కాంచీవరం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox film | name = కాంచీవరం | image = Kanchivaramfilm.jpg | caption = Poster | director = ప్రియ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
'''కాంచీవరం''' 2008లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం. ఇందులో [[ప్రకాష్ రాజ్]], [[శ్రియా రెడ్డి]] ప్రధాన పాత్రధారులు. ఎం. జి. శ్రీకుమార్ సంగీత దర్శకత్వం వహించాడు.
 
== కథ ==
అది 1948వ సంవత్సరం. వేంగడం ([[ప్రకాష్ రాజ్]]) జైలు నుంచి అప్పుడే జైలు నుంచి తీసుకువస్తుంటారు. అతనికి ఇద్దరు పోలీసులు రక్షణగా ఓ బస్సులో తీసుకు వచ్చి అతని స్వస్థలమైన కాంచీపురానికి తీసుకువస్తారు. ఆ బస్సులో తీసుకు వచ్చేటపుడు అప్పుడప్పుడు అతని గతం గుర్తుకు వస్తుంది.
 
వేంగడం కాంచీపురంలో పట్టుబట్టలు నేసే కార్మికుడు. అతనికి అప్పుడే కొత్తగా అన్నం ([[శ్రియా రెడ్డి]]) పెళ్ళై ఉంటుంది. పెళ్ళి కాక మునుపు ఓ సారి తాను పట్టుచీర కట్టుకున్న అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని అనుకుని ఉంటాడు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామూలు బట్టలతోనే సరిపెట్టుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత అతని చెల్లెలు భర్త తన వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందనీ, అతని చెల్లెల్ని పోషించలేనని చెప్పడంతో చెల్లెలు కాపురాన్ని బాగు చేయడం కోసం, ఆమె పరువు కాపాడటం కోసం వేంగడం అప్పటి దాకా తాను దాచుకున్న సొమ్మంతా బావకిచ్చేస్తాడు. దాంతో భార్యకు పట్టుచీర కొనాలన్న కోరిక మళ్ళీ అటకెక్కుతుంది. మరి కొద్ది రోజులకు వాళ్ళ ఊరికి ఓ రచయిత వస్తాడు. అతను ఉండటానికి ఎక్కడైనా స్థలం చూపించమనడంతో వేంగడం తన స్నేహితుడిల్లు చూపిస్తాడు. నిజానికి రచయిత కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాడు. అక్కడి నేత కార్మికులు అణిచివేతకు గురవుతున్నారనీ, వాళ్ళకు సరిపడా జీత భత్యాలు అందడం లేదనీ, కనీసం వారు నేసిన బట్టలే వారు కట్టుకోలేక పోతున్నారనీ అందరినీ చైతన్య పరుస్తూ ఉంటాడు. కొంతకాలానికి వేంగడం, మరికొంతమందితో కలిసి అతన్ని సమర్ధించడం ప్రారంభిస్తారు. వాళ్ళందరినీ పనిలో పెట్టుకుని నేత వ్యాపారం సాగిస్తున్న జమీందారు మీద వ్యంగ్యంగా వీధి నాటకాలు వేయడం మొదలు పెడతారు. కొద్ది రోజులకు ప్రజల్లో అశాంతిని రేపుతున్నాడని కారణంగా పోలీసులు ఆ రచయితను కనిపెట్టి మట్టుపెడతారు. దాంతో ఆ ఉద్యమం వేంగడం చేతుల్లోకి వెళుతుంది. అతని సారథ్యంలో చేనేత కార్మికులంతా కలిసి తమ వేతనాలు పెంచాలనీ పిటిషను దాఖలు చేస్తారు.
 
కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడి కొడుకు ఒకడు సైన్యం నుంచి తిరిగి వస్తాడు. అతన్ని వేంగడం కూతురు ప్రేమిస్తుంటుంది. అతను బ్రిటిష్ వారు యుద్ధంలో జర్మన్లను ఓడించబోతున్నారనీ కమ్యూనిస్టులకు కాలం చెల్లబోతోందనీ చెబుతాడు. తాను మళ్ళీ యుద్ధానికి వెళ్ళే లోపు వేంగడం కూతురును వివాహం చేసుకోవాలంటాడు. వేంగడం కనీసం తన కూతురినైనా పట్టుచీరతో సాగనంపాలని అనుకుంటాడు. కానీ అప్పటికి సగం చీరే పూర్తి చేసి ఉంటాడు. జమీందారు మీద తిరుగుబాటు చేసి పని ఆపేసిన అందరినీ మళ్ళీ పనిలో చేరమంటాడు. దాంతో అందరూ అతన్ని మోసగాడిగా ముద్ర వేస్తారు. తాను పనిచేసే గుడి నుంచి కొద్ది కొద్దిగా పట్టు పోగులు దొంగతనంగా ఎత్తుకొచ్చె చీర నేస్తుంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత దొరికిపోయిన అతన్ని కొట్టి జైలుకు పంపిస్తారు.
 
కథ మళ్లీ ప్రస్తుతానికి వస్తుంది. అతని కూతురు పొరపాటున కాలు జారి బావిలో పడిపోయి పక్షవాతానికి గురై ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే ఆమె తల్లి జమీందారు కొత్త కారును చూడ్డానికి వెళ్ళిన జనాల తొక్కిసలాటలో మరణించి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసుకోవడానికి కూడా ఎవరూ ఉండరు. దాంతో వేంగడం తన చెల్లెల్ని పిలిచి ఆ అమ్మాయిని తన ఇంట్లో ఉంచమంటాడు. కానే ఆమె ఓ దొంగ కూతురు తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని ఖరాకండీగా చెబుతుంది. వేంగడం ఏమి చేయాలో పాలుపోక కన్నకూతురికే విషమిచ్చి చనిపోయేలా చేస్తాడు. కూతురు శవాన్ని ఇంటి ముందు ఉంచి లోపలికి వెళ్ళి తాను సగంలో ఆపేసిన చీరను ఆమెకు పూర్తిగా కప్పాలని అన్ని విధాల ప్రయత్నిస్తాడు. పోలీసులు వచ్చి ఇంక సమయమైందని చెప్పగానే వెర్రి చూపులు చుస్తూ పిచ్చి నవ్వు నవ్వుతాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచీవరం" నుండి వెలికితీశారు