Yashoda devi గారు తాను రచించిన The History of Andhra country, 1000A.D - 1500A.D అనే పుస్తకంలో ఈ సరోనాధులు గూర్చి ప్రస్తావించారు. సరోనాధులు లేక కొలనుమండలీకులు సరసిపుర(నేటి ఏలూరును) రాజధానిగా చేసుకొని కొలను విషయను పరిపాలించారు. సరోనాధులులలో ప్రముఖుడు "తెలుగు భీముడు" ఇతడి పేరు మీద వెలసిన గ్రామమే నేటి భుజబలపట్నం. దండి మహా కవి తన దశకుమార చరిత్ర లో తెలుగు భీముడి గూరించి గొప్పగా వ్రాసాడు.తెలుగు భీముడు "తూర్పు గాంగులు'' (గంగా సామ్రాజ్యం) రాజులైన కళింగ వజ్రహస్త , రాజరాజ మరియు అనంతవర్మచోడ గంగా అనే రాజులకు విధేయుడుగా ఉండేవాడు.అంతే కాదు చాలుక్య రాజైన 6వ విక్రమాదిత్యుడితో కూడా విధేయుడుగా వ్యవహరించాడు. క్రీ''.శ 1076 లో 6వ విజయాదిత్యుని మరణం తరువాత వేంగి రాజుల పరిపాలన ముగిసింది. వేంగి రాజు కులోత్తుంగ చోళుడు([[రాజరాజ నరేంద్రుడు|రాజరాజ నరేంద్రుడి]] కొడుకు) తన 4వ కొడుకైన విక్రమచోళుడిని వేంగిపురానికి మహారాజును చేశాడు.విక్రమ చోళుడు శాలివాహన శకం 1042(క్రీ" .శ 1120) లో పరిపాలనలో ఉన్నట్లు కర్ణాటక రాష్ట్రం లోని సిద్దగట్ట శిలాశాసనం భట్టి తెలుస్తుంది.(Epigraphia Carnatica, volume 10, part-1,) వేంగిలో[[వేంగి]]లో విక్రమచోళుడి విదేశిపాలన ప్రమాదంగా భావించి తెలుగు భీముడు తిరుగుబాటు చేసాడు.తరువాత విక్రమచోళుడు తెలుగు భీముడిని చంపినట్లు అనేక శిలాశాసనాలలో పోందుపరచడమైనది. తరువాత కొన్ని తమిళ శిలాశాసనాలు భట్టి విక్రమచోళుడు దక్షిణ ప్రాంతాన్ని ఎలడానికి ఉత్తర ప్రాంతమైన వేంగిని వదిలేసాడని తెలుస్తుంది. ఈ విషయము Epigraphy by Archaeological Survey of India. Southern circle, అనే పుస్తకంలో కూడా ఉంది.<ref>[https://books.google.co.in/books?id=-d9IAvFOUHsC&pg=PA209&dq=saronathas&hl=en&sa=X&ved=0ahUKEwijxom6krrQAhUIPI8KHffbA18Q6AEIGTAA#v=onepage&q=saronathas&f=false The History of Andhra Country, 1000A.D - 1500A.D by Yashoda devi.]</ref>