గుండ్లూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 104:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం===
ఈ పురాతన ఆలయం గ్రామములో చెయ్యేరు నదీ తీరాన ఉన్నది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఏదో ఒక రోజున, గంగా జలం ఉప్పొంగి, అగస్తేశ్వరస్వామివారి మూల విరాట్టుని అభిషేకించుచున్నది. ఈ గంగా జ్లం ఎక్కడినుండి వచ్చుచున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కార్తీకమాసంలో బుగ్గ (ఊట) పుట్టి, మూల విరాట్టుని అభిషేకించడం ఇక్కడి విశిష్టతగా స్థానికులు చెప్పుకుంటారు. గత సంవత్సరం ప్రక్కనే ఉన్న చెయ్యేరు నదిలో నీరున్నాగానీ ఆలయంలో బుగ్గ పుట్ట లేదు. ఈ సంవత్సరం 2016,నవంబరు-26వతేదీ, కార్తీకమాసం, శనివారం మద్యాహ్నం, జలం ఉద్భవించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకును పూజలు నిర్వహించినారు. శివుడి మూల విరాట్టుని అభిషేకించిన గంగా జలాన్ని, పూజారులు సేకరించి భక్తులకు పంపిణీ చేసినారు. [2]
===శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం===
ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
|