ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎స్వస్థలము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అధారము → ఆధారము, గ్రామస్తులు → గ్రామస్థు using AWB
పంక్తి 4:
==జీవిత కాలము==
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో sussu
. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించినది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 21వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 2003 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను.ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆత్మకూరివారు.వంగడమునుబట్టి '''కుమ్మరి మొల్ల''' అని విశ్వమున వ్యవహరించబడుచున్నది.ఈమె జనకుడు '''కేతనపెట్టి'''.గ్రంధావతారికలో ఆదికవి స్థుతియందు [[శ్రీనాధుడు]] ని స్మరించియుండుటచే ఈమె శ్రీనాధుడు తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించినారు.ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.[[గ్రంధావతారిక]] ను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపరపు శ్రీకంఠ మల్లేశుకృపను కవిత్వమును చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంధములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె పద్యముల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును.ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. '''పలికెడది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట...''' అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు '''చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్''' అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును నెందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారు చుండుటతానీ గ్రంధమును చేపట్టుటకు కారణమని చెప్పినిది.మరియు అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసినది.
 
గ్రంధావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరుధుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది.ఉత్తరరామాయణముని స్పృశించలేదు.
 
సాధారణముగా కవులు వర్ణనాదులయందు జటిలమై, సుదీర్ఘమైన [[సమాసము]] ల నొడగూర్చితమ పాండిత్యప్రకర్షను చూపింతురు.శాబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చి ప్రబంధయుగమున పుట్టిన మొల్ల శాబ్దాడంబరమునకు లోనుగాక యలతి యలతి పదములతోనే రచన సాగించి పేరొనొందినది. చిన్ని చిన్ని గీతములలో పెద్ద భావముల నిముడ్చుట ఈమె సహజ గుణము. '''జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలు కూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు'''. పదబంధముల యందు ఈమెకు చక్కని నేర్పు కలదు.
 
[[తిక్కన]] వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదు. హనుమంతుడు సముద్రమున దాటునపుడు ఈమె ఆప్రాంతమును చూచినది గాబోలు అనిపించును, ఆసముద్రోల్లంఘన మెంత సత్యసముపేతముగా వర్ణించెనో చూడండి:
 
మొగము బిగించి, పాదముల మొత్తముగానట నూదిత్రొక్కి,నీ
టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి బాహు ల
త్యగణితలీలమాచి, వలయంబుగ వాలముద్రిప్పి వృఎగునన్
నగము సగంబు క్రుంగ గపినాధుడు నింగి దాటె రివ్వునన్!!!
 
==స్వస్థలము==
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు