ కంచరన]]) అసలు ఏమీ పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయి ఉంటాడు. పోలీస్ స్టేషన్లో కేసుఫైలును చూస్తే సరైన సమాచారం లేక కేసును మూసేశారని తెలుస్తుంది. పాఠశాలకు వెళ్ళినా అదే పరిస్థితి ఎదురవుతుంది.
ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో రిషి శ్వేత మరిదియైన బాబీని ఓ సిసి టివి లో చూసి వెంబడిస్తాడు. అతను కొంతమంది నైజీరియా ముఠాను కలుస్తాడు. అక్కడికి వెళితే అందులో బాబూ ఖాన్ పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. రిషి అతన్ని నిలదీయగా తాను ఆ ముఠా నుండి మాదకద్రవ్యాలను నగరంలో వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంటాననీ, అందుకు తనకు బాగా డబ్బు కూడా వస్తుందని ఒప్పుకుంటాడు. విషయం ఎటువైపు వెళ్ళినా దారులు మూసుకుపోవడంతో చివరికి రిషి ఆ పాప అపహరణకు గురైనట్లు పత్రికల్లో ప్రకటన ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకుని డబ్బు దండుకోవాలని చాలామంది దగ్గర్నుంచి ఫోన్లు వస్తాయి కానీ, చివరికి తనను ఆఫీసులో కలవమని కార్తీక్ నుండి ఫోన్ వస్తుంది. అక్కడ కార్తీక్ అసలు శ్వేతకు, తనకు పిల్లలే లేరనీ, కిడ్నాపర్లు కొట్టిన దెబ్బల వల్ల ఆమె అలా మతి చలించి మాట్లాడుతుందని చెబుతాడు. అప్పుడు రిషి అసలు శ్వేత దగ్గర తన కూతురు రియా పాస్ పోర్టు సైజు ఫోటో తప్ప ఇంకేమీ ఆధారాలు లేవని చెబుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఏమీ కనిపించవు.
రిషి వల్లి శ్వేత దగ్గర అదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఎప్పుడో కలిసున్న రిషినే గుర్తున్నపుడు ఇటీవలే మాయమైన తన కూతురు రియాను ఎలా మరిచిపోగలనని నిలదీస్తుంది. అప్పుడే రిషి ఆలోచిస్తూ ఉండగా ఒక గోడకు ఒక పాప ఎత్తు కొలిచినట్లు గీతలు కనిపిస్తాయి. అప్పుడే శ్వేత చెప్పింది నిజమే అనిపించి వెనక్కు తిరగ్గా ఆమె కిటికీలోనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. రిషి తన చేసిన తప్పును తెలుసుకుని బాబు ఖాన్ ని నిలదీయగా తాను ఒకసారి బాబీ దగ్గర రియాను చూసినట్లు చెబుతాడు. బాబూఖాన్ సహాయంతో రిషి బాబీని పోలీసులకు పట్టిస్తాడు. స్టేషన్లో అతన్ని ఏసీపీ జయ ([[అనసూయ భరద్వాజ్|అనసూయ]]), రవి చౌదరి
అక్కడ బాబీ మనుషులు కొందరు బాబూఖాన్ ను తీవ్రంగా గాయపరిచి తన మీద కూడా దాడి చేస్తారు. తాను తిరగబడగా వాళ్ళు ఓ ఫోను అక్కడ పారేసి వెళ్ళిపోతారు. ఆఫోను ఒక పేరులేని నంబర్ల నుండి అసలు చంపేశారా లేదా అని ఓ సందేశం వచ్చుంటుంది. ఆ వ్యక్తి ఇతనే అని జయ అతన్ని తీసిన ఫోటో ఉంటుంది. అప్పుడు రిషి ఏసీపీ జయ తనను చంపడానికి ప్రయత్నిస్తుందని తెలుసుకుంటాడు. రిషి జయను వెతుక్కుంటూ ఆమె ఫాం హౌస్ కి వెడతాడు. అక్కడ ఆమెను వెతుకుతుండగా జయ తనకు గన్ను గురిపెడుతుంది. అతను ఆమెను నిలదీయగా రియా తన దగ్గరే ఉన్నదని బదులిస్తుంది. లేకపోతే కార్తీక్ ఏర్పాటు వలన రియా చనిపోయి ఉండేదనీ, అందులోనూ తనకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని అందుకనే రియాను తన దగ్గరే ఉంచుకున్నానని చెబుతుంది. కార్తేకే రియాని మాయం చేసి అందరి కళ్ళు కప్పాడని తెలుస్తుంది. రియా నిజానికి కార్తీక్ కూతురు కాదని, అందుకనే ఆమెను చంపి శ్వేతను చిత్రవధ చేశాడనీ చెబుతుంది. ఈలోపు రవి చౌదరి వచ్చి ఎసిపిని కాల్చి చంపడంతో రిషి గాయాలతో బయటపడతాడు. చివరికి రియా తన కూతురేనని రిషికి తెలియడంతో కథ ముగుస్తుంది.
|